logo

బ్యాండేజ్‌ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం

ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్‌ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు.

Published : 30 Apr 2024 02:41 IST

గడ్డూరులో నుదుట బ్యాండేజ్‌ వేసుకుని, చేతిలో గులకరాయి పట్టుకుని వినూత్నరీతిలో ఎన్నికల ప్రచారం

బైరెడ్డిపల్లె: ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్‌ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. బైరెడ్డిపల్లె మండలం గడ్డూరులో సోమవారం ఎన్డీయే పలమనేరు అసెంబ్లీ అభ్యర్థి అమరనాథరెడ్డి, చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావుకు మద్దతుగా తెదేపా, జనసేన నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం చేపట్టారు. నుదుటన బ్యాండేజ్‌లు వేసుకుని, చేతిలో గులకరాయి పట్టుకుని వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని