అవినీతిలోనూ పెద్దాయనే..
అవినీతికి..అరాచకానికి చొక్కా, పంచె తొడిగితే అచ్చం అయనలాగే ఉంటుంది. తాడిపత్రిలో వైకాపా ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న ‘పెద్ద’మనిషి అక్రమాలను చెప్తే చాంతాడంతా.. రాస్తే రామాయణమంతా అవుతుంది.
ఇసుక, మట్టిని మింగేస్తున్న ప్రజాప్రతినిధి
పెన్నాకు తాళాలేసి అక్రమ రవాణా
ప్రత్యర్థులపై దాడులే దినచర్య
అవినీతికి..అరాచకానికి చొక్కా, పంచె తొడిగితే అచ్చం అయనలాగే ఉంటుంది. తాడిపత్రిలో వైకాపా ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న ‘పెద్ద’మనిషి అక్రమాలను చెప్తే చాంతాడంతా.. రాస్తే రామాయణమంతా అవుతుంది. కనీసం పదో తరగతి చదవకపోయినా.. అవినీతిలో మాత్రం పీహెచ్డీ పట్టా పొందారు. ప్రజాసమస్యలపై ఏరోజూ పట్టించుకోని పెద్దమనిషి.. ఐదేళ్లు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడి ఫ్యాక్షన్ నేతగా మారారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థుల్ని ఇబ్బందులకు గురిచేసి రాక్షసానందం పొందుతున్నారు. అనుచరులు, బంధువుల్ని ముందుపెట్టి ఇసుక, మట్టి దందా సాగించారు. గ్రానైట్, స్టీటైట్ గనుల్ని చెరపట్టి రూ.కోట్లు వెనకేశారు. ఐదేళ్లలో అవినీతి సంపాదన రూ.300 కోట్లు దాటేసిందనే ప్రచారం జరుగుతోంది.
ఈనాడు డిజిటల్, అనంతపురం
తాడిపత్రిలో ‘పెద్ద’ వైకాపా ప్రజాప్రతినిధికి 2019 ఎన్నికల ముందు మంచి కారు లేదు. పక్క నియోజకవర్గంలో ఉన్న సొంతూరిలో పెద్దల ఆస్తి 50 ఎకరాలు ఉండేది. ఫ్యాక్షన్ను నమ్ముకుని రాజకీయాలు చేస్తూ ప్రజాప్రతినిధి అయ్యారు. గ్రానైట్, స్టీటైట్ పరిశ్రమలను గుప్పిట్లోకి తెచ్చుకుని జేబులు నింపుకొన్నారు. వ్యాపారులను భయందోళనకు గురిచేసి కమీషన్లు గుంజుకున్నారు. ఒకప్పుడు అభివృద్ధి, పరిశుభ్రతలో మేటిగా ఉన్న తాడిపత్రి ..ఆయన ఏలుబడిలో అరాచకాలు, దౌర్జన్యాలకు కేంద్ర బిందువుగా మారింది.
పెన్నాను పంచేసుకున్నారు
తాడిపత్రి వైకాపా నాయకులు పెన్నానదిని వాటాలేసుకున్నారు. నది చెంత గేట్లు ఏర్పాటు చేసి తాళాలు వేసుకోవడం తాడిపత్రిలోనే సాధ్యమైంది. ‘పెద్ద’ మనిషి కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా సాగించారు. నాణ్యమైన ఇసుక లభించే పది ప్రాంతాలను గుర్తించి పంచుకున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లతో తాడిపత్రితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ట్రాక్టరు రూ.2వేల నుంచి రూ.4వేలకు సరఫరా చేస్తున్నారు. నంద్యాల జిల్లా అవుకు, బనగానపల్లికి ట్రాక్టరు ఇసుక రూ.10 వేల చొప్పున తరలిస్తున్నారు. పది మంది బినామీలతో వ్యవహారం నడిపించారు. రోజుకు రూ.1.50 లక్షల చొప్పున సదరు ‘పెద్ద’ మనిషికి కప్పం కట్టేలా ఒప్పందం చేసుకున్నారు. పెద్దపప్పూరులోనూ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగించారు. తవ్వకాలతో ఏర్పడిన భారీ గోతుల్ని కప్పిపెట్టేందుకు చాగల్లు జలాశయం గేట్లు ఎత్తి... నీటిని విడుదల చేసి రైతుల పొట్టకొట్టారు. సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యురాలు సైతం ఎద్దులబండ్లపై ఇసుక తరలిస్తున్న వారి నుంచి రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఇసుక దందాలోనే సదరు ప్రజాప్రతినిధి రూ.50 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది.
మట్టి మాఫియా..
