ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదిలించలేరు
‘‘రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా పన్నాగం పన్నుతోంది. అందుకే 400 సీట్లు గెలవాలని చూస్తోంది. దళితుల హక్కులను కాలరాయాలని చూస్తోంది.
భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లకు పోటు ఖాయం
సీఎం రేవంత్రెడ్డి
ఈనాడు- కరీంనగర్, పెద్దపల్లి, ఈనాడు డిజిటల్-సిరిసిల్ల: ‘‘రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా పన్నాగం పన్నుతోంది. అందుకే 400 సీట్లు గెలవాలని చూస్తోంది. దళితుల హక్కులను కాలరాయాలని చూస్తోంది. ఆ పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లకు పోటు తప్పదు. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తేనే మేలు జరుగుతుంది’’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతర సభల్లో ఆయన మాట్లాడారు.
నిధులు ఇవ్వాల్సి వస్తుందనే..
బ్రిటిష్ కాలం నుంచి ప్రతి పదేళ్లకోసారి దేశంలో జనగణన చేపట్టారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో జనగణన చేయలేదు. రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పెద్ద కుట్ర దీని వెనుక దాగి ఉంది. జనగణనతోపాటు కులగణన డిమాండ్నూ మోదీ సర్కారు పట్టించుకోలేదు. జోడో యాత్రలో రాహుల్ గాంధీని బీసీలు కలిసి.. తమ జనాభాకు తగ్గట్టుగా విద్యావకాశాలు, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అధికారంలోకి వస్తే కులగణనతోపాటు రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని రాహుల్ భావించారు. దేశంలో కులగణన, జనగణన జరిగితే నిధులివ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే భాజపా వ్యతిరేకిస్తోంది.
భాజపాపై మౌనమెందుకు?
భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు కేటీఆర్ చెప్పాలి. కేసీఆర్, మోదీలది ఒక్కటే నినాదం. 2022 ఫిబ్రవరిలో కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు భాజపా కూడా అదే విధానంతో ముందుకెళ్తోంది. పదేళ్లుగా మోదీకి వ్యతిరేకంగా భారాస ఏ కార్యక్రమాలూ చేయలేదు. తెలంగాణపై ఆయన దాడి చేస్తుంటే కేసీఆర్ పరోక్షంగా సమర్థిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న వ్యక్తి, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మా ప్రభుత్వానికి సలహాలు ఇస్తారనుకున్నా. ఎలాంటి సలహాలూ ఇవ్వకపోగా.. అప్పుడే మమ్మల్ని అధికారంలో నుంచి దిగిపోవాలంటున్నారు. పదేళ్లు దేశాన్ని ఏలుతున్న మోదీని ఎందుకు దిగిపొమ్మనడం లేదు? పైగా 10-12 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పుతానంటున్నారు. గతంలో ఓసారి 9, మరోసారి 12 ఎంపీ సీట్లు గెలిచిన భారాస.. భాజపా ప్రవేశపెట్టిన బిల్లులకు సహకరించింది తప్ప.. ఏమీ చేయలేదు. ఈసారి ఒకట్రెండు గెలిచినా మోదీకి అమ్ముకోవాలని ఆలోచిస్తున్నారు.
సిరిసిల్ల చీడ వదిలిస్తాం
వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లకు పట్టిన చీడను వదిలిద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్రెడ్డి గెలిస్తే ఇక్కడి నేతన్నలకు ఇంకా మేలు జరిగేది. గత ప్రభుత్వంలో రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేసి.. రూ.7 లక్షల కోట్ల అప్పు మిగిల్చారు. చేనేత కార్మికులవి రూ.275 కోట్ల బకాయిలుంటే.. రూ.50 కోట్ల వరకు ఇచ్చాం. ఎన్నికల కోడ్ ఎత్తేశాక మిగతావి అందిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు అధ్వానంగా మారింది. మేడిగడ్డ మేడిపండైంది. సుందిళ్ల ఎట్లుందో తెలియదు. అన్నారం ఆగమైంది. మధ్యమానేరు ముంపు బాధితులకు కూడా కేసీఆర్ న్యాయం చేయలేదు. ఎన్నికలయ్యాక అన్ని సమస్యల్ని పరిష్కరిస్తా. కరీంనగర్ ఎంపీగా రాజేందర్రావును గెలిపిస్తే నేతవస్త్రాలపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఆయన సహకారంతో తీసివేయించేలా కృషి చేస్తా.
ఆ పార్టీలకు ఓట్లడిగే హక్కులేదు
భారాస, భాజపాలకు ఈ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కులేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి సెగ్మెంట్లో ప్రజలు తిరస్కరించిన వ్యక్తినే భారాస పెద్దపల్లి ఎంపీ బరిలో దించింది. కొప్పుల ఈశ్వర్ వ్యవహారం ప్రజలకు తెలుసు. ఆయన్ని ఓడించి గడ్డం వంశీని రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించండి. సింగరేణి కార్మికుల సమస్యల్ని భారాస, భాజపా పట్టించుకోలేదు’’ అని రేవంత్రెడ్డి విమర్శించారు. రాజారాంపల్లి సభలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. కరెంట్ కోతలపై భారాస అనవసరమైన రాద్ధాంతం చేస్తోందన్నారు. సిరిసిల్ల సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యానికి భాజపా రూపంలో ముప్పు ఎదురవుతోందన్నారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, వివేక్, వినోద్, ప్రేమ్సాగర్రావు, విజయరమణారావు, మక్కాన్సింగ్, మేడిపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల సభలో 11 మంది కరీంనగర్ భారాస కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరెవరో ఏదో చేస్తామంటున్నారు. ఏమీ చేయలేరు. పదేళ్లూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది. అంగుళం మందం కూడా ఎవరూ కదిలించలేరు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి.. భుజాలు కాయలు కాసేలా జెండా మోసి.. రాష్ట్రంలో పార్టీని అధికారాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వానికి ఏమైనా అయితే ఊరుకోరు.
సీఎం రేవంత్రెడ్డి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో