అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
‘అనకాపల్లి ఎంపీగా గెలవగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి చర్యలు చేపడతానని కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు.
మాట్లాడుతున్న వంగవీటి రాధా
మాడుగుల, న్యూస్టుడే: ‘అనకాపల్లి ఎంపీగా గెలవగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి చర్యలు చేపడతానని కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. మాడుగుల అసెంబ్లీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి, తెదేపా నాయకుడు వంగవీటి రాధాతో కలిసి శనివారం రాత్రి మాడుగులలో రోడ్షో నిర్వహించారు. సీఎం రమేశ్ మాట్లాడుతూ.. తాను విశాఖపట్నం ఎంపీ టికెట్ కోరితే.. ప్రధాని మోదీ అభివృద్దిలో వెనుబడిన అనకాపల్లికి పంపారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా ముత్యాలనాయుడు దోచుకున్నంత దోచుకుని, ఇపుడు ఆయన కుమార్తెను పంపారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పైలా ప్రసాదరావు కూటమి అభ్యర్థుల విజయానికి పనిచేస్తారని చెప్పారు.
- వంగవీటి రాధా మాట్లాడుతూ.. కూటమి గెలుపుపైనే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. సీఎం రమేశ్, బండారు కలయికతో మాడుగుల ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. బండారు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తదితరులు మాట్లాడారు. నాయకులు పీవీజీ కుమార్ అప్పలరాజు, జగ్గారావు, దేముడు, రంజిత్, కృష్ణ, గంగయ్య, సునీత, సూర్యారావు పాల్గొన్నారు.
అనకాపల్లి, లక్ష్మీదేవిపేట, కశింకోట, న్యూస్టుడే: కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే యువతకు అండగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. తెదేపా రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో శనివారం 81వ వార్డు తెదేపా, జనసేన, భాజపా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగజగదీశ్వరరావు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, సంతోషిమాత దేవస్థానం మాజీ ఛైర్మన్ మళ్ల రాజు పాల్గొన్నారు. పట్టణంలోని విజయరామరాజుపేటలో జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైకాపాకు చెందిన 50 మంది యువకులకు కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. కశింకోట మండలం నర్సింగబిల్లి గ్రామానికి చెందిన పాలసంఘం అధ్యక్షులు, స్థానిక వైకాపా నాయకులు కోన సురేష్, ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులతో రామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
కొత్తూరు (అనకాపల్లి), న్యూస్టుడే: మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి మండలం సత్యనారాయణపురం, పిసినికాడ, సుందరయ్యపేట తదితర పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావలసిన చారిత్రక అవసరాన్ని అందరూ గుర్తించాలన్నారు. పచ్చికూర రాము, గెంజి సత్యారావు, జోగా భాను పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలన దగా.. బడుగుజీవి భగభగ!
[ 12-05-2024]
ఆదాయం గుప్పెడంత పెరుగుతుంటే ఖర్చులు కొండలా పెరుగుతున్నాయి. తప్పనిసరి అవసరాలకు, తప్పించుకోలేని ఖర్చులకు మధ్య జనం కిందమీదా పడుతున్నారు. -
కోడ్ ఉల్లంఘించి రోడ్డు పనులు ప్రారంభం
[ 12-05-2024]
జిల్లాలో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమాళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ భవనాలు, నిర్మాణాలకు వైకాపా రంగులు వేసిన నాయకులు పోలింగ్ దగ్గరపడటంతో గిరిజన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కోడ్ను ఉల్లంఘించి ఏకంగా రోడ్డు పనులు ప్రారంభించేశారు. -
నిఘా నీడలో మన్యం
[ 12-05-2024]
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరొందిన అల్లూరి జిల్లా పూర్తిగా నిఘా నీడలోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
రెండేళ్లలో నిర్వాసితులకు న్యాయం చేస్తాం
[ 12-05-2024]
పోలవరం నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి న్యాయం చేస్తుందని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష హామీ ఇచ్చారు. -
పోలింగ్కు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నోట్లతో ఓట్లవేట
[ 12-05-2024]
సార్వత్రిక సమరంలో ప్రచార పర్వం ముగిసింది.. ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటి వరకు చేసిన ప్రచారంలో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దఎత్తున కనిపించడంతో వైకాపా నేతలు కలవరానికి గురవుతున్నారు. -
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన
[ 12-05-2024]
ఐదేళ్ల క్రితం జగన్ ఇదేమాట చెప్పారు. ఎన్నెన్నో చేస్తామన్నారు. అందరినీ ఉద్ధరిస్తా మన్నారు.. గద్దెనెక్కాక పాత పథకాలకు కొత్త పేర్లుపెట్టారు అన్నింటికీ బటన్లు నొక్కేశామన్నారు. -
అరకులో కూటమికే మొగ్గు!
[ 12-05-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూనే అడవి బిడ్డలను జగన్ నట్టేట ముంచారు. అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాలను గిరిజనేతరుల చేతిలో పెట్టి సహజ వనరులను దోచుకున్నారు. -
రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్
[ 12-05-2024]
గత ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ఒక్క అవకాశమంటూ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విమర్శించారు. -
ప్రజల భూములు కాజేసే కుట్ర
[ 12-05-2024]
ప్రజల భూములను కాజేసేందుకు వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేసిందని ఎన్డీఏ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. -
దాడులపై డీజీపీ, ఈసీలకు గీత ఫిర్యాదు
[ 12-05-2024]
అడ్డతీగల మండలం ఎల్లవరంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఉమ్మడి కూటమికి చెందిన కార్యకర్తలపై వైకాపా దాడులు చేయడం అమానుషమని అని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ముగిసిన ప్రచార పర్వం
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. జిల్లాలో ఈనెల 13వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల పోలింగ్ జరగనుంది.