సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేదు..
తాడి తరలింపు ఎప్పుడో..?
పరవాడ, న్యూస్టుడే : ‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు. ఈనెల 28 నాటికి రెండేళ్లవుతున్నా ఒక్క ఇటుక కూడా పడలేదు. సాక్షాత్తూ సీఎం జగన్ ఇచ్చిన హామీయే అమలుకు నోచుకోకపోతే తమ సమస్యల పరిష్కారానికి ఎవరికి మొర పెట్టుకోవాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడిని తరలించేవరకు ఓటింగ్లో పాల్గొనబోమని గతనెల 28న గ్రామస్థులంతా ఏకగ్రీవ తీర్మానం చేసి జిల్లా ఉన్నతాధికారులకు అందజేసినా చలనం లేదు.
కాలుష్య కాసారంతో ఇక్కట్లు
ఫార్మాసిటీ కాలుష్యం తాడి గ్రామస్థులను గత 15 ఏళ్లుగా వెంటాడుతోంది. పరిశ్రమల నుంచి వచ్చే మందుల వాసన, విషవాయువుల కారణంగా తరచూ అనారోగ్యబారిన పడుతున్నామని, పలు పరిశ్రమల్లో భారీ పేలుళ్లు, గ్యాస్ లీకేజీలు సంభవించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య భూతాన్ని తట్టుకోలేక 50 కుటుంబాల వారు వేరే గ్రామాలకు తరలిపోయారు.
తెదేపా జీవోకు వైకాపా ఉరి..
తాము అధికారంలోకి వస్తే తాడిని తరలిస్తామని 2014 ఎన్నికల ముందు తెదేపా హామీ ఇచ్చింది. గెలిచిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తాడి సమస్యను అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తరలింపు ప్రక్రియను వేగవంతం చేయించారు. గ్రామ సభలు పెట్టి ప్రజల అభిప్రాయాలను అధికారులు తెలుసుకున్నారు. గ్రామాన్ని పెదముషిడివాడలో ఉన్న ప్రభుత్వ స్థలంలోకి తరలించి పునరావాసం, భవన నిర్మాణాలు, పరిహారం చెల్లించడానికి ఆర్అండ్ఆర్ నిధులు రూ.57.63 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. అనంతరం వైకాపా ప్రభుత్వం ఏర్పడటంతో ఆ జీవోకు బ్రేక్ పడింది.
ఫార్మాసిటీని ఆనుకుని ఉన్న తాడి గ్రామం
జగన్ హామీని నమ్మి మోసపోయాం..
ఫార్మాకాలుష్యంతో అల్లాడిపోతున్నాం. ఘాటైన మందుల వాసనతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. ప్రభుత్వం కనీసం శుద్ధినీటిని కూడా సరఫరా చేయడం లేదు. ఉపాధి కూడా కరవైంది. జగన్ మాటలు నమ్మి మోసపోయాం. వైకాపా ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదు.
- కోమటి కులదీప్రాజు, తాడి
ఎమ్మెల్యే మాటలు నీటి మూటలే..
సీఎం జగన్ హామీ ఇచ్చినా తాడి గ్రామస్థులకు విముక్తి కలగలేదు. ల్యాండ్ఫిల్ విస్తరణ పేరుతో మరో కాలుష్య కుంపటి గ్రామస్థులపై మోపడం దుర్మార్గం. ఎమ్మెల్యే అదీప్రాజు తాడి తరలింపు జీవో పట్టుకుని గ్రామానికి వస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. గ్రామంలో కనీసం ఆరోగ్య శిబిరాలు పెట్టడం లేదు.
- గనిశెట్టి సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
ఓటింగులో వీరే ఆదర్శం
[ 16-05-2024]
రహదారి సౌకర్యంలేని మారుమూల గ్రామాల వారికి గో‘దారే‘ దిక్కుగా మారింది. శ్రీరామగిరి పంచాయతీ కల్తునూరు, తుమ్మిలేరు పోచవరం పంచాయతీ పరిధి కొల్లూరు, గొందూరు, తుమ్మిలేరు -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
అరకు పార్లమెంట్ పరిధిలో 73.68 పోలింగ్ నమోదు
[ 16-05-2024]
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 73.68 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం వెల్లడించారు. -
కూటమికే అనుకూల ఫలితాలు
[ 16-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా పాలనపై వ్యతిరేకత పెరిగింది అనడానికి సార్వత్రిక ఎన్నిల్లో పోలింగే నిదర్శనమని కూటమి పాడేరు శాసనసభ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. -
వరుస ప్రమాదాలతో బెంబేలు..
[ 16-05-2024]
జిల్లాలో జాతీయ రహదారితోపాటు గ్రామీణ రహదారులు వరుస ప్రమాదాలతో రక్తమోడుతున్నాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యం: పీలా
[ 16-05-2024]
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ 80 వేలకు పైగా, ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ 30 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. -
ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
మన్యంలో తప్పని డోలి మోతలు
[ 16-05-2024]
మన్యంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో డోలి మోతలు తప్పడం లేదు. -
మన్యం ఓటర్లు పోటెత్తారు..!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జనం ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేశారు. నియోజకవర్గం పరిధిలో 63.91 శాతం నమోదైనట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం బుధవారం ప్రకటించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
విశాఖ జిల్లాలో 70.03 శాతం పోలింగ్
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
-
యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి
-
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?