logo

జగనా.. మజాకా

తాడిపత్రికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని పోలీసులు విధించిన పలు ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Published : 28 Apr 2024 03:16 IST

టైలర్స్‌ కాలనీ వద్ద స్తంభించిన రాకపోకలు

తాడిపత్రి, న్యూస్‌టుడే : తాడిపత్రికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని పోలీసులు విధించిన పలు ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం జగన్‌ రఘు ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో హెలికాప్టర్‌ దిగి పుట్లూరు రోడ్డు మీదుగా పోలీస్‌స్టేషన్‌ కూడలికి చేరుకుంటారు. దీంతో పోలీసులు పోలీస్‌స్టేషన్‌ కూడలి, పుట్లూరు రోడ్డులోని పలు వీధుల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనదారులు తమ ఇళ్లకు చేరుకోవడానికి నానా తిప్పలుపడ్డారు. పుట్లూరు వెంబడి జగన్‌ కాన్వాయ్‌ వస్తుందని పచ్చని చెట్ల కొమ్మలను తొలగించారు. వేసవిలో దుకాణాల వద్ద పాదచారులకు, దుకాణాదారులకు ఆసరాగా ఉన్న చెట్ల కొమ్మలు కొట్టేయడం పలు విమర్శలకు తావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని