రోడ్ల మంత్రి ప్రారంభించిన పనులకే దిక్కులేదు
రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రిగా శంకర నారాయణ ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులకే దిక్కులేకుండా పోయింది.
కొత్తపల్లి-ఎల్జీబీ నగర్ మధ్య దెబ్బతిన్న రహదారి
సోమందేపల్లి, న్యూస్టుడే: రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రిగా శంకర నారాయణ ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులకే దిక్కులేకుండా పోయింది. ఒకటి, కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్లు గడిచినా నిధులు లేక ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. ఈ దుస్థితి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. సోమందేపల్లి మండలం కొత్తపల్లి చెరువు నుంచి పెనుకొండ మండల గ్రామాల మీదుగా రొద్దం మండలం ఎల్జీబీ నగర్ వరకు మొత్తం 14 కిలోమీటర్ల రహదారిని రెండు వరుసల బీటీ రహదారి విస్తరణ, నిర్మాణ పనులకు వైకాపా ప్రభుత్వం ఆర్పీపీ కింద రూ.12 కోట్లు మంజూరు చేసింది.
2021లో ఆర్భాటంగా శంకుస్థాపన
ఈ రహదారి నిర్మాణ పనులకు కొత్తపల్లి మలుపు వద్ద 2021 జులై 5న నాటి రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రిగా శంకర నారాయణ, ఎంపీ మాధవ్తో కలిసి భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆయన చిత్రంతో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. అయినా ఇప్పటికీ ఈ రహదారి నిర్మాణ పనులకు మోక్షం లభించడం లేదు. ఇక్కడి రహదారి పక్కన శిలాఫలకం ఒక దిష్టిబొమ్మలా మారింది. కొత్తపల్లి చెరువు నుంచి రంగేపల్లి రైల్వే స్టేషన్ సమీపం వరకు రహదారి కంకర తేలి, గుంతల మయంగా మారింది. ఇక అడదాకులపల్లి మలుపు నుంచి ఎల్జీబీ నగర్ వరకు బీటీ రహదారి దెబ్బతిని గుంతలు పడి ప్రయాణం తీవ్ర ఇబ్బందికరంగా తయారైంది. ఈ రహదారిపై ఎప్పుడు ఏ ప్రమాదం చోటుచేసుకొంటుందోనని వాహనాల చోదకులు, స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తయితే హిందూపురం ర.భ, సోమందేపల్లి జాతీయ రహదారుల నుంచి అటు మడకశిర..ఇటు రొద్దం, పావగడ, బళ్లారి, పేరూరు, తిరుమణి ఇలా అనేక ప్రాంతాలకు ప్రయాణాలు సాగించడానికి ఎంతో సులభంగా ఉంటుంది. కొన్ని కిలో మీటర్ల ప్రయాణ దూరం, రవాణ ఖర్చులు తగ్గిపోయి సమయం ఆదా అవుతుందని వివిధ వాహన దారులు, చోదకులు, మూడు మండలాల ప్రజలు వాపోతున్నారు. చివరకు వైకాపా ఐదేళ్ల పాలనలో నిధులు విడుదల చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వెక్కిరిస్తున్న శిలాఫలకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధ్వంస కారక.. పాశవిక పాలక
[ 12-05-2024]
ఒట్టిపోయిన జలాశయాలు.. బీళ్లుగా మారిన పొలాలు.. సీఎం జగన్ విధ్వంస పాలనకు ఆనవాళ్లు. విద్యార్థులకు భరోసా.. యువతకు ఉపాధి లేకుండా చేశారు. అక్కాచెల్లెమ్మలకు చేయూత, అవ్వాతాతలకు పూర్తిస్థాయిలో ఆసరా ఇవ్వలేదు. -
చౌకగా కొట్టేసి.. అస్మదీయులకు కట్టబెట్టి
[ 12-05-2024]
అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో.. జాతీయ రహదారి పక్కన.. వేల ఎకరాల్లో ఉన్న ఆ పేదల భూములపై పెద్దల కన్ను పడింది. రైతులకు అరచేతిలో స్వర్గం చూపించి.. ఎంతోకొంత ముట్టజెప్పి.. ఒకటి కాదు.. రెండు కాదు పదివేల ఎకరాల భూమిని సేకరించేశారు. -
మూగబోయిన మైకులు
[ 12-05-2024]
జిల్లావ్యాప్తంగా నెల రోజులుగా ఊదరగొట్టిన మైకులు మూగబోయాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెర పడింది. కీలక రాజకీయ పార్టీలైన తెదేపా, వైకాపా, భాజపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ.. -
అనంత రైల్వేస్టేషన్ కిటకిట
[ 12-05-2024]
ఎన్నికల వేళ జిల్లా మీదుగా నడుస్తున్న రైళ్లన్నీ ఓటర్లతో నిండిపోయాయి. వలస కూలీలు తమ ప్రాంతాలకు ఓటు వేయడానికి ప్రయాణం కావడంతో అనంతపురం రైల్వేస్టేషన్ శనివారం కిటకిటలాడింది. -
ఓట్ల పండగకు సర్వం సిద్ధం
[ 12-05-2024]
‘ఐదేళ్లకోసారి ఓటర్ల చేతిలో ఉండే వజ్రాయుధాన్ని ఉపయోగించే సువర్ణ అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. శాంతియుతంగా ఓటింగ్ జరిగేలా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశాం’ -
తెదేపా తెచ్చిందని.. వైకాపా వదిలేసింది..
