logo

అర్ధరాత్రి నిద్రిస్తుండగా కత్తితో నరికి..

శుభ కార్యక్రమానికి వెళ్లి మేడపై నిద్రిస్తున్న వ్యక్తిని అర్ధరాత్రి వేళ కిరాతకంగా హతమార్చిన ఘటన పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. పెదబయలు ఎస్సై మనోజ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలం కాడెలి పంచాయతీ వర్తనపల్లి గ్రామానికి చెందిన శోభ హేమరాజ్‌(33), పెదబయలు మండలం ముసిడిపుట్టు గ్రామానికి చెందిన పల్లుల సుందర్‌రావుకు మధ్యలో రెండు సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయి.

Published : 29 Apr 2024 01:50 IST

హత్యతో పెదబయలులో కలకలం 

హేమరాజ్‌ (పాత చిత్రం)

పెదబయలు గ్రామీణం, పాడేరు, న్యూస్‌టుడే: శుభ కార్యక్రమానికి వెళ్లి మేడపై నిద్రిస్తున్న వ్యక్తిని అర్ధరాత్రి వేళ కిరాతకంగా హతమార్చిన ఘటన పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. పెదబయలు ఎస్సై మనోజ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలం కాడెలి పంచాయతీ వర్తనపల్లి గ్రామానికి చెందిన శోభ హేమరాజ్‌(33), పెదబయలు మండలం ముసిడిపుట్టు గ్రామానికి చెందిన పల్లుల సుందర్‌రావుకు మధ్యలో రెండు సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయి. పెదబయలులో ఈనెల 26న బంధువైన సీతగుంట మాజీ సర్పంచి కుమారుడి వివాహానికి హేమరాజ్‌ భార్యాపిల్లలతో కలిసి వచ్చాడు. శనివారం రాత్రి తైసాబు ఈశ్వరరావు ఇంటి మేడపై హేమరాజ్‌ నిద్రిస్తుండగా సుందర్‌రావు కత్తితో దాడి చేసి హతమార్చాడు. హతుడి భార్య స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య మహిళా పోలీసుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతడు పాడేరులోని ఓ ద్విచక్రవాహన షోరూంలో పనిచేసేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని