నవ శాస్త్రవేత్తలకు ఆహ్వానం
విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు 12 రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుంది.
న్యూస్టుడే, వెంకట్నగర్(కాకినాడ)
విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు 12 రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుంది. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. శిక్షణకు హాజరయ్యే వారికి రవాణా ఛార్జీలు, బస, భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస వినీల్ తెలిపారు.
దరఖాస్తు విధానం...
విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట ఇ-మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి. క్విజ్ పూర్తిచేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తుతో పాటు విద్యార్థి సంతకం చేసిన పత్రం, విద్యార్థి గత మూడేళ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. మార్చి 20 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఎంపిక జాబితాలను ఏప్రిల్ 20న ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు.
ఎంపిక ఇలా...
ప్రస్తుతం తొమ్మిదో (2022-23) తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఎనిమిదో తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైన వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వామ్యం, సైన్స్ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్లో పాల్గొని మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. రిజిష్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన వారు, స్కౌట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో సభ్యులు, ఆన్లైన్ క్విజ్లో ప్రతిభ చూపిన వారి ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు.
మే 15 నుంచి 26 వరకు శిక్షణ...
శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తీసుకువెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు.
శిక్షణ కేంద్రాలు
ఎంపికైన విద్యార్థులకు ఏడు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. ఐఐఆర్ఎస్ (డెహ్రాడూన్), విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (తిరువనంతపురం), సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (శ్రీహరికోట), యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ (బెంగళూరు), స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), నార్త్-ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (షిల్లాంగ్) కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు.
విద్యార్థులను ప్రోత్సహించాలి
వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, అంతరిక్ష పరిశోధన రంగాలపై ఆసక్తి పెంచడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికైన విద్యార్థులకు స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే పాఠశాలలకు పంపించాం. http:///www.isro.gov.in./YUVIKA వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
కేఎన్వీఎస్ అన్నపూర్ణ, డీఈవో, కాకినాడ జిల్లా యువికా వెబ్పోర్టల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
[ 14-05-2024]
కోనసీమ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. -
పవన్కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు
[ 14-05-2024]
జనసేన అధినేత, కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్కు పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. -
మళ్లీ ఎలా వస్తావో మేమూ చూస్తాం.. వంగా గీతను నిలదీసిన ఓటర్లు
[ 14-05-2024]
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరం పోలింగ్ కేంద్రానికి వచ్చిన పిఠాపురం వైకాపా అభ్యర్థిని వంగా గీతను ఓటర్లు నిలదీశారు. -
ఓటరు.. చైతన్యం సూపర్
[ 14-05-2024]
సార్వత్రిక సమరం ఓటర్లలో చైతన్యం నింపింది. వజ్రాయుధాన్ని సంధించడానికి ఉత్సాహం చూపారు. సోమవారం ఉదయం 6.30 గంటల నుంచే బారులు తీరారు. -
ఓటేశారు..
[ 14-05-2024]
విదేశాల నుంచి వచ్చారు.. ఇతర రాష్ట్రాల నుంచి రెక్కలు కట్టుకొని వచ్చేశారు. రైళ్లు, బస్సులు, ప్రయివేటు వాహనాల్లో ఉత్సాహంగా తరలివచ్చారు. -
ధీమా ఇవ్వని వైఎస్సార్ బీమా
[ 14-05-2024]
వైఎస్సార్ బీమా పథకంతో బాధిత కుటుంబాలకు ధీమా లేకుండా పోయింది. -
బూత్ మారడంతో ఓటింగ్కు దూరం
[ 14-05-2024]
సీతానగరం మండలం ముగ్గళ్లలో 35వ పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. -
సమయం దాటినా అధికార పార్టీ వ్యక్తికి అనుమతి
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6.00 గంటలలోగా పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. -
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి: పురందేశ్వరి
[ 14-05-2024]
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
బస్సులు లేవు.. రైళ్లు రద్దీ
[ 14-05-2024]
వారంతా ఓటు వేయాలనే సంకల్పంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. -
బందోబస్తు ఉన్నా ఉద్రిక్త ఘటనలు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకున్నా.. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. -
ఐడీ కార్డు లేకుండా ప్రచారమా?
[ 14-05-2024]
పెదపూడి మండలం జి.మామిడాడ శివారు లక్ష్మీనరసాపురం వద్ద ఉన్న 196,197,198 పోలింగ్ కేంద్రాల వద్ద స్థానిక సచివాలయ కార్యదర్శి వై.వి.వి.దుర్గాప్రసాద్ వైకాపాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించడంపై ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. -
రంగాపురంలో రాళ్లురువ్వుకున్న ఇరువర్గాలు
[ 14-05-2024]
పోలింగ్ చివరి క్షణంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం రంగాపురంలో ఘర్షణ చోటు చేసుకుంది. -
కృష్ణునిపాలెంలో ఉద్రిక్తత
[ 14-05-2024]
వైకాపా, తెదేపా వర్గీయుల కవ్వింపు చర్యలు గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఉద్రిక్తతకు దారి తీశాయి. -
పోలింగ్ ఏజెంట్గా జడ్పీ ఉపాధ్యక్షురాలు
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఉపాధ్యక్షురాలు పోశిన శ్రీలేఖ ఎన్నికల ఏజెంట్గా వ్యవహరించారు. -
వైకాపా ఎంపీ అభ్యర్థికి ఏజెంట్లు కరవు
[ 14-05-2024]
వైకాపా ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావుకు పోలింగ్ ఏజెంట్లు లేని పరిస్థితి అల్లవరం, గోడితిప్ప, మొగళ్లమూరు, తూర్పులంక, తదితర కేంద్రాల్లో కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక