logo

మట్టి దారిలో అవస్థల ప్రయాణం

మండలంలోని ఎనుములదొడ్డి నుంచి శెట్టూరు మండలం యరబోరేపల్లికి ఏడు కిలోమీటర్ల మేర మట్టి దారి గుంతలు తేలి ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 29 Apr 2024 03:35 IST

కుందుర్పి, న్యూస్‌టుడే: మండలంలోని ఎనుములదొడ్డి నుంచి శెట్టూరు మండలం యరబోరేపల్లికి ఏడు కిలోమీటర్ల మేర మట్టి దారి గుంతలు తేలి ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎనుములదొడ్డి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీరాధాస్వామి ఆశ్రమానికి ప్రతి ఆదివారం సత్సంగం కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి భక్తులు వస్తుంటారు. రోడ్డు బాగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల పాలనలో వైకాపా ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం మరమ్మతులు చేయించలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దారిని బాగు చేయాలని కోరారు. ఈ విషయమై మండల ఇంజినీరు వరప్రసాద్‌తో మాట్లాడగా ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని