ఓటేయాలంటే.. తుమ్మిలేరులో తంటాలే
గోదావరి తీరంలో.. రహదారి సౌకర్యంలేని, మారుమూల పాపికొండల్లో ఉన్న చిన్న గ్రామం తుమ్మిలేరు. ఈ గ్రామంలో కొండపైన పోలింగ్ కేంద్రం ఉంది.
ఎన్నికల నిర్వహణకు వెళ్తున్న అధికారులు (పాత చిత్రం)
వరరామచంద్రాపురం, న్యూస్టుడే : గోదావరి తీరంలో.. రహదారి సౌకర్యంలేని, మారుమూల పాపికొండల్లో ఉన్న చిన్న గ్రామం తుమ్మిలేరు. ఈ గ్రామంలో కొండపైన పోలింగ్ కేంద్రం ఉంది. ఎన్నికల నిర్వహణ సిబ్బంది వెళ్లాలన్నా, ఓటర్లు ఓట్లు వేయాలన్నా.. పడవ ఎక్కితేనే అక్కడికి చేరగలరు. ఆ గ్రామాలకు సెల్ఫోన్ సంకేతాలు అందవు. అక్కడ ఏమి జరిగినా... బాహ్య ప్రపంచానికి తెలియడానికి గంటల సమయం పడుతుంది. విద్యుత్తు సౌకర్యం లేదు. కేవలం సౌర దీపాల వెలుతురే వారికి దిక్కు.
వరరామచంద్రాపురం మండలంలోని తుమ్మిలేరు పోచవరం పంచాయతీలో పోచవరం, తుమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు, గొందూరు గ్రామాలున్నాయి. వీటిలో పోచవరం మినహా ఏ గ్రామానికీ రహదారి సౌకర్యంలేదు. పోచవరం నుంచి పడవ లేదా లాంచీలో ప్రయాణిస్తే తప్ప ఆ గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి. మొత్తం 450 ఓటర్లున్న ఈ పంచాయతీకి రెండు పోలింగ్ కేంద్రాలను అధికారులు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. పోచవరంలో ఒకటి, తుమ్మిలేరు కొండపైనున్న పాఠశాలలో మరోటి అందుబాటులో ఉంచారు. పోచవరం గ్రామంలో వారికి ఇబ్బందులు లేవు. తుమ్మిలేరులో ఓటేయాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇందులో తుమ్మిలేరు, కొల్లూరు, గొందూరుకు చెందిన దాదాపు 250 మంది ఓటుహక్కు వినియోగించుకుంటారు. వీరంతా గోదావరి గట్లు ఎక్కి, దిగి... పడవల్లో ప్రయాణం చేసి, కొండపైకి ఎక్కి ఓటేసి, కిందికి దిగిరావాలి. ఒక్క అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే తుమ్మిలేరు పోలింగ్ కేంద్రం ఉంటుంది. పంచాయతీ ఎన్నికలకు వారంతా పోచవరం పోలింగ్ కేంద్రానికి రావాల్సిందే. ఇటీవలే ఈ కేంద్రాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ పరిశీలించి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బారులు తీరి.. కూటమికి బాసటగా నిలిచి..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలింగ్ను రెండు గంటల ముందుగా ముగించారు. -
మా ఓట్లు తొలగించారు..!
[ 14-05-2024]
ఓటరు జాబితాలో తమ పేర్లు తొలగించారంటూ కిర్రాబుకు చెందిన పలువురు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
మారేడుమిల్లిలో యువత సందడి
[ 14-05-2024]
దేశంతోపాటు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు పొంది, వినియోగించుకోవడం ద్వారా తమ వంతు బాధ్యతను నిర్వర్తించామని యువ ఓటర్లు అభిప్రాయపడ్డారు. -
మొరాయించిన ఈవీఎం... ఆలస్యంగా పోలింగ్
[ 14-05-2024]
రాజవొమ్మంగి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఈవీఎం, వీవీ ప్యాట్ల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. -
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రశాంతం..
[ 14-05-2024]
మావోయిస్టు ప్రభావిత ప్రాంతం చింతపల్లిమండలంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చింతపల్లి, చౌడుపల్లి, లోతుగెడ్డ, బైలుకించంగి, అన్నవరం, బలపం, కుడుముసారి పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయాన్నే రద్దీ నెలకొంది -
ఓటర్లతో వెళుతున్న వ్యాన్ బోల్తా
[ 14-05-2024]
-
జిల్లాలో 53.83 శాతం పోలింగ్
[ 14-05-2024]
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 53.83 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. -
వీరూ.. ఉత్సాహంగా ఓటేశారు
[ 14-05-2024]
వృద్దులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారూ ఓపిక చేసుకుని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ vs లఖ్నవూ.. నేటి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్పై ప్రభావమెంత..?
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!