రాష్ట్రాన్ని ముంచేందుకు మోదీ, రేవంత్ల కుట్ర
ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలు రాష్ట్రాన్ని ముంచే కుట్ర చేస్తున్నారని.. వాటిని అడ్డుకోవాలంటే తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాలని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కె.చంద్రశేఖర్రావు అన్నారు.
భాజపా పాలనలో మత విద్వేషాలు తప్ప ఏమీ లేదు
గోదావరి జలాలు తరలిస్తానంటే సీఎం మాట్లాడరెందుకు?
చేనేత కార్మికుల కష్టాలపై ప్రశ్నించినందుకే నాపై నిషేధం
గోదావరిఖని రోడ్షోలో కేసీఆర్
గోదావరిఖని, న్యూస్టుడే: ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలు రాష్ట్రాన్ని ముంచే కుట్ర చేస్తున్నారని.. వాటిని అడ్డుకోవాలంటే తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాలని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కె.చంద్రశేఖర్రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెద్దన్న అంటారు. గోదావరి నీళ్లు తీసుకుపోతానంటే మాట్లాడరు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి. పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్నారు. దేశం సత్యనాశ్ అయింది. డాలర్ ముందు రూపాయి విలువ రూ.84. ఏ ప్రధాని హయాంలోనూ రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలేదు. జన్ధన్ ఖాతాలో రూపాయి వచ్చిందా. రూ.15 లక్షలు మీ ఖాతాలోకి వస్తాయన్నారు.. వచ్చాయా. నరేంద్రమోదీ పాలనలో మత విద్వేషాలు తప్ప దేశానికి మేలు జరగలేదు. వాళ్లకు 200 సీట్ల కంటే ఎక్కువ రావని వార్తలొస్తున్నాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే రాబోతోంది. భారాస ఎంపీలు గెలిస్తే నీళ్లు, నిధులు, మన బొగ్గు కాపాడుకునే అవకాశం ఉంటుంది. భారాస ఎంపీల గెలుపుతోనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. నిస్వార్థపరుడు కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరుతున్నా.
సీఎం ఎందుకు మాట్లాడరు?
నదులు అప్పగిస్తానంటే సీఎం చప్పుడు చేయరు. కృష్ణానదిని కేఆర్ఎంబీకి అప్పచెప్పారు. గోదావరి నీళ్లు ఎత్తుకుని పోతా. తమిళనాడుకు, కర్ణాటకకు ఇస్తా అని ప్రధాని మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రికి లేఖలు పంపిస్తుంటే దానికి సీఎం మాట్లాడటం లేదు.. గతంలో ఇదే ప్రతిపాదన నావద్దకు మోదీ తెస్తే. కేసీఆర్ బతికుండగా గోదావరి నీళ్లు తీసుకుపోతానంటే ఒప్పుకోనని చెప్పా. మోదీ అండదండలతో రూ.14 లక్షల కోట్లకు పడగెత్తిన అదానీ ప్రభుత్వ రంగ సంస్థలను కబళిస్తున్నారు. కరెంటు ఉత్పత్తి చేయడానికి ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొనుగోలు చేయమన్నా అందుకు నేను ఒప్పుకోలేదు. సింగరేణిలో బొగ్గు ఉండగా బయటి నుంచి ఎందుకు తీసుకుంటామని అడ్డుకున్నా. ఇదే సీఎం దావోస్లో అదానీని తెలంగాణకు రండి. అంటూ ఆహ్వానించారు. పార్లమెంటు ఎన్నికలు కావడమే ఆలస్యం. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలు కలిసి.. సింగరేణిని ఊడగొడతారు. తెలంగాణకు సింగరేణి కొంగుబంగారం. దీన్ని విస్తరించాలి. బయ్యారం ఉక్కు గనులు.. గోదావరి ఇసుక నిర్వహణ సింగరేణికే అప్పగించాలని ఆలోచించా.. అప్పట్లో సింగరేణి డైరెక్టర్ను ఆస్ట్రేలియాకు పంపా. మనం ఆస్ట్రేలియాలో సింగరేణి సంస్థ గనులు ఎందుకు పెట్టకూడదని ప్రయత్నించా.. రాబోయే రోజుల్లో సింగరేణిని ఊడగొట్టి అదానీకి అప్పగిస్తే కార్మికుల నోట్లో మట్టి పడుతుంది. సింగరేణి కార్మికులు చైతన్యంతో ఆలోచించాలి. పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లను గెలిపిస్తే నేను ఏం చేయలేను. సింగరేణి కష్టం తెలిసిన బిడ్డ కొప్పుల ఈశ్వర్ గెలిస్తే పార్లమెంటులో కొట్లాడతారు.
మళ్లీ కరెంటు కష్టాలు మొదలయ్యాయి
మా పాలనలో ఏనాడైనా కరెంటు కోతలను చూశారా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 50 వేల ఎకరాలు ఎండిపోయాయని మా మిత్రులు చెబుతున్నారు. పేద ప్రజలకు రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతిరోజూ నీటిసరఫరా చేశాం. ఇప్పుడు రెండు రోజులకోసారి నీరు వస్తోంది.. అది కూడా మురికినీరు.. ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే.
ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటైనా అమలు చేసిందా.. మహిళలకు రూ.2,500 ఇస్తున్నారా.. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ జరిగిందా.. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేశారు.. ఇది మంచిదే కానీ.. ఆటో కార్మికుల కష్టాలను పట్టించుకున్నారా. గతంలో కల్యాణలక్ష్మి ఇచ్చేది. తులం బంగారం ఇస్తామన్నారు ఏమైంది.. సీఎం రేవంత్రెడ్డి ఏ ఊరికి పోతే ఆదేవుని మీద ఒట్టు వేస్తున్నారు. ఎవరైనా పని చేసేవారు దేవుని మీద ఒట్టుపెట్టుకుంటారా. నిరుద్యోగ భృతి ఏమైంది? కాంగ్రెస్కు మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎంలు చెబుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చినపుడు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాం. 19 వేల మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పించాం. గోదావరిఖనిలోని మెడికల్ కళాశాలలో 5 శాతం కార్మికుల పిల్లలకు రిజర్వేషన్ కల్పించాం. చేనేత కార్మికులు అరిగోస పడుతున్నారు. వారికి రూ.370 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. చేనేత కార్మికుల కోసం గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఆర్డర్లు ఇవ్వడం లేదు. చేనేత కార్మికులు నిరోధ్లు.. పాపడాలు అమ్ముకోవాలని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఇది ధర్మమా అని కోపంలో మాట్లాడితే.. బిల్లులు ఇవ్వమని అడిగితే.. నామీద కుట్రతో నిషేధం పెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా దేవుని బొమ్మ నెత్తిమీద పెట్టుకున్నా.. హిందువులు, ముస్లింలను అడ్డం పెట్టుకుని ప్రధాని మోదీ మాట్లాడినా ఈసీకి కనిపించదు. నీ గుడ్లు పీకి గోళీలాడుకుంటా.. పేగులు తీసి మెడలో వేసుకుంటా.. నిన్ను పండపెట్టి తొక్కుతా.. అంటూ ముఖ్యమంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నా.. ఎన్నికల సంఘానికి పట్టదు. చేనేత కార్మికుల కోసం మాట్లాడితే నాపై నిషేధం విధించారు. దీనిపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?