Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు: నారా బ్రాహ్మణి
రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు.
మంగళగిరి: రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా యర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని సందర్శించి కూలీలతో మాట్లాడారు.
‘‘మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు, లోకేశ్ నిరంతరం పరితపిస్తారు. డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదటి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది ఆయనే. ఆర్థిక ఇబ్బందులు మహిళ విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఇటీవల ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ప్రకటించారు. దీని ద్వారా ఎంత పెద్ద చదువుకైనా బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణం లభిస్తుంది. ఉమ్మడి ఏపీలో పెద్ద ఎత్తున ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సుల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించారు. పేద ప్రజలకు కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకే సూపర్-6 పథకాలను ప్రకటించారు. మహిళల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్థికంగా చేయూత అందించాలని నారా లోకేష్ మంగళగిరిలో స్త్రీశక్తి పథకాన్ని అమలుచేస్తున్నారు. మంగళగిరి ప్రజల కోసం సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మీరంతా ఆయనను ఆశీర్వదిస్తే మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందిస్తారు’’ అని బ్రాహ్మణి తెలిపారు.
అన్నా క్యాంటీన్లు ఎత్తేసి మా పొట్టగొట్టారు..
‘‘గతంలో అన్నా క్యాంటీన్ ద్వారా రూ.5తో మా ఆకలి తీరేది. జగన్ ప్రభుత్వం వచ్చాక క్యాంటీన్లు ఎత్తేసి మా పొట్టగొట్టారు. గ్రామంలో పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. రోడ్లన్నీ అధ్వానంగా మారడంతో అవస్థలు పడుతున్నాం. గత ఐదేళ్లుగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ బిల్లులు రెట్టింపయ్యాయి. చాలీ చాలని ఆదాయంతో ఇంటిల్లిపాది పనిచేసినా ఇల్లు గడవడం కష్టంగా ఉంది. గతంలో రాజధాని పనులు జరిగే సమయంలో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేది. వైకాపా వచ్చాక రాజధాని పనులు నిలిపివేయడం, కౌలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు సైతం కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది’’ అని బ్రాహ్మణి ఎదుట మహిళా కూలీలు వాపోయారు. మీ అందరికీ అండగా నిలిచేందుకే సూపర్-6 పథకాలను ప్రకటించారని బ్రాహ్మణి తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేదల ఆకలి తీరుస్తామన్నారు. లోకేశ్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే.. నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
160కి పైగా అసెంబ్లీ.. 25 ఎంపీ స్థానాలు కూటమివే: చంద్రబాబు
తాజా ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఖరారు
ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. -
మన భూములపై జగన్ పెత్తనం.. అరాచకానికి పరాకాష్ట: చంద్రబాబు
రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ఏంటీ దారుణం.. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా?: పవన్
వైకాపా ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. -
పేదల ప్రాణాలతో రాజకీయం చేస్తారా?: సీఎస్కు చంద్రబాబు లేఖ
పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. -
వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు
మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. -
ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో..: షర్మిల ఎద్దేవా
ఏటా సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అని జగన్ అన్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 5 సంక్రాంతులొచ్చాయి.. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
పింఛన్ల పంపిణీ.. ప్రతి నెలా ఇంత మందిని చంపాలని టార్గెట్ పెట్టుకున్నారా?: వైఎస్ షర్మిల
వృద్ధులకు పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
పింఛన్ల పంపిణీపై సీఎస్ అబద్ధాలు: తెదేపా
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి అయిందంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి అబద్ధాలాడుతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
ఎంత ధైర్యం.. మమ్మల్నే ప్రశ్నిస్తావా?
ప్రచారానికి వచ్చిన వైకాపా నాయకులను... తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల గురించి ప్రశ్నించిన మహిళపై ఆ పార్టీ వారు దాడి చేసి గాయపరిచారు. -
భీమిలిలో గంటా X బొత్స
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రాజకీయం.. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. అక్కడ తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. -
కాగితాలపైనే గ్రామాలు.. కనిపించరక్కడ ప్రజలు!
ఎన్నికలొచ్చాయంటే నాయకులకు ఎక్కడెక్కడో ఉన్న ఊళ్లన్నీ గుర్తుకొస్తాయి. ఏనాడూ వెళ్లని ఊళ్ల రికార్డులు తెప్పించుకొని మరీ అక్కడికి వెళ్లి ఓట్ల వేట మొదలుపెడతారు. -
పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు జగన్?: చీపురుపల్లి సభలో బాలకృష్ణ
అమరావతి రాజధానిపై ఉద్యమిస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న సీఎం జగన్ విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఎంత పెట్టుబడులు? ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలంటూ శాసనసభ సాక్షిగా అడిగితే సమాధానం చెప్పలేకపోయారని.. దీన్ని బట్టి ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో తెలుస్తుందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. -
వృద్ధులపై ప్రభుత్వానికి కనికరం లేదా?: డీఎల్ రవీంద్రారెడ్డి
పింఛను డబ్బు బ్యాంకులో జమ చేశామని, వెళ్లి తెచ్చుకోవాలని చెబుతున్న ప్రభుత్వానికి ప్రజలు, వృద్ధులపై ఏమాత్రం కనికరం లేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. -
మీ వెనుక నేనుంటా.. మాటకు కట్టుబడి ఉంటా
‘దశాబ్దం తర్వాత ప్రజలను ఓటేయమని అడగట్లేదు.. వేడుకుంటున్నా.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నా.. కూటమి ప్రభుత్వం వచ్చేస్తోంది. -
జగన్వి నవ దందాలు
‘పొరపాటున వైకాపాకు ఓటేశారో మీ ఇంటికి గొడ్డలి వస్తుంది.. జాగ్రత్త’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు ఓటర్లను హెచ్చరించారు. సీఎం జగన్ నవ దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
ఏలూరు పోరు.. కూటమిదే జోరు!
గోదారి గలగలలు.. కొల్లేటి పక్షుల కిలకిలలు.. ఆత్మీయ పలకరింపుల సంగమమైన ఏలూరు జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల్లో గెలుపుపై ధీమా కనిపిస్తోంది. ఏలూరు జిల్లా వాసులు ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
జమీందార్ల ప్రచార పత్రం ఎలా ఉండేదంటే?
జమీందారీ వ్యవస్థలు ఉన్నప్పుడు 1937లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 1937 ఫిబ్రవరి 9న విజయనగరం గ్రామ సంస్థానానికి ఎన్నిక నిర్వహించారు. -
నువ్వెంత.. నీ అంతు చూస్తా
విధుల్లో ఉన్న గిరిజన మహిళా కానిస్టేబుల్పై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచరుడు రెచ్చిపోయారు. కులం పేరుతో దూషించారు. -
పోలవరం పనుల్లో వైకాపా సర్కారు ఘోర వైఫల్యం
ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పూర్తి చేయకపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
తాజా వార్తలు
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు