అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు.
ప్రతిపక్షాలు, ప్రజలపై వైకాపా నాయకుల దురాగతం
అధికార పార్టీ ప్రజాప్రతినిధుల దందాలతో భీతిల్లుతున్న జనం
ఈనాడు డిజిటల్, గుడివాడ, న్యూస్టుడే, అవనిగడ్డ
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. కనీసం మంచి నీళ్లు రావడంలేదని చెప్పడానికి కూడా జనం ముందుకు రాలేకపోతున్నారు. వైకాపా నాయకులు అధికారుల నుంచి సామాన్యులపై దాడులకు తెగబడిన సంఘటనలూ లేకపోలేదు.
- గుడివాడ మండలం మోటూరు గ్రామంలో వైకాపా నాయకుడు ఘంటా సురేష్ మట్టి మాఫియా వ్యవహారంలో అడ్డొచ్చిన ఆర్ఐ అరవింద్పై దాడి చేసిన విషయం తెలిసిందే.
- అదే గ్రామంలో అక్రమంగా చెరువు తవ్విన వ్యవహారంలో పంచాయతీ కార్యదర్శి జనార్దనరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడంతో అక్రమం ఆగలేదు.
- గుడివాడ పట్టణంలో చైతన్య సహకార సొసైటీ పేరుతో ఉన్న సుమారు 8 ఎకరాల ప్లాట్లను ఆక్రమించుకొని వారిపై దాడులకు తెగబడి కొంత మంది స్థలాలను తమ పేరుతో రాయించుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా సర్వే చేయడానికి అధికారులు రాకుండా అక్రమార్కులు అడ్డుకున్నారు.
- ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి ఒకరు షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారంలో వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం బాధితుడి సూసైడ్ నోట్ ద్వారా వెలుగులోకి ఇచ్చింది. బాధితుడి కుమారుడ్ని చంపుతామని వైకాపా నాయకుడొకరు బెదిరించగా అతడు పారారై టీవీ ఛానెళ్ల ముందు మొర పెట్టుకున్న విషయం తెలిసిందే.
- వన్టౌన్ ఠాణా ముందున్న ఒక దుకాణం ఖాళీ చేసే విషయంలో దుకాణదారుడి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు.
ఎమ్మెల్యే వస్తే బయటకు రాలేదని ప్రహరీ కూల్చివేత
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రమేష్బాబు పర్యటన సందర్భంగా తెదేపా సానుభూతిపరుడైన ఇంటి యజమాని బయటకు రాలేదనే కక్షతో అతని స్థలం ఆక్రమణలో ఉందని ప్రహరీ, బయట కట్టించిన పక్కా డ్రెయిన్ను జేెసీబీతో తొలగించారు. డ్రెయినేజీ కట్టిస్తున్నామని, మీ స్థలం ఆక్రమణలో ఉందని పంచాయతీ అధికారులు 2023 జూన్లో పగలగొట్టించారు. 10 నెలలైనా డ్రెయిన్ కట్టించకుండా వదిలేశారు. సర్వే చేయించాలని ఇంటి యజమాని కోరినా పట్టించుకోలేదు. తను తెదేపా సానుభూతిపరుడ్ని కావడమే కారణమని బాధితుడు చెపుతున్నారు.
మోపిదేవి మండలం కె.కొత్తపాలంలో ఒక శుభకార్యంలో పనులు చేయడానికి గిరిజన మహిళల్ని పిలిచి వారిపై దొంగతనం అంటగట్టి వైకాపా నాయకుడు తీవ్రంగా వేధించాడు. పనికి వచ్చిన ముగ్గురు మహళలను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఒక యువతిని దారుణంగా కొట్టడంతో పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో కేసు లేకుండా చేయాలని అధికార పార్టీ నాయకులు చూశారు. చివరికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల జోక్యంతో ఇంటి యజమానిపైన కుటుంబ సభ్యులపైన కేసుకట్టారు.
