ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు.
మరొకరి గల్లంతు
మృతులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి, పెంటా జయకుమార్
రావులపాలెం పట్టణం, న్యూస్టుడే: రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపాలేనికి చెందిన జయకుమార్, కొమర్తి రాజేష్, ఈశ్వరరెడ్డి, అతడి అన్నయ్య సత్యనారాయణరెడ్డి, చిన్నమ్మ కుమారుడు విజయనగరానికి చెందిన సంపత్రెడ్డి సరదాగా గోదావరిలో సాన్నం చేసేందుకు గౌతమి వంతెన వద్దకు శనివారం సాయంత్రం వెళ్లారు. సత్యనారాయణరెడ్డి గట్టుపై కూర్చుని ఉండగా, మిగిలిన నలుగురు గోదావరిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈశ్వరరెడ్డి, జయకుమార్, సంపత్రెడ్డి గల్లంతయ్యారు. రాజేష్కు ఈత రావడంతో ఒడ్డుకు చేరాడు. విషయం తెలుసుకున్న సీఐ ఆంజనేయులు సిబ్బందితో అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా ఈశ్వరరెడ్డి, జయకుమార్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. సంపత్రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలానికి ఆలమూరు ఎస్సై శ్రీను నాయక్, రావులపాలెం ఎస్సై రాజేష్, కొత్తపేట అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.
సత్తి అజయ్ సంపత్ రెడ్డి (గల్లంతు)
అన్న చూస్తుండగానే మునిగి..
ఈశ్వర్రెడ్డి ఓడలరేవులోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. తండ్రి రైతు. అందివచ్చిన కొడుకు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. చూస్తుండగానే తమ్ముడు ఈశ్వర్రెడ్డి నదిలో గల్లంతు కావడంతో అతని అన్న సత్యనారాయణరెడ్డి విలపిస్తున్న తీరు కలచివేసింది.
సెలవుల్లో సరదాగా గడిపేందుకు వచ్చి...
గోదావరిలో గల్లంతైన సత్తి అజయ్ సంపత్రెడ్డి పదో తరగతి విద్యార్థి. సొంత గ్రామం అనపర్తికాగా, ఉపాధి నిమిత్తం కుటుంబం మొత్తం విజయనగరం వలస వెళ్లారు. సెలవుల నేపథ్యంలో రావులపాలెంలోని తన పిన్ని ఇంటికి వచ్చాడు. సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి, ఈశ్వరరెడ్డికి తమ్ముడు అవుతాడు. అక్కాచెల్లెళ్ల కుటుంబాల్లో ఇద్దరు మృత్యువాత పడడంతో వారి బాధ వర్ణనాతీతం.
మృతదేహాలను పరిశీలిస్తున్న సీఐ ఆంజనేయులు
కుటుంబానికి ఆసరాగా ఉంటూ..
రావులపాలేనికి చెందిన పెంటా జయకుమార్ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతూనే స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఓ చెల్లి ఉంది. తండ్రి కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొడుకు మృత్యువాత ఆ కుటుంబాన్ని శోకంలోకి నెట్టింది. అందరితో కలివిడిగా, సరదాగా ఉండే జయకుమార్ మృతి విషయం తెలుసుకున్న స్నేహితులు, స్థానికులు గోదావరి వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు.
మళ్లీ శనివారమే..
వారం తిరగకుండానే గోదావరిలో రెండో ప్రమాదం చోటుచేసుకుంది. గత శనివారం ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడుకు చెందిన ముగ్గురు మహిళలు దైవ దర్శనానికి బయలుదేరి ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి గోదావరిలో పడి మృతిచెందారు. ఈ శనివారం ఇదే గౌతమి గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతు కాగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కాలువలకు నీటి సరఫరా నిలుపుదల చేయడం, గోదావరికి నీటి ప్రవాహం పెరగడం, ఊబి ప్రాంతాలు ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గోదావరి పరిసర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏజెంట్ 004
[ 02-06-2024]
సజ్జల వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కేసూ నమోదయ్యింది. ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తంచేస్తున్నాయి. -
నలుచెరుగులా బలగాలు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 48 గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూం, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో సుమారు 1,100 మంది కేంద్ర, రాష్ట్ర బలగాలతో బందోబస్తు ఉంటుంది. -
కూటమి ఖుషీ
[ 02-06-2024]
తెదేపా- జనసేన- భాజపా కూటమిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు అనుకూలంగా రావడంతో తమ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమనే ధీమా కనిపిస్తోంది. -
ఓట్ల లెక్కింపునకు 17 కేంద్రాలు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి నన్నయ విశ్వవిద్యాలయంలో మొత్తం 17 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. కలెక్టరేట్లో శనివారం విలేకరుల సమావేశంలో కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. -
ఎన్డీఏ కూటమిదే విజయం: సీఎం రమేష్
[ 02-06-2024]
కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, భాజపాకు చెందిన సి.ఎం.రమేష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి శనివారం రాత్రి విమానంలో వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బ్యాంకుల్లో 47.82 శాతమే పింఛను సొమ్ము ఉపసంహరణ
[ 02-06-2024]
సామాజిక భద్రత పింఛను డబ్బులు బ్యాంకుల ద్వారా తీసుకునేందుకు ఈ నెల కూడా జిల్లాలోని లబ్ధిదారులు ఇబ్బందులు పడక తప్పలేదు. కొన్నిచోట్ల బ్యాంకుల్లో పింఛను నగదు కోసం గంటల తరబడి వరసలో నిరీక్షించాల్సి వచ్చింది. -
ఆగండి.. ఎలా వెళ్లాలో గమనించండి
[ 02-06-2024]
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ (కౌంటింగ్) జర¢గనుండటంతో ఆ రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి అటుగా వెళ్లే భారీ వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకుంటున్నారు. -
4జీ సేవలు మరింత విస్తృతం
[ 02-06-2024]
4జీ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజరు ఎం.శేషాచలం చెప్పారు. ఈ మేరకు శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఈదురు గాలుల బీభత్సం
[ 02-06-2024]
కాకినాడ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జనం బెంబేలెత్తారు. శనివారం వేకువజామున 4 గంటల నుంచి జిల్లాలోని 14 మండలాలను ఒక్కసారిగా ఈదురుగాలులు చుట్టుముట్టాయి. -
పూడికతీత.. పనుల్లో రోత..!
[ 02-06-2024]
‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా మారింది గోదావరి కాలువలో పూడికతీత పనుల పరిస్థితి. అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నా, పనులకు పక్కాగా అనుమతులు లభించినా పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం నెలకొంది. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమదే మొదటి స్థానం
[ 02-06-2024]
ఏలూరు రేంజ్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమ ప్రథమ స్థానంలో ఉందని ఎస్ఈబీ ఐజీ, జిల్లా లెక్కింపు ప్రత్యేకాధికారి ఎం.రవిప్రకాష్ తెలిపారు. శనివారం ఆయన అమలాపురంలో మాట్లాడారు. -
సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు..
[ 02-06-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఆవశ్యకత, ఓటు విలువను గుర్తించిన యువత పెద్దఎత్తున ఓట్ల పండగలో పాల్గొని.. తమకు నచ్చినవారికి ఓటు వేశారు. జిల్లాలో పోలింగ్ శాతం కూడా భారీగానే నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం!
-
కెనడాను చిత్తు చేసిన యూఎస్ఏ.. టీ20ల్లో రికార్డు విజయం
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
-
అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి