బకాయిలపై గురి
ఏళ్లుగా పేరుకుపోయిన రుణ బకాయిలపై ఎస్సీ కార్పొరేషన్ దృష్టిసారించింది. బకాయిల వసూలుకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. గతంలో రవాణా, రవాణేతర విభాగాల్లో స్వయం ఉపాధి కోసం రుణాలు పొంది.. తిరిగి చెల్లించని వారి జాబితాలు సిద్ధంచేసిన సంస్థ.
కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం
ఈనాడు - కాకినాడ: ఏళ్లుగా పేరుకుపోయిన రుణ బకాయిలపై ఎస్సీ కార్పొరేషన్ దృష్టిసారించింది. బకాయిల వసూలుకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. గతంలో రవాణా, రవాణేతర విభాగాల్లో స్వయం ఉపాధి కోసం రుణాలు పొంది.. తిరిగి చెల్లించని వారి జాబితాలు సిద్ధంచేసిన సంస్థ.. వీరితోపాటు.. వీరికి హామీ ఇస్తూ ష్యూరిటీ సంతకాలు చేసిన వారికీ తాఖీదులు పంపడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా బకాయిదారులు వెయ్యి మందికి పైనే ఉంటే.. ఇప్పటికే 500 మందికి నోటీసులు జారీచేసింది.
జిల్లాలో షెడ్యూల్డు కులాల సహకార సంఘం పరిధిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జాతీయ ఎస్సీల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్డీసీ) 2015-16 నుంచి.. జాతీయ సఫాయి కర్మచారీల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్కేఎఫ్డీసీ) పథకాన్ని 2016-17 నుంచి అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈ రెండు పథకాల కింద రవాణా, రవాణేతర విభాగాల్లో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రుణాలు మంజూరుచేశారు. కొద్ది మంది మాత్రమే సవ్యంగా చెల్లిస్తున్నా.. మరికొందరు కొన్ని వాయిదాలు చెల్లించి ఆపేయడం.. ఇంకొందరు ఆ ఊసేలేకపోవడంతో తాజాగా బకాయిల వసూలుపై దృష్టిసారించారు.
కట్టింది ఎంత.. కట్టాల్సింది ఎంత..?
జిల్లాలో రవాణా విభాగంలో కార్లు, ట్రాక్టర్లు వంటి వాహనాలకు, రవాణేతర విభాగం కింద కిరాణా, ఇతర దుకాణాలు, టెంట్ హౌస్ తదితర స్వయం ఉపాధి యూనిట్లు మంజూరుచేశారు. రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఈ రుణాలు అప్పట్లో మంజూరు చేశారు. పొందిన రుణాల్లో రూ.3 లక్షల వరకు 60 శాతం, రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 50 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 40 శాతం, రూ.10 లక్షలు దాటితే 35 శాతం వరకు రాయితీ ఇచ్చారు. రెండు శాతం లబ్ధిదారుని వాటా కాగా.. మిగిలినవి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా ఈ రుణాలు మంజూరుచేశారు. అయిదేళ్ల గడువులో వాయిదాల రూపంలో రుణాలు చెల్లించాలనే నిబంధన లబ్ధిదారులు పాటించకపోవడంతో తాజాగా నోటీసులకు ఉపక్రమించారు.
* ఎన్ఎస్ఎఫ్డీసీ కింద 903 యూనిట్లు రూ.27.11 కోట్లతో మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు రూ.4.04 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
* ఎన్ఎస్కేఎఫ్డీసీ కింద 159 యూనిట్లు రూ.2.94 కోట్లతో మంజూరుచేస్తే.. రూ.21.74 లక్షలు మాత్రమే లబ్ధిదారులు చెల్లించారు.
వసూళ్లపై దృష్టి
జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాల కింద రవాణా, రవాణేతర యూనిట్లకు 2015 నుంచి రుణాలు మంజూరయ్యాయి. రుణ బకాయిలు చాలామంది చెల్లించడంలేదు. వారి నుంచి బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. రుణాలు చెల్లించని లబ్ధిదారులతోపాటు, వారికి హామీగా ఉన్నవారు 500 మందికి నోటీసులు ఇస్తున్నాం. లబ్ధిదారులు తీసుకున్న రుణం సక్రమంగా చెల్లిస్తేనే భవిష్యత్తులో మరికొందరికి లబ్ధి చేకూరే వీలుంది.