కక్షగట్టి స్థలం స్వాధీనానికి యత్నం
న్యూస్టుడే, అవనిగడ్డ: అవనిగడ్డలో తెదేపా కార్యకర్త యాసం వెంకటేశ్వరరావు తాతల నాటి నుంచి ఉంటున్న గృహం స్వాధీనానికి అధికార పార్టీ నాయకులు కుట్రపన్నారు. వారి ప్రోద్బలంతో పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఇల్లు స్వాధీనానికి రెండేళ్లుగా యత్నిస్తున్నారు. బాధితుడు హైకోర్టు నుంచి స్టే తెచ్చిన తర్వాత కూడా వారు వెనక్కి తగ్గకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయడంతో ఆగ్రహించి ఈనెల 24న వైకాపా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు నామినేషన్ ర్యాలీ సందర్భంగా వెంకటేశ్వరరావు ఇంటిపైకి టపాసులు వేసి దహనం చేసిన విషయం తెలిసిందే.
తెదేపా కార్యకర్తననే..
- యాసం వెంకటేశ్వరరావు, అవనిగడ్డ
నేను తెదేపా కార్యకర్తనని అధికార పార్టీ నాయకులు కక్షగట్టారు. నా ఇంటి స్థలం ప్రభుత్వ పోరంబోకు అని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు, పోలీసులను ఉపయోగించారు. మరుగుదొడ్లు, స్నానాల గది, పాక తొగించి, అందులో నుంచి దిగువకు రహదారి వేయాలని యత్నిస్తున్నారు. నా స్థలం పక్క నుంచి దశాబ్దాలుగా ట్రాక్టర్లు వెళ్లే రహదారి ఉంది. అయినా నా స్థలం నుంచి రహదారి వేసి స్వాధీనానికి యత్నిస్తున్నారు.
అన్యాయాలను ఎదిరించినా..
గుడివాడలో కొనసాగుతున్న అన్యాయాలను ఎదిరించేందుకు ముందుకొచ్చిన తెదేపా నాయకులపై పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి తమ విధులకు ఆటంకం కలిగించారని అక్రమంగా ఎదురు కేసులు బనాయించారు.
- చంద్రయ్యకాలువ గట్టుపై ఆక్రమణ తొలగింపునకు సమయం అడిగినందుకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పలువురు తెదేపా నాయకులపై కేసు నమోదు చేశారు.
- టిడ్కో కాలనీలో నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్లిన రావి వెంకటేశ్వరరావుపై టిడ్కో సిబ్బందితో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారు.
- తెదేపా కార్యాలయంపై అధికార పార్టీ ముఠా దాడికి దిగితే ఒక పోలీసుతో రావి, తెదేపా నాయకులపై కేసులు నమోదు చేశారు.
- తెదేపా నాయకుడు వెనిగండ్ల రాము గృహ నిర్బంధంలో ఉండగా పోలీసుల ఆదేశాలు ధిక్కరించి స్టేషన్కు వచ్చారని ఆయనపై కేసు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుపై సుమారు 15, తెదేపా నాయకులపై 25 వరకు కేసులు అక్రమంగా నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమిలో ఉత్సాహం.. వైకాపాలో నైరాశ్యం
[ 14-05-2024]
‘‘ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో తెదేపా శ్రేణులు.. రెట్టించిన జోష్తో కదిలాయి. పోలింగ్ సరళి, -
పో‘రంకెలేసిన’ జోగి.. మంత్రి రెచ్చిపోయినా అడ్డుకోని పోలీసులు
[ 14-05-2024]
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. అధికార వైకాపా నాయకుల ఆగడాలను అడ్డుకోలేక చేతులెత్తేసింది. -
మండుటెండలో.. ఓట్ల వర్షం
[ 14-05-2024]
కృష్ణమ్మ జోరును తలపించిన జనాల హోరుతో పోలింగ్ కేంద్రాలు పోటెత్తాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఉదయం 6 గంటలకే ఓటర్లు భారీగా తరలివచ్చారు. -
ఐసీయూ నుంచి పోలింగ్ కేంద్రానికి..
