పూతలపట్టులో.. తెదేపాకు ఒక్క అవకాశమివ్వండి...!
పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ అన్నారు.
కొనసాగిన నామినేషన్ల పర్వం
చిత్తూరు కలెక్టరేట్, తవణంపల్లె, న్యూస్టుడే: పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ అన్నారు. రంగంపేట క్రాస్ నుంచి సోమవారం భారీ ర్యాలీతో ఆర్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పూతలపట్టులో మూడుసార్లు తెదేపాను ఓడించారని, గెలిచిన ఎమ్మెల్యేలు చెప్పుకొనేలా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. గతంలో ఏమీ చేయలేని ఎమ్మెల్యేలు మళ్లీ ఓటు కోసం మన ముందుకు వస్తున్నారన్నారు. తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించి అభివృద్ధి చేసి చూపుతానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, తెదేపా మండలాధ్యక్షులు దొరబాబుచౌదరి, దిలీప్నాయుడు, గిరి నాయుడు, మురార్జీయాదవ్, జయప్రకాష్నాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యులు వెంకటేశ్వరచౌదరి, లత, కాణిపాకం ఆలయ మాజీ ఛైర్మన్ మణినాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు పార్లమెంట్ స్థానానికి వైకాపా అభ్యర్థి రెడ్డెప్ప, రెడ్డెమ్మ, నేషనల్ మహాసభ పార్టీ అభ్యర్థి జానకిరామారావు నామినేషన్ పత్రాలు అందజేశారు. అసెంబ్లీ స్థానానికి పలువురు అభ్యర్థులు నామినేషన్లు ఆర్వో, జేసీ శ్రీనివాసులుకు అందజేశారు. తెదేపా అభ్యర్థి జగన్మోహన్ సతీమణి ప్రతిమ, వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి భార్య ఇందుమతి నామినేషన్లు వేశారు. నగరి: అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పి.డి.నారాయణస్వామి మొదలి నామినేషన్ దాఖలు చేశారని ఆర్వో కె.వెంకటరెడ్డి తెలిపారు. ్ర పూతలపట్టు అసెంబ్లీ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా నాగేశ్వర తమ పత్రాలు ఆర్వో చిన్నయ్యకు అందజేశారు. పెనుమూరు, జీడీనెల్లూరు: అసెంబ్లీ స్థానానికి తెదేపా తరఫున రవికుమార్ కుటుంబీకులతో కలిసి నామినేషన్ వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాల పెద్దిరెడ్డి, తాయిలాల చెవిరెడ్డి పని పట్టండి
[ 03-05-2024]
రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సైకోలా పట్టిపీడిస్తుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలను పాపాల పెద్దిరెడ్డి హింసిస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
ఎండల్లో ఏడి‘పింఛెను’
[ 03-05-2024]
చిత్తూరు నగరంలోని 8వ డివిజన్ వెంగళరావుకాలనీకి చెందిన వృద్ధుడు రాజారెడ్డి రెండ్రోజులుగా పింఛను కోసం స్థానిక సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. -
ఎంత పని చేశావు జగన్..!
[ 03-05-2024]
ప్రస్తుతం.. సీఎం జగన్.. నియోజకవర్గానికి ఒక స్కిల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఆపై జిల్లాకు ఒక స్కిల్ కళాశాల మంజూరు చేసి మమ అనిపించారు. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి నగరాల్లో గతంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లనే స్కిల్ కళాశాలలుగా మార్పు చేసి నిర్వహిస్తున్నారు. -
అరాచకాలను కనిపెట్టేందుకు నిఘా
[ 03-05-2024]
పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా గురువారం పేర్కొన్నారు. -
తెదేపాపై కసి.. శీతల గిడ్డంగిని ఆపేసి
[ 03-05-2024]
పశ్చిమ ప్రాంతంలోని పలమనేరు మార్కెట్ కమిటీ రైతులకు వరం. ఉద్యాన పంటలతో పాటు కూరగాయలు, పూలు, వరి వేరుసెనగ, బంగాళాదుంప తదితర పంటలు పండిస్తారు. -
ఇదేనా జగన్ చి(చె)త్త శుద్ధి..!
[ 03-05-2024]
జగన్ సర్కారు నిర్లక్ష్యం పుణ్యమా.. అని జిల్లాలో స్వచ్ఛ సంకల్పం ఆచరణలో నీరుగారిపోయింది. స్వచ్ఛభారత్ నినాదంతో గ్రామాల్లో పారిశుద్ధ్యమే లక్ష్యంగా ప్రభుత్వం వెచ్చించిన రూ. కోట్ల నిధులకు ప్రయోజనం లేకుండా పోయింది. -
నయవంచక నాయకా...!
[ 03-05-2024]
నగరి మండలం తడుకుపేటలో 200 ఇళ్లను ఆప్షన్-3 కింద నిర్మిస్తున్నారు. కొన్ని ఇళ్ల పనులు పైకప్పు వరకు వచ్చాయి. ఆపై అవి అక్కడితో నిలిచిపోయాయి. -
లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నేతలు
[ 03-05-2024]
చంద్రగిరి పర్యటనకు వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్.రాజన్, మాజీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి గురజాల సందీప్ ఆధ్వర్యంలో పలువురు వైకాపా నాయకులు గురువారం తెదేపా కండువా కప్పుకొన్నారు. -
వాలంటీరు ప్రచారాన్ని అడ్డుకున్న తెదేపా
[ 03-05-2024]
ఓ మహిళా వాలంటీరు వైకాపా తరఫున చేస్తున్న ప్రచారాన్ని స్థానిక తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకులు తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. -
వైకాపా నేతలకు స్లిప్పులు
[ 03-05-2024]
తిరుపతి 22వ డివిజన్ 266 పోలింగ్ కేంద్రం పరిధిలో బీఎల్వో గోపీకృష్ణ ఓటర్లకు స్లిప్లు పంపిణీ చేస్తూ.. ఓటరు సంతకంతోపాటు ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. -
ఇళ్లు కాదు.. అబద్ధాలు కళ్లకు కట్టారు
[ 03-05-2024]
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహాలు మంజూరు చేసి.. ఒక్కో గృహానికి రూ.1.80 లక్షలు కేటాయించారు. ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని గొప్పగా ప్రకటించారు సీఎం జగన్. -
‘జగన్ 30 స్థానాలకు పడిపోవడం ఖాయం’
[ 03-05-2024]
జగన్ పరిపాలనపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, శాసనసభ ఎన్నికల్లో వైకాపా 30 స్థానాలకు పడిపోవడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ స్పష్టం చేశారు
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు