నాటి మాటలు.. నీటి మూటలేనా?
ప్రజా సంకల్ప పాదయాత్ర, 2019 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జిల్లాపై వరాల జల్లు కురిపించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మరిచారు.
హామీలను విస్మరించిన సీఎం, ప్రజాప్రతినిధులు
నేటి సభలోనైనా భరోసా ఇవ్వాలని ప్రజల వేడుకోలు
ఈనాడు, చిత్తూరు
ప్రజా సంకల్ప పాదయాత్ర, 2019 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జిల్లాపై వరాల జల్లు కురిపించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మరిచారు. జిల్లా నుంచి ఏకంగా ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా గట్టిగా ఒత్తిడి చేయకపోవడంతో ప్రభుత్వం సైతం మిన్నకుండిపోయింది. ఎమ్మెల్యేలు సంబంధిత దస్త్రాలు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని పట్టించుకోవడంలేదనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేనందున మంగళవారం జరిగే సభలోనైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరిస్తే జిల్లా ఎంతోకొంత ప్రగతి పథంలోకి వెళుతుంది.
జిల్లా కేంద్రంలో ఒక్క వర్సిటీ లేక..
జిల్లా కేంద్రంలో ఒక్క విశ్వవిద్యాలయం ఏర్పాటుకూ ప్రభుత్వం ఆమోదం తెలపలేదని చిత్తూరు యువత ధ్వజమెత్తుతోంది. వర్సిటీ నెలకొల్పాలంటూ ఇటీవల సంతకాల సేకరణ చేపట్టగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 2020 జనవరిలో అమ్మఒడి కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడే నగరంలో నైపుణ్య వర్సిటీ ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు కోరినా ముఖ్యమంత్రి స్పందించలేదు. అనంతరం ఎమ్మెల్యే సైతం ఆ అంశాన్ని పట్టించుకోనందునే ప్రభుత్వం నైపుణ్య కళాశాలతో సరిపెట్టిందని ప్రజలు అంటున్నారు.
గుజ్జు పరిశ్రమలు ఏర్పాటయ్యేదెన్నడో?
జిల్లాలో టమోటా సాగు అధికంగా ఉందని.. ఆ పంటకు గిట్టుబాటు ధరలు లభించక రోడ్లపైనే పారేయాల్సి వస్తోందని ప్రజా సంకల్పయాత్రలో అడుగడుగునా తనను కలిసిన రైతులు చెప్పారని జగన్ పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు నష్టం వాటిల్లకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు. తాజాగా మూసేసిన చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం భూముల్లో ఆహారశుద్ధి కర్మాగారాలు నెలకొల్పుతామని మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. ముఖ్యమంత్రి హామీకి పొంతన లేకుండా ఇలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎంతవరకు భావ్యమని రైతులు ప్రశ్నిస్తున్నారు.
గిట్టుబాటు ధరలూ అమలు కాక..: మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు జిల్లా పెద్దల ఆశీస్సులతో ధరలు తగ్గించడంపై గతవారం వరకూ విపక్ష పార్టీలు, రైతు సంఘాలు ధ్వజమెత్తాయి. అన్నదాతలు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
సీఎంసీలో అమలు కాని ఆరోగ్యశ్రీ
2006 మార్చిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంసీ యాజమాన్యానికి గుడిపాల మండలం చీలాపల్లె సమీపంలో 640 ఎకరాల భూమిని కేవలం రూ.6.40 కోట్లకే కేటాయించింది. అప్పట్లో పదేళ్లలో వైద్య కళాశాల, దంత, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఫలితంగా చిత్తూరు జిల్లా ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందుతాయని భావించి పరిసర ప్రాంతాల రైతులు తమ భూములను తక్కువ ధరకు విక్రయించారు. నేటికీ అక్కడ పూర్తిస్థాయిలో సేవలు అందకపోగా పేదలకు ప్రయోజనం కలిగించే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడంలేదు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య కార్డులను అంగీకరించడం లేదు. అటువంటప్పుడు తాము చేసిన త్యాగాలకు అర్థమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి జగన్ ఆ సంస్థపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు మేలు చేయాలి.
హంద్రీ- నీవా గురించి పట్టించుకోక..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే హంద్రీ- నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు పూర్తి చేయడమే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి కాక ముందు జగన్ చెప్పారు. కాలువ పనులు ఆగమేఘాలపై చేస్తామని చెప్పినప్పటికీ ప్రధాన కాలువ పరిధిలో ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదు. పుంగనూరు బ్రాంచ్ కాలువ పరిధిలో పదుల సంఖ్యలో కూడా చెరువులు నింపలేదు. గతేడాది సెప్టెంబరులో కుప్పం బ్రాంచ్ కాలువ పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి.
ప్రోత్సాహం కరవై..
* చెన్నై, బెంగళూరు మహా నగరాలకు జిల్లా దగ్గరగా ఉన్నా పరిశ్రమల స్థాపనకు గతంలోలా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేవు. ఫలితంగా ఉన్నవారే ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రూ.9,500 కోట్లతో ఏర్పాటు కావాల్సిన అమరరాజా లిథియం పరిశ్రమ ప్రభుత్వ వేధింపులతో పొరుగునే ఉన్న తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లింది.