[ 14-05-2024]
నగరానికి చెందిన గోవాడ వెంకటేశ్వరరావు (68) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. -
కవ్వింపులు.. ప్రలోభాలు
[ 14-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో వైకాపాకు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల తీరుతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు, -
రెండో రోజూ తెదేపా ఏజెంట్లపై వైకాపా దాడి
[ 14-05-2024]
తెదేపా ఏజెంట్లుగా వ్యహరించిన ఇరువురిపై వైకాపా వర్గీయులు మూకుమ్మడి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. -
ఉయ్యూరులో అధికార పార్టీ నేత బరితెగింపు
[ 14-05-2024]
కృష్ణా జిల్లా ఉయ్యూరులో వైకాపా నేత, సీడీసీ ఛైర్మన్ రామచంద్రరావు బరితెగించి ఏకంగా సీఐడీ డీఎస్పీ సోమయ్యపై దూసుకెళ్లి దాడికి యత్నించారు. -
బందరులో 11.30 వరకు సాగిన పోలింగ్
[ 14-05-2024]
ఈవీఎంల మొరాయింపు కారణంగా తలెత్తిన సమస్యలతో వివిధ కేంద్రాల్లో రాత్రి 11.30 గంటలవరకు పోలింగ్ కొనసాగింది. బందరు నగరంలోని గొడుగుపేట పాఠశాలలోని 144వ బూత్తోపాటు గాంధీవిద్యాలయం -
మేము సైతం ..
[ 14-05-2024]
జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ముఖ్యులు సోమవారం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా జడ్జి అరుణ సారిక శిశువిద్యా మందిరంలోని 75వ బూత్లో ఓటు వేశారు. -
జడ్పీ ఛైర్పర్సన్కు ప్రతిఘటన
[ 14-05-2024]
స్థానిక బంగ్లాస్కూలు పోలింగు కేంద్రంలోకి వచ్చిన జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికను తెదేపా నేతలు అడ్డుకున్నారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు మాత్రమే లోనికి రావాలని మీరు ఏ హోదాలో వస్తున్నారంటూ ఆమెను ప్రశ్నించారు. -
పెద్దోళ్లూ.. మీరు గొప్పోళ్లు
[ 14-05-2024]
వయసుమీద పడింది. శరీరం సహకరించకుంది. అవయవాలు ఇబ్బంది పెడుతున్నా.. ఓటు హక్కు వినియోగంలో ఉత్సాహం తగ్గలేదు. లైన్లలో నిలబడలేక ఓటు వేయడమే మానేస్తున్నవారిలో స్ఫూర్తినింపేలా.. -
వైకాపా నేతల బరితెగింపు
[ 14-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో వైకాపా నేతలు బరితెగించారు. ఆదివారం 59వ డివిజన్లోని ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయం వద్ద డబ్బులు పంచుతుండగా.. -
భవానీపురం సీఐపై వేటు
[ 14-05-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహించిన భవానీపురం పోలీస్స్టేషన్ సీఐ వి.కృష్ణపై వేటు పడింది. సీఐని వీఆర్కు పంపుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. -
వైకాపా సోషల్ మీడియా బ్యాచ్ హడావిడి
[ 14-05-2024]
పాతబస్తీ రాయల్ ఫంక్షన్ హాల్లో సుమారు 30 మందికి పైగా బయట వ్యక్తులు(పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారు కాదు) 18ల్యాప్ ట్యాప్లతో ఏదో పని చేస్తున్నారని స్థానిక ప్రజలు ఎన్డీయే నేతలకు సమాచారం ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ vs లఖ్నవూ.. నేటి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్పై ప్రభావమెంత..?
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!