ఇక కట్టలేవులే.. వెళ్లు!
విజయవాడ సెంట్రల్ పేదలకు జగనన్న కాలనీ పేరుతో వెదురుపావులూరులో 3,702 మందికి నివేశన స్థలాలు (సెంటు) కేటాయించారు. కొండలను తవ్వి లేఔట్ వేశారు. ఇక్కడ మెరక చేయడానికి రూ.కోట్లు ఖర్చు చేశారు.
గృహ నిర్మాణ మంత్రి జిల్లాలోనూ జగనన్న కాలనీలకు దురవస్థే
మౌలిక వసతులు లేక ఏకంగా గృహాలకు తాళాలు
నిరుపేద గూడుకు జగనే గ్రహణం
ఈనాడు, అమరావతి
‘‘ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం.. నిరుపేద కల నెరవేరుస్తున్నాం.. ప్రతి అక్కచెల్లెమ్మకూ గృహ సౌభాగ్యం కల్పిస్తున్నాం’’
- ఊరూరా ఊదరగొట్టిన సీఎం జగన్
‘‘స్వస్థలాలకు సుదూరంగా స్థలాలు.. మెరక పేరిట అవినీతి మరకలు.. నీరు లేదు.. దారి లేదు.. విద్యుత్తు లేదు.. రవాణా లేదు.. ఒకటా రెండా ఐదేళ్లు వెలగబెట్టారు. మమ్మల్ని అప్పుల్లో ముంచారు.. ఇక మీ వల్ల కాదులే.. వెళ్లమని ప్రజలు ఛీదరించుకుంటున్నారు.’’
- జగనన్న కాలనీ దీనస్థితిపై పేదల వేదన
విజయవాడ సెంట్రల్ పేదలకు జగనన్న కాలనీ పేరుతో వెదురుపావులూరులో 3,702 మందికి నివేశన స్థలాలు (సెంటు) కేటాయించారు. కొండలను తవ్వి లేఔట్ వేశారు. ఇక్కడ మెరక చేయడానికి రూ.కోట్లు ఖర్చు చేశారు. కానీ ఈ మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఒక్క ఇల్లూ పూర్తి కాలేదు. పునాదులకే పరిమితం. ఇలాంటి లే ఔట్లు చాలా ఉన్నాయి. మైలవరం పరిధి చంద్రాలలో ఆదర్శకాలనీ అంటూ గృహప్రవేశాలు చేశారు. వసతులు విస్మరించడంతో అప్పు చేసి ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు గృహాలకు తాళాలు వేసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో జగనన్న కాలనీల పేరుతో 291 లేఔట్లు వేశారు. ఎన్టీఆర్ జిల్లావాసులకు కృష్ణా జిల్లా పరిధిలోనూ లేఔట్లు వేశారు. విజయవాడ తూర్పు పేదలకు పెనమలూరు మండలం వణుకూరు, గొడవర్రు, గన్నవరం మండలం కొండపావులూరులో లేఔట్లు వేశారు. సెంట్రల్ వారికి అక్కడే వేశారు. కొన్ని నున్న పరిధిలో వేశారు. పశ్చిమ పేదలకు వెలగలేరు వద్ద వేశారు. మొత్తంగా 83,485 గృహాలు. జియో ట్యాగింగ్ చేయని వాటిని జాబితా నుంచి తొలగించారు. గృహనిర్మాణాలు చేపట్టి మూడున్నరేళ్లు అవుతున్నా.. పనులు సాగడం లేదు. కొందరు సొంత ఖర్చులతో నిర్మాణం పూర్తి చేసుకున్నా.. మౌలిక వసతులు లేక ఇళ్లకు తాళాలు వేసుకున్నారు.
యాడున్నారు.. జోగీ?
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెడనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పెనమలూరు నుంచి పోటీకి దిగుతున్నారు. ఈ జిల్లా మంత్రి అయినా గృహ నిర్మాణంలో పురోగతి అట్టడుగునే ఉంది. జూ కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీల పేరుతో 690 లేఔట్లు వేశారు. అందులో 175 లేఔట్లు ఇంకా ప్రారంభించలేదు. 91,295 గృహాలు మంజూరవగా జియో ట్యాగింగ్ పూర్తి చేయని వాటిని జాబితా నుంచి తొలగించారు. గృహనిర్మాణాలు చేపట్టి మూడున్నరేళ్లు అవుతున్నా.. పనులు సాగడం లేదు. కొందరు సొంత ఖర్చులతో నిర్మాణం పూర్తి చేసుకున్నా.. మౌలిక వసతులు లేక ఇళ్లకు తాళాలు వేసుకున్నారు.
- మెరక, ఇతర పనులకు రూ.97.76 కోట్లు మంజూరు చేయగా కొన్ని ఉపాధి హామీ పనులు ఉన్నాయి. కొన్నింట మినహా చిన్న వర్షానికే కాలనీలు మునుగుతున్నాయి. కరగ్రహారం లేఔట్ది ఇదే తీరు.
