మా అందరి స్వస్థలం పిఠాపురం
తమ స్వస్థలం పిఠాపురంగా భావిస్తున్నామని మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్తేజ్ అన్నారు. పి
మాట్లాడుతున్న వరుణ్తేజ్
గొల్లప్రోలు: తమ స్వస్థలం పిఠాపురంగా భావిస్తున్నామని మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్తేజ్ అన్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధి పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి, చెందుర్తి, దుర్గాడ గ్రామాల్లో శనివారం సాయంత్రం నుంచి రోడ్షో నిర్వహించారు. బాబాయ్ పవన్కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురాన్ని తమ కుటుంబం మొత్తం సొంత ఊరుగా చేసుకుంటామన్నారు. నిత్యం ప్రజలకోసమే జనసేనాని ఆలోచిస్తారన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు.
ప్రచారంలో పాల్గొన్న జనం
జనసైనికుల ఉత్సాహం: వరుణ్తేజ్కు గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. చెందుర్తి, దుర్గాడ గ్రామాలకు వరుణ్తేజ్ వచ్చే సరికి సమయం రాత్రి 9 గంటలైనా అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తాటిపర్తి గ్రామంలో అపర్ణాదేవి అమ్మవారిని వరుణ్తేజ్ దర్శించుకున్నారు. వన్నెపూడి గ్రామంలోని దత్తాత్రేయస్వామి వారికి ప్రచార రథంలో నుంచే నమస్కరించారు. తాటిపర్తి గ్రామంలో రోడ్షో నిర్వహించే సమయంలో ప్రచార రథం క్లచ్ ప్లేట్లు కాలిపోవడంతో కొంతదూరంపాటు కారులోనే పర్యటిస్తూ ప్రచారం సాగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ఓటు అభివృద్ధికా.. అరాచకానికా?
[ 12-05-2024]
సహజ సంపదకు నిలువెత్తు ఠీవిలా కనిపించే గిరులకు బోడిగుండు కొట్టేశారు.. యువతకు జాబ్ క్యాలెండర్ ఊసెత్తకుండా ఉస్సూరనిపించారు.. -
మీ కోపం ఓట్ల రూపంలో చూపండి
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం సాయంత్రం కాకినాడలోని బాలాజీ చెరువు కూడలిలో ‘వారాహి విజయభేరి’ బహిరంగ సభ నిర్వహించారు. -
పట్టించుకోని ప్రభుత్వం.. పడకేసిన పథకం
[ 12-05-2024]
కొవ్వూరు మండలం సీతంపేట వద్ద ఉన్న జీటీపీఎస్లో గ్యాస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేవారు. అలా ఉత్పత్తి చేసేందుకు నీరు ఉపయోగించేవారు. -
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
[ 12-05-2024]
ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతిఒక్కరూ నడుచుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి.జగదీష్ హెచ్చరించారు. -
ఓటేసేందుకు సొంతూళ్లకు..
[ 12-05-2024]
విద్య, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా దూరప్రాంతాల్లో ఉంటున్న జిల్లావాసులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు తరలివస్తున్నారు. -
బాధ్యత మరిచి.. భారం మోపి
[ 12-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ప్రజలపై మోయలేని భారాలు మోపింది. సంక్షేమ పాలన పేరుతో గొప్పులు చెబుతూనే పథకాలను ఆశచూపి కొందరికే వాటిని అర్హులను చేసింది. ఇచ్చేది గోరంత.. -
జగనన్నా.. ఇదేనా ఆహ్లాదం
[ 12-05-2024]
వి.ఎల్.పురంలోని తెలుకులవారి చెరువు పార్కు లోపల కొన్ని విద్యుత్తు ల్యాంపులు పాడైపోయి ఉన్నాయి. కొన్ని దీపాలు సరిగా వెలగడం లేదు. -
అయిదేళ్ల అధికారం.. అంతటా అంధకారం
[ 12-05-2024]
పండించిన పంటకు పెట్టుబడి కూడా దక్కక రైతన్న కన్నీరు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన యువత.. -
ష్.. గప్చుప్
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలకు తెరపడింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. -
సమయపాలన పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు
[ 12-05-2024]
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. -
కట్టలు పంచి.. మత్తున ముంచి
[ 12-05-2024]
మైకుల హడావిడి లేదు.. ప్రచార హోరు లేదు.. శనివారం సాయంత్రం 6 గంటల కల్లా ఎక్కడివక్కడ గప్చుప్. తెరవెనుక రాజకీయం మొదలైంది..