పుట్లూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల పరిధిలోని కొండలు, గుట్టలు వైకాపా నాయకుల అక్రమ తవ్వకాలతో రూపు కోల్పోయాయి. పెద్దపప్పూరు సోమనపల్లి, చిన్నయక్కలూరు, తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి, ఆవులతిప్పయ్యపల్లి, ఆలూరికోనతో పాటు యాడికి మండలంలోని పలు ప్రాంతాల్లో గుట్టలను కరిగించి ఎర్రమట్టి తరలిస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణం పేరిట తాత్కాలిక అనుమతులు పొంది ప్రయివేటుకు తరలిస్తున్నారు.
ఒకేచోట 189 ఎకరాలు
పక్క నియోజకవర్గంలోని సొంత గ్రామంలో కుటుంబసభ్యుల పేరుతో 50 ఎకరాల పొలం ఉన్నట్లు గతంలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక పుట్లూరు మండలంలోని ఓ గ్రామంలో ఒకేచోట 189 ఎకరాలు కొన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయనకు ఒక కారు మాత్రమే ఉంది. ప్రస్తుతం విలాసవంతమైన కార్లు పది వరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అనుమానం రాకుండా బినామీల పేరుతో కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రిలో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు. హైదరాబాద్లోనూ ఆపార్ట్మెంట్ కొన్నట్లు తెలుస్తోంది.
గుటకాయస్వాహా..
పెద్దపప్పూరు మండలం ఎర్రగుంటపల్లి, పెద్దపప్పూరు, ముచ్చుకోట, గార్లదిన్నె, అమ్మలదిన్నె తదితర ప్రాంతాల్లో గుట్టలను చదును చేసి వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. స్థానిక వైకాపా నాయకులు ఒక్కొక్కరు 5 ఎకరాల చొప్పున గుట్టలను ఆక్రమించారు. పండ్ల తోటలు సాగుచేసి తమ పేరుతో ఆన్లైన్ చేసుకుంటున్నారు. స్థానిక నాయకుల అక్రమాలకు ‘పెద్ద’ అండ పుష్కలంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజాప్రతినిధి అండతో తబ్జుల్లాలోని వైకాపా నాయకుడొకరు గ్రామకంఠం భూమి రెండెకరాలు కబ్జా చేసి పంటలు వేశారు. యాడికి మండలంతోపాటు నంద్యాల జిల్లా సరిహద్దులోని గుట్టల్లో మట్టి తరలించిన తర్వాత చదును అయిన ప్రాంతాలను కబ్జా చేసి పంటలు వేశారు.
ప్రతిపక్ష నాయకులపై దౌర్జన్యాలు
గతంలో తాడిపత్రిలో పనిచేసిన ఓ డీఎస్పీని అడ్డం పెట్టుకుని తెదేపా నాయకులపై కక్ష సాధింపునకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డితో పాటు తెదేపా మద్దతుదారులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. తెదేపా కౌన్సిలర్లే లక్ష్యంగా దాడులకు తెగపడ్డారు. ఎస్సీలపై భౌతిక దాడులకు తెగపడ్డారు. తెదేపా నాయకులు, సానుభూతిపరులపై దాడులకు పాల్పడటమే దినచర్యగా పెద్దాయన ఐదేళ్ల పాలన కొనసాగింది.
రియల్ దందా..
తాడిపత్రి పరిధిలో ఎవరు భూమి కొనుగోలు చేసినా..అమ్మినా ‘పెద్దా’యనకు కప్పం కట్టాల్సిందే. ఎక్కడ లేఅవుట్ వేసినా ఎకరాకు రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. పెద్దమొత్తంలో అసైన్డ్ భూముల్ని పేదలను బెదిరించి లాక్కున్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నిషేధిత జాబితాలోని భూముల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి మాముళ్లు వసూలు చేస్తున్నారు. సోలార్, గాలిమరలకు సేకరించిన భూముల్ని లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రి సమీపంలో పెద్దాయన బంధువు వెంచర్ ప్రహరీ నిర్మాణం కోసం ఓ వ్యక్తికి చెందిన ఆయిల్మిల్లును దౌర్జన్యంగా పడగొట్టారు. తర్వాత అతణ్ణి బెదిరించి లాక్కునే ప్రయత్నం చేశారు. ఐదేళ్లలో సంపాదించిన అవినీతి సొమ్ము రూ.150 కోట్లు దాటి ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముడుపులివ్వలేదని కేతిరెడ్డి పునాది కూల్చేయించాడు
[ 12-05-2024]
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ముడుపులు ఇవ్వలేదని నేసేపేటలో తనకు చెందిన ఇంటి పునాదిని కూల్చివేయించారని ధర్మవరం చెందిన భాజపా మాజీ కౌన్సిలర్ కేతా గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
విధ్వంస కారక.. పాశవిక పాలక
[ 12-05-2024]
ఒట్టిపోయిన జలాశయాలు.. బీళ్లుగా మారిన పొలాలు.. సీఎం జగన్ విధ్వంస పాలనకు ఆనవాళ్లు. విద్యార్థులకు భరోసా.. యువతకు ఉపాధి లేకుండా చేశారు. అక్కాచెల్లెమ్మలకు చేయూత, అవ్వాతాతలకు పూర్తిస్థాయిలో ఆసరా ఇవ్వలేదు. -
చౌకగా కొట్టేసి.. అస్మదీయులకు కట్టబెట్టి
[ 12-05-2024]
అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో.. జాతీయ రహదారి పక్కన.. వేల ఎకరాల్లో ఉన్న ఆ పేదల భూములపై పెద్దల కన్ను పడింది. రైతులకు అరచేతిలో స్వర్గం చూపించి.. ఎంతోకొంత ముట్టజెప్పి.. ఒకటి కాదు.. రెండు కాదు పదివేల ఎకరాల భూమిని సేకరించేశారు. -
మూగబోయిన మైకులు
[ 12-05-2024]
జిల్లావ్యాప్తంగా నెల రోజులుగా ఊదరగొట్టిన మైకులు మూగబోయాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెర పడింది. కీలక రాజకీయ పార్టీలైన తెదేపా, వైకాపా, భాజపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ.. -
అనంత రైల్వేస్టేషన్ కిటకిట
[ 12-05-2024]
ఎన్నికల వేళ జిల్లా మీదుగా నడుస్తున్న రైళ్లన్నీ ఓటర్లతో నిండిపోయాయి. వలస కూలీలు తమ ప్రాంతాలకు ఓటు వేయడానికి ప్రయాణం కావడంతో అనంతపురం రైల్వేస్టేషన్ శనివారం కిటకిటలాడింది. -
ఓట్ల పండగకు సర్వం సిద్ధం
[ 12-05-2024]
‘ఐదేళ్లకోసారి ఓటర్ల చేతిలో ఉండే వజ్రాయుధాన్ని ఉపయోగించే సువర్ణ అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. శాంతియుతంగా ఓటింగ్ జరిగేలా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశాం’ -
తెదేపా తెచ్చిందని.. వైకాపా వదిలేసింది..
[ 12-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనంతా రివర్స్లోనే నడిచింది. పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్న ఉద్దేశంతో తెదేపా పాలనలో పెనుకొండ మండలంలో కియా పరిశ్రమను తీసుకొచ్చింది. -
అధికారమే అండగా చెరువుల చెర
[ 12-05-2024]
ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి సామాజిక బాధ్యతతో పూర్వీకులు చెరువులు, కుంటలు నిర్మించారు. వాటిని గత ప్రభుత్వాలు సంరక్షించుకుంటూ వచ్చాయి. -
జానెడు రోడ్డు వేశారా.. చెరువుకు నీరు తెచ్చారా?: సునీత
[ 12-05-2024]
తెదేపా హయాంలో 2014-19 వరకు నేను చేసిన అభివృద్ధి పనులు చూశారు. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రకాష్రెడ్డి ఏం అభివృద్ధి చేశారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. -
దుర్గం వ్యాపారుల సంక్షేమానికి కృషి
[ 12-05-2024]
రాయదుర్గం వ్యాపారుల సంక్షేమానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో వ్యాపారులు తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 12-05-2024]
లారీ డ్రైవర్ను కొడుతున్న వైకాపా నాయకులను అడ్డుకున్న తెదేపా కార్యకర్తను అధికార పార్టీ నాయకుడు కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఈఘటన కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. -
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలెందుకు కల్పించలేదు?
[ 12-05-2024]
పోలింగ్ సమీపిస్తున్నా.. కేంద్రాల్లో ఇంత వరకు సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని ఆర్వో, జేసీ కేతన్ గార్గ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బెళుగుప్ప, వజ్రకరూరులో ఆర్వో పర్యటించారు. -
కొత్త చట్టంతో భూములు లాక్కునేందుకు జగన్రెడ్డి యత్నం
[ 12-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో మన తాతలు సంపాదించిన ఆస్తులు, భూములను లాక్కునేందుకు జగన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం
[ 12-05-2024]
కూటమి ప్రభుత్వంతో సంక్షేమం సాధ్యమని, కళ్యాణదుర్గం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబును గెలిపించాలని మండల తెదేపా నాయకులు పేర్కొన్నారు. -
మంత్రి ఇలాఖాకు జలాలు.. రైతులకు కన్నీళ్లు
[ 12-05-2024]
బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి జలాశయం అడుగుంటుతోంది. దాంతో బోరుబావుల్లో నీటిమట్టం పడిపోయింది. ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.