[ 12-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనంతా రివర్స్లోనే నడిచింది. పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్న ఉద్దేశంతో తెదేపా పాలనలో పెనుకొండ మండలంలో కియా పరిశ్రమను తీసుకొచ్చింది. -
అధికారమే అండగా చెరువుల చెర
[ 12-05-2024]
ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి సామాజిక బాధ్యతతో పూర్వీకులు చెరువులు, కుంటలు నిర్మించారు. వాటిని గత ప్రభుత్వాలు సంరక్షించుకుంటూ వచ్చాయి. -
ముడుపులివ్వలేదని కేతిరెడ్డి పునాది కూల్చేయించాడు
[ 12-05-2024]
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ముడుపులు ఇవ్వలేదని నేసేపేటలో తనకు చెందిన ఇంటి పునాదిని కూల్చివేయించారని ధర్మవరం చెందిన భాజపా మాజీ కౌన్సిలర్ కేతా గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
జానెడు రోడ్డు వేశారా.. చెరువుకు నీరు తెచ్చారా?: సునీత
[ 12-05-2024]
తెదేపా హయాంలో 2014-19 వరకు నేను చేసిన అభివృద్ధి పనులు చూశారు. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రకాష్రెడ్డి ఏం అభివృద్ధి చేశారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. -
దుర్గం వ్యాపారుల సంక్షేమానికి కృషి
[ 12-05-2024]
రాయదుర్గం వ్యాపారుల సంక్షేమానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో వ్యాపారులు తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 12-05-2024]
లారీ డ్రైవర్ను కొడుతున్న వైకాపా నాయకులను అడ్డుకున్న తెదేపా కార్యకర్తను అధికార పార్టీ నాయకుడు కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఈఘటన కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. -
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలెందుకు కల్పించలేదు?
[ 12-05-2024]
పోలింగ్ సమీపిస్తున్నా.. కేంద్రాల్లో ఇంత వరకు సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని ఆర్వో, జేసీ కేతన్ గార్గ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బెళుగుప్ప, వజ్రకరూరులో ఆర్వో పర్యటించారు. -
కొత్త చట్టంతో భూములు లాక్కునేందుకు జగన్రెడ్డి యత్నం
[ 12-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో మన తాతలు సంపాదించిన ఆస్తులు, భూములను లాక్కునేందుకు జగన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం
[ 12-05-2024]
కూటమి ప్రభుత్వంతో సంక్షేమం సాధ్యమని, కళ్యాణదుర్గం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబును గెలిపించాలని మండల తెదేపా నాయకులు పేర్కొన్నారు. -
మంత్రి ఇలాఖాకు జలాలు.. రైతులకు కన్నీళ్లు
[ 12-05-2024]
బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి జలాశయం అడుగుంటుతోంది. దాంతో బోరుబావుల్లో నీటిమట్టం పడిపోయింది. ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వికృత నేరాల రూపం.. కొడగు బాలిక కేసు కొత్తమలుపు
-
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/24)
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ కంపెనీ సీఈఓ