* గంగాధరనెల్లూరు, గంగవరం మండలంలోని గండ్రాజుజల్లె పారిశ్రామికవాడల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవంటే పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థమవుతోంది.
తాగునీటి కష్టాలు తీరక..
* నగరంలో నీటి ఎద్దడిని నివారించేందుకు అడవిపల్లె జలాశయం నుంచి నీళ్లు తెప్పిస్తామని పదేపదే నాయకులు హామీ ఇస్తున్నా కార్యరూపం దాల్చలేదు.
* కుప్పంలోని ద్రవిడ వర్సిటీ ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వ హయాంలోనే ఎదురైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైరాగి వేషం.. గంగమ్మ దర్శనం
[ 16-05-2024]
గంగమ్మ జాతరలో భక్తుల సందడి మొదలైంది. మొదటి రోజున బుధవారం బైరాగి వేషంలో చిన్నారులు అలరించారు. -
అవినీతి రారాజు.. మండలానికో సామంత రాజు
[ 16-05-2024]
అనగనగా ప్రసిద్ధి గాంచిన చంద్రగిరి కోట. ఆ కోటను ఐదేళ్లుగా అవినీతి, దోపిడీ రారాజు పరిపాలిస్తున్నారు. ఆయన రాజ్యంలోని బంట్లు రారాజును ఆదర్శంగా తీసుకున్నారు. గ్రావెల్ అక్రమ రవాణా, ప్రభుత్వ భూముల ఆక్రమణ, ప్రైవేటు భూముల కబ్జాలు, సెటిల్మెంట్లను అక్రమ సోపానాలుగా మలుచుకున్నారు. -
వైకాపా నేతలా.. వదిలేయి..!
[ 16-05-2024]
నేరానికి పాల్పడిన వ్యక్తుల కంటే అందుకు కారకులైన వారే ప్రధాన నిందితులు.. ఇదీ శిక్షణ సందర్భంగా పోలీసులకు చెప్పే తొలి పాఠం.. జిల్లా పోలీసులు మాత్రం ఈ సూత్రాన్ని పూర్తిగా విస్మరించారు. -
నాని ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు
[ 16-05-2024]
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎస్వీయూ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం మండలం వైకాపా నేత భానుకుమార్రెడ్డి, నడవలూరు సర్పంచి గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై కేసు పెట్టారు. -
జలకళ నిలిపి.. చుక్కలు చూపి..
[ 16-05-2024]
పెద్దపంజాణి మండలం చలమంగళానికి చెందిన రైతు నాగరాజుకు మూడు ఎకరాల పొలం ఉంది. గతంలో వేసిన బోరులో వచ్చే నీరు పశుగ్రాసం, వేరుసెనగ సాగుకు కూడా సరిపోయేది కాదు. బోరు నుంచి నీళ్లు నిలిచిపోవడంతో పంట వదిలేశారు. -
గ్రామాల్లో అందని ద్రాక్షగా వైద్యం!
[ 16-05-2024]
నిరుపేదలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేయలేక చేతులెత్తేశారు. పల్లె ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి ప్రాథమిక వైద్యసేవలు అందించి ప్రాణాపాయ పరిస్థితి -
ఇదీ లెక్క.. గెలుపు మాదే పక్కా
[ 16-05-2024]
ఓటరు నాడి పట్టుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక.. నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ వివరాలు స్పష్టమయ్యాయి. -
ఆవిరైన ఏపీ సీడ్స్.. ఆశలు
[ 16-05-2024]
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్) ఆశించిన మేరకు విత్తన సేకరణ చేపట్టలేకపోయింది. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన వరి వంగడాలు అందుబాటులోకి తెచ్చే దిశగా విత్తన సేకరణకు శ్రీకారం చుట్టింది. -
స్ట్రాంగ్రూంలకు మూడంచెల భద్రత
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ముగియగా.. ప్రధాన ఘట్టమైన ఓట్ల లెక్కింపు ఉంది. అందులో భాగంగా ఈవీఎం బాక్సుల భద్రతకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ మణికంఠచందోలు తెలిపారు. -
నిఘా నేత్రాలే లేకుంటే అంతే!
[ 16-05-2024]
కట్టుదిట్ట భద్రత కల్పించిన శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ల వద్ద మంగళవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రోద్బలంతో వైకాపా మూకలు తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనను నిఘా నేత్రాలే బహిర్గతం చేశాయి. -
ఎన్నికల హడావుడిలో అధికారులు..
[ 16-05-2024]
ఎన్నికల హడావుడిలో అధికారులు ఉంటే.. వ్యాపారులు తమ పని చేసుకుపోతున్నారు. తమిళనాడు బియ్యం మన రాష్ట్రానికి.. మన రాష్ట్రం బియ్యం కర్ణాటకకు.. -
ఖర్చెంతో చెప్పండి
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అలా అని పోటీచేసిన అభ్యర్థులు రిలాక్స్ అయిపోదామంటే కుదరదు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు ఎన్నికల ఖర్చును -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-05-2024]
బంగారుపాళ్యం మండలంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. -
స్విమ్స్ నుంచి ఇంటికి పులివర్తి నాని
[ 16-05-2024]
చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్విమ్స్ నుంచి బుధవారం డిశ్ఛార్జి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనలో గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?