సూత్రదారితెన్నూ లేని దర్యాప్తు
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఇంకా వైకాపా నేతలకు వంత పాడుతూనే ఉన్నారు.
పులివర్తి నానిపై దాడి ఘటనలో తీవ్ర తాత్సారం
వైకాపాకు వంతపాడుతున్న పోలీసులు
ఎన్నికల సంఘం ఆక్షేపిస్తున్నా మారని తీరు
ఈనాడు-తిరుపతి: తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఇంకా వైకాపా నేతలకు వంత పాడుతూనే ఉన్నారు. అత్యంత కట్టుదిట్ట భద్రత ఉండాల్సిన స్ట్రాంగ్ రూమ్ల సమీపంలోనే వైకాపా నేతలు మారణాయుధాలతో దాడికి తెగబడ్డా అధికార పార్టీ నేతలపై మమకారం కురిపిస్తూనే ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అతని కుమారుడు మోహిత్రెడ్డిలు కుట్ర పన్ని అనుచరులతో తనపై దాడి చేయించినట్లు పులివర్తి నాని ఫిర్యాదులో స్పష్టం చేసినా ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయడం లేదు. వారి గురించి ఆలోచించడమే పాపమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటన ఒక్కటే కాదు గతంలోనూ తెదేపాపై కేసులు బనాయించడంలో పోలీసులు అత్యుత్సాహం కనబరిచారు. అదే సమయంలో వైకాపా నేతలపై ఆధారాలున్నా సూత్రధారులను విస్మరించడమే తమ ఎజెండా అన్నట్లు దర్యాప్తును ముగిస్తున్నారు. గతంలో అనేక ఘటనలను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతోంది.
సీసీ టీవీ ఫుటేజీ లేకుంటే అంతే..
నానిపై దాడి ఘటనను తీసుకుంటే ఎప్పటికైనా వైకాపా మూకలు తనపై దాడి చేపట్టవచ్చని ముందుగానే పసిగట్టి తన వాహనాలకు సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. ఆ మూడో కన్నే నిందితులను పట్టించింది. అదీ లేకుంటే దర్యాప్తు పేరుతో పోలీసులు తాత్సారం చేసి కేసును నీరుగార్చేవారన్న ఆరోపణలున్నాయి. సీసీ టీవీలో భానుకుమార్రెడ్డి, గణపతిరెడ్డిలతోపాటు దాడికి పాల్పడిన అనేకమంది స్పష్టంగా కనిపించారు. దాడి ఘటనలతో పాటు నిందితులకు సంబంధించిన ఫొటోలు మీడియాలో రావడంతోపాటు అటు ఎన్నికల కమిషన్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. హింసాత్మక ఘటనలు జరుగుతుంటే పోలీసులు ఎందుకు సక్రమంగా స్పందించట్లేదంటూ ప్రశ్నించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే వీరిని అరెస్టు చేసినట్లు సమాచారం.
విజయసాయిరెడ్డి చెప్పారని వదిలేసి..
పెళ్లకూరు పరిధిలో ఎన్డీసీసీబీ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి అదే పార్టీకి చెందిన వ్యక్తిని స్తంభానికి కట్టి కొట్టించినా పోలీసులు కనీసం స్పందించలేదు. వైకాపా నేత విజయసాయిరెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని కేసు లేకుండా చేశారు. బాధితుడిని బలవంతంగా ఇంటికి పంపించేశారు. వైకాపా శ్రేణులకు కొందరు పోలీసు అధికారులు కొమ్ము కాస్తున్నారనడానికి అనేక ఘటనలున్నాయి.
మూడు రహదారులపై నిరసనలోనూ..
ఎస్వీ విశ్వవిద్యాలయం పరిధిలో మూడు రహదారులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతలపై వైకాపా మూకలు దాడి చేసినా పోలీసులు నామమాత్రంగానే చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో తమకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని పేర్కొంటూ ఏకంగా పలు పార్టీల నేతలు, వ్యక్తుల ఫొటోలను పాడెపై పెట్టి వైకాపా నేతలు దహన సంస్కారాలు చేసినా పట్టించుకోలేదు. వైకాపా నేతలకు కాపలా కాసి మరీ పోలీసులు ఆ తతంగాన్ని పూర్తి చేయించడం గమనార్హం.
చెవిరెడ్డే అంగీకరించినా..
రేణిగుంట మండలం గాజులమండ్యం ప్రాంతంలోని ఓ గోదాములో వైకాపాకు చెందిన సామగ్రి పెద్ద ఎత్తున పట్టుబడింది. ఇందులో అనేక తాయిలాలు పట్టుబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ సామగ్రిని ఇక్కడి నుంచే సరఫరా చేసినట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వస్తువులు పట్టుకున్నందున నలుగురు అనామకులపై పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. గోదామును లీజుకు తీసుకున్న, సామగ్రి తానే సరఫరా చేస్తున్నట్లు ప్రకటించిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని వదిలిపెట్టడంతో జిల్లా యంత్రాంగం, పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చింది.
తెదేపా వారైతే ఆధారాలు అనవసరం
- తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెదేపాకు చెందిన కొందరు నేతలు సెప్టెంబరు 12న వికృతమాల వద్ద ధర్నా చేసి.. రాకపోకలను నిలిపి.. స్థానికులను దుర్భాషలాడారని ఆరుగురు తెదేపా కార్యకర్తలపై డిసెంబరు 29న ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ రోజు తెదేపా నాయకులు అక్కడ ఆందోళన చేయకపోవడం గమనార్హం.
- తిరుపతి నగరంలో తెదేపా నేతలు దిష్టిబొమ్మ దహనం చేయడంతో వారిపై ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మంత్రి రోజాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తిరుపతి ప్రెస్క్లబ్లోకి పోలీసులు ప్రవేశించి వారిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటి ఆశలతో.. కొలువుదీరిన వేళ
[ 13-06-2024]
జగనాసుర పాలనతో రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా నవ్యాంధ్ర పరుగులిడేందుకు రంగం సిద్ధమైంది. -
అధికారుల్లో చలనం కరవు
[ 13-06-2024]
వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో తాగునీటి పైపులైన్లు మురుగునీటి కాలువల్లో ఉన్నాయని ‘ఈ నెల 1న ప్రజలకు ఏమైంతే మనకేంటి’’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. -
నవ్యాంద్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
పిల్లలు పనిలో కాదు.. బడిలో ఉండాలి
[ 13-06-2024]
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని శిక్షణ సహాయ కలెక్టర్ హిమవంశీ పిలుపునిచ్చారు. -
చంద్రోత్సాహం
[ 13-06-2024]
వీధులన్నీ జనసంద్రమయ్యాయి.. అభిమానం పోటెత్తింది.. నేతలు, కార్యకర్తలు, ప్రజలు రోడ్లెక్కి పండుగ చేశారు.. ఎక్కడికక్కడ ఎల్ఈడీ తెరలపై ప్రభుత్వ కార్యాలయాల్లో అభిమాన నేత నారా చంద్రబాబు నాయుడి నాలుగోసారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని వేకళ్ల వీక్షించారు. -
జన్మభూమి కోసం
[ 13-06-2024]
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా జన్మభూమిపై మమకారాన్ని చాటారు.. ఒక్క ఓటే కదాని ఊరుకోక, తమకెందు కులే అని బాధ్యతారాహిత్యంగా ఉండలేక వ్యయప్రయాసలకోర్చి సొంతూళ్ల బాట పట్టారు. -
ముగిసిన గంగమ్మ జాతర
[ 13-06-2024]
స్థానిక సంతపేట సమీపంలోని తిమ్మసముద్రంలో గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. ప్రజలు ఊరేగింపుగా వచ్చి గంగమ్మకు సారెను సమర్పించారు. -
ప్రమోద క్షణాలు
[ 13-06-2024]
-
రాతమారని.. ప్రభుత్వ బడులు
[ 13-06-2024]
ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల తీరు దారుణంగా ఉంది. ఈ ఏడాది సైతం అవే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నాడు-నేడు పేరిట ఐదేళ్లు గారిడీ చేయగా చాలా బడులకు తాగునీరు అందుబాటులో లేని దుస్థితి. -
తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రొటోకాల్ పాటించని అధికారులు
[ 13-06-2024]
శ్రీవారి దర్శనం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నీట్ వ్యవహారం.. ‘సుప్రీం’ పర్యవేక్షణలో దర్యాప్తు చేయండి: ఖర్గే డిమాండ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఒక డాలరు పెట్టి కొన్న పాత పేపర్లలో.. అన్నీ సైనిక రహస్యాలే!
-
మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. 16,347 పోస్టులు
-
లోక్సభ ఎన్నికల్లో దూకుడు.. ‘మహా’ పట్టుకు శరద్ పవార్ ప్రయత్నాలు
-
భారత్-చైనా టెన్షన్లు తగ్గాలంటే సమష్టి ప్రయోజనాలను గుర్తించాలి: అమెరికా