జగనా.. మజాకా
తాడిపత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వస్తున్నారని పోలీసులు విధించిన పలు ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
టైలర్స్ కాలనీ వద్ద స్తంభించిన రాకపోకలు
తాడిపత్రి, న్యూస్టుడే : తాడిపత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వస్తున్నారని పోలీసులు విధించిన పలు ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం జగన్ రఘు ఫంక్షన్ హాల్ సమీపంలో హెలికాప్టర్ దిగి పుట్లూరు రోడ్డు మీదుగా పోలీస్స్టేషన్ కూడలికి చేరుకుంటారు. దీంతో పోలీసులు పోలీస్స్టేషన్ కూడలి, పుట్లూరు రోడ్డులోని పలు వీధుల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనదారులు తమ ఇళ్లకు చేరుకోవడానికి నానా తిప్పలుపడ్డారు. పుట్లూరు వెంబడి జగన్ కాన్వాయ్ వస్తుందని పచ్చని చెట్ల కొమ్మలను తొలగించారు. వేసవిలో దుకాణాల వద్ద పాదచారులకు, దుకాణాదారులకు ఆసరాగా ఉన్న చెట్ల కొమ్మలు కొట్టేయడం పలు విమర్శలకు తావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముడుపులివ్వలేదని కేతిరెడ్డి పునాది కూల్చేయించాడు
[ 12-05-2024]
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ముడుపులు ఇవ్వలేదని నేసేపేటలో తనకు చెందిన ఇంటి పునాదిని కూల్చివేయించారని ధర్మవరం చెందిన భాజపా మాజీ కౌన్సిలర్ కేతా గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
విధ్వంస కారక.. పాశవిక పాలక
[ 12-05-2024]
ఒట్టిపోయిన జలాశయాలు.. బీళ్లుగా మారిన పొలాలు.. సీఎం జగన్ విధ్వంస పాలనకు ఆనవాళ్లు. విద్యార్థులకు భరోసా.. యువతకు ఉపాధి లేకుండా చేశారు. అక్కాచెల్లెమ్మలకు చేయూత, అవ్వాతాతలకు పూర్తిస్థాయిలో ఆసరా ఇవ్వలేదు. -
చౌకగా కొట్టేసి.. అస్మదీయులకు కట్టబెట్టి
[ 12-05-2024]
అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో.. జాతీయ రహదారి పక్కన.. వేల ఎకరాల్లో ఉన్న ఆ పేదల భూములపై పెద్దల కన్ను పడింది. రైతులకు అరచేతిలో స్వర్గం చూపించి.. ఎంతోకొంత ముట్టజెప్పి.. ఒకటి కాదు.. రెండు కాదు పదివేల ఎకరాల భూమిని సేకరించేశారు. -
మూగబోయిన మైకులు
[ 12-05-2024]
జిల్లావ్యాప్తంగా నెల రోజులుగా ఊదరగొట్టిన మైకులు మూగబోయాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెర పడింది. కీలక రాజకీయ పార్టీలైన తెదేపా, వైకాపా, భాజపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ.. -
అనంత రైల్వేస్టేషన్ కిటకిట
[ 12-05-2024]
ఎన్నికల వేళ జిల్లా మీదుగా నడుస్తున్న రైళ్లన్నీ ఓటర్లతో నిండిపోయాయి. వలస కూలీలు తమ ప్రాంతాలకు ఓటు వేయడానికి ప్రయాణం కావడంతో అనంతపురం రైల్వేస్టేషన్ శనివారం కిటకిటలాడింది. -
ఓట్ల పండగకు సర్వం సిద్ధం
[ 12-05-2024]
‘ఐదేళ్లకోసారి ఓటర్ల చేతిలో ఉండే వజ్రాయుధాన్ని ఉపయోగించే సువర్ణ అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. శాంతియుతంగా ఓటింగ్ జరిగేలా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశాం’ -
తెదేపా తెచ్చిందని.. వైకాపా వదిలేసింది..
[ 12-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనంతా రివర్స్లోనే నడిచింది. పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్న ఉద్దేశంతో తెదేపా పాలనలో పెనుకొండ మండలంలో కియా పరిశ్రమను తీసుకొచ్చింది. -
అధికారమే అండగా చెరువుల చెర
[ 12-05-2024]
ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి సామాజిక బాధ్యతతో పూర్వీకులు చెరువులు, కుంటలు నిర్మించారు. వాటిని గత ప్రభుత్వాలు సంరక్షించుకుంటూ వచ్చాయి. -
జానెడు రోడ్డు వేశారా.. చెరువుకు నీరు తెచ్చారా?: సునీత
[ 12-05-2024]
తెదేపా హయాంలో 2014-19 వరకు నేను చేసిన అభివృద్ధి పనులు చూశారు. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రకాష్రెడ్డి ఏం అభివృద్ధి చేశారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. -
దుర్గం వ్యాపారుల సంక్షేమానికి కృషి
[ 12-05-2024]
రాయదుర్గం వ్యాపారుల సంక్షేమానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో వ్యాపారులు తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 12-05-2024]
లారీ డ్రైవర్ను కొడుతున్న వైకాపా నాయకులను అడ్డుకున్న తెదేపా కార్యకర్తను అధికార పార్టీ నాయకుడు కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఈఘటన కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. -
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలెందుకు కల్పించలేదు?
[ 12-05-2024]
పోలింగ్ సమీపిస్తున్నా.. కేంద్రాల్లో ఇంత వరకు సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని ఆర్వో, జేసీ కేతన్ గార్గ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బెళుగుప్ప, వజ్రకరూరులో ఆర్వో పర్యటించారు. -
కొత్త చట్టంతో భూములు లాక్కునేందుకు జగన్రెడ్డి యత్నం
[ 12-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో మన తాతలు సంపాదించిన ఆస్తులు, భూములను లాక్కునేందుకు జగన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం
[ 12-05-2024]
కూటమి ప్రభుత్వంతో సంక్షేమం సాధ్యమని, కళ్యాణదుర్గం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబును గెలిపించాలని మండల తెదేపా నాయకులు పేర్కొన్నారు. -
మంత్రి ఇలాఖాకు జలాలు.. రైతులకు కన్నీళ్లు
[ 12-05-2024]
బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి జలాశయం అడుగుంటుతోంది. దాంతో బోరుబావుల్లో నీటిమట్టం పడిపోయింది. ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.