- బందరులో కరగ్రహారం లేఔట్ జిల్లాలోనే అతిపెద్దది. సముద్రం ఒడ్డున ఈ లేఔట్ వేశారు. సుమారు 5 వేల గృహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. బందరు పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలను కేటాయించారు. నగర పరిధిలో కేవలం సెంటు స్థలమే పంపిణీ చేశారు.
- అవనిగడ్డ, పామర్రు పరిధిలో పలు ప్రాంతాల్లో గుడ్లవల్లేరు, గుడివాడ ప్రాంతాల్లో లేఔట్లు ముంపునకు గురవుతున్నాయి. ఇంటి నిర్మాణానికి వాహనాలు లేఔట్ వరకు వెళ్లే పరిస్థితి లేదు. అంతర్గత రహదారులు నిర్మించాలి. 670 లేఔట్లలో గ్రామీణ నీటిసరఫరా విభాగం నీటి వసతి కోసం రూ.55.94 కోట్లు, ప్రజారోగ్య శాఖ నుంచి 9 లేఔట్లకు రూ.8.94 కోట్లు మంజూరు చేశారు. 60 శాతం కాలనీలకు విద్యుత్తు వసతి లేదు. లబ్ధిదారులతో గృహప్రవేశాలకు ఒత్తిడి రాగా బందరు మండలం మేకవారిపాలెం లే ఔట్ కొంత పూర్తి చేశారు.
గృహ నిర్మాణ మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన నియోజకవర్గానికి 15,920 గృహాలను మంజూరు చేయగా.. 15,683 గృహాల జియోట్యాగింగ్ పూర్తి చేశారు. 10,473 పునాదుల్లోనే ఉన్నాయి. పునాదులు దాటిన ఇళ్లు 2,342 ఉన్నాయి.
మా లేఔట్లో రోడ్లు వేయలేదు. నీరు నిలిచిపోతోంది. దారిలేక ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణ దశలో ఉన్న గృహాలకు మెటీరియల్ సమకూర్చుకోవాలంటే మార్గం లేక దూరంగా డంప్ చేసుకోవాల్సి వస్తోంది.కాలువలు లేకపోవడంతో తాగినీటి పైపులైను పగిలిపోయి అంతర్గత తాత్కాలిక మట్టి రోడ్లపై నీరు నిలిచింది.
రావుల నవీన్, కొండిపర్రు, న్యూస్టుడే, పామర్రు గ్రామీణం
ఇళ్లే లేని కాలనీ
నందిగామ గ్రామీణం, న్యూస్టుడే: నందిగామ మండలం సోమవరంలో 1.10 ఎకరాలు కొనుగోలు చేసి 44 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ రహదారులు వేశారు. విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేశారు. బోరు వేసినా.. నీరు పడలేదు. ఫలితంగా ఇద్దరు కష్టపడి బేస్మట్టం వరకు నిర్మించి వదిలేశారు. లేఔట్ పల్లంగా ఉంది. వర్షాకాలంలో నీరు చేరుతోంది.
విజయవాడ పేదల కోసం జి.కొండూరు మండలం హెచ్.ముత్యాలంపాడులో 180 ఎకరాలు సేకరించారు. గ్రామానికి దూరంగా, బుడమేరు వాగు పక్కనే నివాసాలకు అంతగా అనువుగాని భూముల్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతం పలుమార్లు వరదల్లో మునగడంతో, రూ.లక్షలు వెచ్చించి తోలిన మెరక అంతా కొట్టుకుపోయింది. ఇళ్ల నిర్మాణం పునాది స్థాయిని దాటలేదు.
న్యూస్టుడే, మైలవరం
బందరు మండలం మేకావానిపాలెం జగనన్న కాలనీ లే ఔట్లో గృహప్రవేశాలు చేశారు. 165 మందికి (సెంటున్నర) పట్టాలు ఇచ్చారు. 78 మంది గృహ ప్రవేశాలు చేశారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని వసతులకు రూ.7.31 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రెండు సీసీ దారులు వేయాలి. అంతర్గత డ్రెయిన్లు వేయలేదు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలోకి వాడుక నీరు వదులుతున్నారు. ఎక్కువ వాడకం ఉన్న గృహాల వద్ద గుంత నిండి ఆ నీరు దారులపైకి వస్తోంది. మౌలిక వసతులు లేక చాలా మంది ఇళ్లలో చేరడం లేదు.
గుడివాడ సమీపంలోని మల్లాయపాలెం వద్ద 77 ఎకరాల్లో లేఔట్ వేసి 7,007 మందికి స్థలాలిచ్చారు. 4,129 మందికి రుణాలు మంజూరు చేయగా 894 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. 1042 మంది ప్రారంభించలేదు. రోడ్లు, డ్రెయిన్లు లేవు. వర్షం వస్తే రహదారులన్నీ కాలువల్ని తలపిస్తాయి. ఇళ్లలోకి నీరు చేరుతుంది. రాతి పొడి, బూడిదతో రహదారులు వేయగా భారీ గుంతలు పడి దారుణంగా తయారయ్యాయి.
న్యూస్టుడే, గుడివాడ గ్రామీణం
ఇది బాపులపాడు మండలం మారుమూలన ఉన్న రేమల్లె లేఔట్. 250 మందికి ఇక్కడ స్థలాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేశారు. రహదారులు, కాలువలు, నీరు తదితర మౌలిక వసతులు లేవు. దీంతో 30 మంది కూడా గృహాలు నిర్మించలేదు.
న్యూస్టుడే, హనుమాన్జంక్షన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ‘పైసా’చికానందం..!
[ 04-05-2024]
‘ఇది అత్యంత దారుణం.. పండుటాకులతో జగన్ పైశాచిక క్రీడ ఆడుతున్నారు. వృద్ధులంతా ఎండలో నరకం అనుభవించాలని.. తమ బాధకు కారణం.. వాలంటీర్లు లేకపోవడమేనని వాళ్లు భావించాలనేదే.. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. -
బ్యాలట్ కాదు.. బుల్లెట్
[ 04-05-2024]
ఒక పూటలో తినే కూరగాయల్నే ఏరి ఏరి కొంటాం.. మరి అయిదేళ్లకోసారి వేసే ఓటు ఆచితూచి వేయలేమా..! సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. -
సహకారానికి జగన్ కత్తెర
[ 04-05-2024]
సహకార చట్టం ప్రకారం.. సంఘానికి నిర్ధరిత కాలవ్యవధిలో ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. -
జగన్ జమాన.. జనం భయాన!
[ 04-05-2024]
ప్రశాంతంగా కుటుంబంతో పార్కుకు వెళ్లాలంటే భయం.. పద్మావతి ఘాట్కో... కృష్ణవేణి ఘాట్కో వెళ్లి కొద్దిసేపు సేదదీరాలన్నా భయమే... నిర్మానుష్యంగా.. చీకటిగా ఉన్న రోడ్లపై వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే...ఎటువైపు నుంచి బ్లేడ్, గంజాయి బ్యాచ్లు దాడి చేస్తాయో తెలీదు. -
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?
[ 04-05-2024]
ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ సేవలకే పరిమితమైన పోలీస్శాఖ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. -
పోలీసుపై కొడాలి నాని ప్రధాన అనుచరుడి అరాచకం
[ 04-05-2024]
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడైన కసుకుర్తి జనార్దన్ (గుడ్లవల్లేరు బాబ్జి) ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆటోనగర్పై పగ.. శ్రామికులకు సెగ
[ 04-05-2024]
ఆసియాలోనే పెద్దదైన బెజవాడ ఆటోనగర్ పారిశ్రామికవాడ నేడు అనేక సమస్యలతో సతమతమౌతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పట్టించుకోవడం మానేసింది. -
వంశీ, నానీ.. దారి మరిచారేం?
[ 04-05-2024]
గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలకు ఎంతగానో ఉపకరించే కీలక రహదారి అభివృద్ధిపై వైకాపా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చూపారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. -
రూ.కోట్ల విలువైన స్థలంఫై విష్ణు కన్ను
[ 04-05-2024]
నగరంలో గత అయిదేళ్లలో వైకాపా ప్రజాప్రతినిధులు.. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా కబ్జా చేసేశారు. స్థానిక కార్పొరేటర్ల అండతో ప్రభుత్వ స్థలాలను మింగేశారు. -
బూతుల నేత.. మెరకలో మేత!
[ 04-05-2024]
శతకోటి అక్రమాలకు అనంతకోటి ఉపాయాలు! మట్టి నుంచి రూ. కోట్లు ఎలా పిండుకోవచ్చో గుడివాడ వెళ్లి చూస్తే తెలుస్తుంది.ఆ పిండుకున్నదాన్ని చట్టానికి దొరక్కుండా ఎలా జేబులో వేసుకోవచ్చో కూడా చూడొచ్చు. -
తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయుల దాడి
[ 04-05-2024]
బాపులపాడు మండలం కొత్తమల్లవల్లిలో తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు. -
మళ్లీ అదే తంతు
[ 04-05-2024]
అనుమతి లేకుండా 59వ డివిజన్లోని పలు నివాసాలపై వైకాపా నేతలు ఆ పార్టీ స్టిక్కర్లు అంటించడం వివాదాస్పదమైంది. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను
[ 04-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. -
కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యం: సుజనా
[ 04-05-2024]
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. -
చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
[ 04-05-2024]
నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే సౌజన్యంతో 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. -
తెదేపాతోనే యువతకు భవిష్యత్తు
[ 04-05-2024]
యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
టికెట్టు లేని ప్రయాణాలకు జరిమానా
[ 04-05-2024]
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్టు లేని ప్రయాణికుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం లభించింది. -
ప్రధాని రోడ్షో భద్రతపై సమీక్ష
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షోలో పాల్గొననున్నారని ఇందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధాని పర్యటనకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు