సరిహద్దులు దాటని అభివృద్ధి
ఓట్ల పండగ ముగిసి త్వరలో రానున్న ప్రభుత్వం పగ్గాలు అందుకోబోతోంది.
అభివృద్ధికి నోచుకొని జె.నాయుడిపాలెం రోడ్డు
రోలుగుంట, న్యూస్టుడే: ఓట్ల పండగ ముగిసి త్వరలో రానున్న ప్రభుత్వం పగ్గాలు అందుకోబోతోంది. రాష్ట్రానికి కొత్త సారథులు రాబోతున్నారు. అయిదేళ్లకోసారి ఈ ప్రక్రియ మామూలే అయినప్పటికీ గ్రామాల్లోని అభివృద్ధి మాత్రం ‘సరిహద్దులు’ దాటడంలేదు. ఎమ్మెల్యేలుగా ఎవరొచ్చినా వారి పరిధిలోని గ్రామాలను తప్ప పక్క వాటిని పట్టించుకోవడం లేదు. రోలుగుంట మండలంలోని పలు రహదారులే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి వీటిలో కొన్నింటికి ప్రతిపాదనలు వెళ్లినప్పటికీ కార్యరూపం దాల్చడంలో వెనుకబడ్డాయి. చోడవరం నియోజకవర్గ పరిధిలోని జె.నాయుడిపాలెం నుంచి నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం మండలం తూటిపాలకు వెళ్లే రోడ్డు ఏళ్ల తరబడి ఆధునికీకరణకు నోచుకోలేదు. చోడవరం నియోజకవర్గం కాముడిపాలెం నుంచి నర్సీపట్నం నియోజకవర్గం చెట్లుపల్లి మెటల్ రోడ్డు ఎన్నో ఏళ్ల నుంచి ప్రతిపాదనల దగ్గరే ఆగిపోయింది. ఈ కారణంగా ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. బుచ్చెయ్యపేట మండలం రాజాం, అనకాపల్లి నియోజకవర్గం కూండ్రం రోడ్డు అధ్వానంగా తయారైంది. ఈ రహదారిలో అక్కడక్కడా కొంతమేర మెరుగులు దిద్దినప్పటికీ చాలాచోట్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రానున్న ప్రభుత్వంలోనైనా వీటిని మెరుగుపరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు.
ప్రతిపాదనలకే పరిమితమైన కాముడిపాలెం రహదారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లెక్కింపునకు సర్వం సిద్ధం
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం జరగనుంది. జిల్లాలోని మూడు శాసనసభ, అరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల లెక్కింపునకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలెక్టర్ విజయ సునీత, -
ఉద్యానానికి ‘‘ఉపాధి’’ ఊతం
[ 02-06-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇకపై ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు తగ్గించి జూన్ నుంచి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. -
భీమిలి తీరంలో విధ్వంసం విజయవంతం
[ 02-06-2024]
ఆయన హయాంలో సీఆర్జెడ్ నిబంధనలపై నీతి వాక్యాలు వల్లె వేశారు. ఇప్పుడు తానే భీమిలి తీరంలో విధ్వంసానికి తెరలేపారు. ఎన్నికల కోడ్ విధుల్లో అధికారులుంటే, చాకిరేవు గెడ్డ పోరంబోకు భూ ఆక్రమణల్లో సదరు నేత నిమగ్నమయ్యారు. -
తపాలా బీమాతో ధీమా!
[ 02-06-2024]
అనుకోని ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే వారిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయం. భార్య/భర్త మరణిస్తే వారి పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. -
ఆఖరి మజిలీకి అవస్థలు
[ 02-06-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసి.. పునరావాస కాలనీలకు వచ్చిన ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఎవరైనా మృతిచెందితే వారి ఆఖరి మజిలీకి తీవ్ర అవస్థలు తప్పడం లేదు. -
పిడుగుపాటుకు క్రీడాకారుడి మృతి
[ 02-06-2024]
పద్మాపురం సమీపంలో శనివారం పిడుగుపడటంతో గిరి యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. -
ఎండల తీవ్రతకు పైపులైన్ పేలుడు!
[ 02-06-2024]
ఛత్తీస్గడ్, ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు వెళుతున్న ఐరన్ఓర్ పైపులైన్ శుక్రవారం అర్ధరాత్రి పేలిపోయింది. చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని దిగజనబ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు!
[ 02-06-2024]
కూటమికే ప్రజలు పట్టం కట్టనున్నారని, సర్వేలన్నీ అవే చెబుతున్నాయని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో భాజపా హవా
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం!
-
కెనడాను చిత్తు చేసిన యూఎస్ఏ.. టీ20ల్లో రికార్డు విజయం
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు