డి.హీరేహాళ్లో అత్యధిక వర్షపాతం
జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని డి.హీరేహాళ్ మండలంలో 69.8 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది.
పత్తి రైతులకు తీరని నష్టం
మల్లికేతిలో నీట మునిగిన పత్తి పంట
జిల్లా వ్యవసాయం, డి.హీరేహాళ్, న్యూస్టుడే : జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని డి.హీరేహాళ్ మండలంలో 69.8 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలను పరిశీలిస్తే... గార్లదిన్నెలో 68.6, బ్రహ్మసముద్రం 15.2, రాయదుర్గం 14.2, యాడికి 10.2, కణేకల్లు 10.0, బెళుగుప్ప7.6, శింగనమల 5.8, గుత్తి 5.6, గుమ్మగట్ట 2.6. బొమ్మనహాళ్ 2.2, రాప్తాడులో 2.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ప్రేమచంద్ర వివరించారు.
* డి.హీరేహాళ్ మండలంలో వర్షం కారణంగా పత్తి పంట సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జాజరకల్లులో దాదాపు 150 ఎకరాల్లో పత్తి సాగైంది. ఇక్కడి పొలాల్లో వరద నీరు ప్రవహించడంతో చెట్లు నేలకూలాయి. మల్లికేతి, మడేనహళ్లి, నాగాలాపురం తదితర గ్రామాల్లో 170 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మల్లికేతి గ్రామంలో వి.అప్పన్నరెడ్డి 10 ఎకరాల్లో పత్తి సాగు చేయగా దాదాపు ఐదు ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిందని బాధిత రైతు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల వ్యాప్తంగా 320 ఎకరాల్లో పత్తి రైతులకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ఏఓ కృష్ణకుమార్రెడ్డి తెలిపారు.
విద్యుత్తుశాఖకు రూ.40లక్షల నష్టం
అనంత (విద్యుత్తు),న్యూస్టుడే: రెండు రోజులుగా ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో స్తంభాలు, నియంత్రికలు పడిపోవడంతో విద్యుత్తు శాఖకు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఎస్ఈ సురేంద్ర తెలిపారు. అనంతపురం గ్రామీణం, కళ్యాణదుర్గం, గుత్తి డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు 11కేవీ 118, ఎల్టీ స్తంభాలు 62, నియంత్రికలు 16 కిందపడిపోయాయని పేర్కొన్నారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఈ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూరీసర్వేలో జగన్మాయ
[ 11-05-2024]
‘శాశ్వత భూ హక్కు-భూ సంరక్షణ’ పథకంలో అంతా జగన్మాయే.. వైకాపా సర్కారు తీసుకొచ్చిన భూరీ సర్వేలోనూ మాయాజాలమే. దేశ చరిత్రలోనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి... భూ యజమానులకు శాశ్వత హక్కు కల్పిస్తున్నామంటూ మాయ మాటలతో దగా చేసింది. -
పీఏబీఆర్ లింకు కాలువ ఆధునికీకరణపై నిర్లక్ష్యం
[ 11-05-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా తాగునీటి అవసరాలకు పీఏబీఆర్ గుండెకాయ లాంటిది. అనంతపురం నగరపాలక సంస్థతోపాటు నాలుగు మున్సిపాలిటీలకు, దాదాపు వెయ్యి గ్రామాలకు ఇక్కడి నుంచే తాగునీరు సరఫరా అవుతున్నాయి. -
జగనన్న కాలనీల్లో వైకాపా ‘భూ’చోళ్లు
[ 11-05-2024]
ఓవైపు సీఎం జగన్ రాష్ట్రంలోని పేదలంతా తననే నమ్మాలని చెబుతుంటే.. మరోవైపు ఆయన పార్టీ నాయకులు మాత్రం పేదల భవిష్యత్తును అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పేదల కోసం ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లోని ఖాళీ స్థలాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. -
జగన్ గొప్పలు.. రైతులకు తిప్పలు
[ 11-05-2024]
జిల్లేడుబండ జలాశయ ముంపు గ్రామాల పరిహారంలో జగన్ ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. రిజర్వాయర్ నిర్మాణంతో వేల ఎకరాల భూములు సాగులోకి తీసుకొస్తామని గొప్పలు చెప్పుకొనే జగన్ జలాశయ నిర్మాణంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. -
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపండి
[ 11-05-2024]
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఉరవకొండలోని డ్రైవర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. -
తెదేపా గెలుపునకు యువత కసితో పని చేయాలి: కాలవ
[ 11-05-2024]
తెదేపా గెలుపునకు యువత కసి, పట్టుదలతో శ్రమించాలని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పట్టణ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో కాలవ మాట్లాడారు. -
శృతి మించుతున్న వైకాపా ఆగడాలు: పరిటాల సునీత
[ 11-05-2024]
ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి : ఐదేళ్ల వైకాపా దుష్టపాలనకు ముగింపు పలుకుదామని అందుకు ప్రజలంతా అండగా నిలవాలని రాప్తాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని పరిటాల సునీత, హిందూపురం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. -
దోపిడీ ప్రభుత్వాన్ని తరిమికొడదాం
[ 11-05-2024]
అడుగడుగునా దోపిడీకి పాల్పడుతూ, ప్రజలకు ఇబ్బందులు పెడుతున్న వైకాపా ప్రభుత్వాన్ని ఓటుతో తరిమి కొడదామని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
ముస్లింల సంక్షేమం తెదేపాతోనే సాధ్యం
[ 11-05-2024]
ముస్లింల సంక్షేమం, అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన ఉరవకొండలోని ఆయా మసీదుల్లో ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
తెదేపాలోకి వైకాపా నాయకుల చేరిక
[ 11-05-2024]
మండలంలోని దురదకుంట గ్రామంలో వైకాపాకు చెందిన 13 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. శుక్రవారం అమిలినేని సురేంద్రబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. -
అక్రమార్జనకు అద్దె ట్రాక్టర్లు
[ 11-05-2024]
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికార పార్టీ నాయకుల అక్రమార్జనకు కాదేదీ అనర్హం అన్నట్లుంది పుట్టపర్తిలో పరిస్థితి. -
జనసేన నాయకులపై వైకాపా వర్గీయుల దాడి
[ 11-05-2024]
పుట్టపర్తితో వైకాపా నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం పట్టణంలోని చిత్రావతిగుట్ట 7, 8 వార్డుల్లో వైకాపా నాయకులు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా తెదేపా నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. -
ప్రధాన పార్టీ ప్రలోభాల పర్వం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారపర్వం చివరి అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలని ఓ ప్రధాన పార్టీ ప్రలోభాల పర్వానికి తెరలేపింది. క్షేత్రస్థాయిలో తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ఆ పార్టీ నాయకులు డబ్బులిచ్చి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. -
వైకాపాతో అంటకాగిన ఉద్యోగులపై ఫిర్యాదులు
[ 11-05-2024]
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ కొందరు ఉద్యోగులు వైకాపా కార్యకర్తలుగా పని చేస్తున్నారు. వైకాపాకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ పలువురి ఉద్యోగులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
88 శాతం పోస్టల్ బ్యాలెట్
[ 11-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు స్ఫూర్తిని చాటారు. ఎన్నడూ లేనంతగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే ఈస్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!