-డి.ఎస్.సునీత, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, కాకినాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
[ 14-05-2024]
కోనసీమ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. -
పవన్కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు
[ 14-05-2024]
జనసేన అధినేత, కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్కు పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. -
మళ్లీ ఎలా వస్తావో మేమూ చూస్తాం.. వంగా గీతను నిలదీసిన ఓటర్లు
[ 14-05-2024]
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరం పోలింగ్ కేంద్రానికి వచ్చిన పిఠాపురం వైకాపా అభ్యర్థిని వంగా గీతను ఓటర్లు నిలదీశారు. -
ఓటరు.. చైతన్యం సూపర్
[ 14-05-2024]
సార్వత్రిక సమరం ఓటర్లలో చైతన్యం నింపింది. వజ్రాయుధాన్ని సంధించడానికి ఉత్సాహం చూపారు. సోమవారం ఉదయం 6.30 గంటల నుంచే బారులు తీరారు. -
ఓటేశారు..
[ 14-05-2024]
విదేశాల నుంచి వచ్చారు.. ఇతర రాష్ట్రాల నుంచి రెక్కలు కట్టుకొని వచ్చేశారు. రైళ్లు, బస్సులు, ప్రయివేటు వాహనాల్లో ఉత్సాహంగా తరలివచ్చారు. -
ధీమా ఇవ్వని వైఎస్సార్ బీమా
[ 14-05-2024]
వైఎస్సార్ బీమా పథకంతో బాధిత కుటుంబాలకు ధీమా లేకుండా పోయింది. -
బూత్ మారడంతో ఓటింగ్కు దూరం
[ 14-05-2024]
సీతానగరం మండలం ముగ్గళ్లలో 35వ పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. -
సమయం దాటినా అధికార పార్టీ వ్యక్తికి అనుమతి
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6.00 గంటలలోగా పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. -
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి: పురందేశ్వరి
[ 14-05-2024]
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
బస్సులు లేవు.. రైళ్లు రద్దీ
[ 14-05-2024]
వారంతా ఓటు వేయాలనే సంకల్పంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. -
బందోబస్తు ఉన్నా ఉద్రిక్త ఘటనలు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకున్నా.. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. -
ఐడీ కార్డు లేకుండా ప్రచారమా?
[ 14-05-2024]
పెదపూడి మండలం జి.మామిడాడ శివారు లక్ష్మీనరసాపురం వద్ద ఉన్న 196,197,198 పోలింగ్ కేంద్రాల వద్ద స్థానిక సచివాలయ కార్యదర్శి వై.వి.వి.దుర్గాప్రసాద్ వైకాపాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించడంపై ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. -
రంగాపురంలో రాళ్లురువ్వుకున్న ఇరువర్గాలు
[ 14-05-2024]
పోలింగ్ చివరి క్షణంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం రంగాపురంలో ఘర్షణ చోటు చేసుకుంది. -
కృష్ణునిపాలెంలో ఉద్రిక్తత
[ 14-05-2024]
వైకాపా, తెదేపా వర్గీయుల కవ్వింపు చర్యలు గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఉద్రిక్తతకు దారి తీశాయి. -
పోలింగ్ ఏజెంట్గా జడ్పీ ఉపాధ్యక్షురాలు
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఉపాధ్యక్షురాలు పోశిన శ్రీలేఖ ఎన్నికల ఏజెంట్గా వ్యవహరించారు. -
వైకాపా ఎంపీ అభ్యర్థికి ఏజెంట్లు కరవు
[ 14-05-2024]
వైకాపా ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావుకు పోలింగ్ ఏజెంట్లు లేని పరిస్థితి అల్లవరం, గోడితిప్ప, మొగళ్లమూరు, తూర్పులంక, తదితర కేంద్రాల్లో కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక