Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు: నారా బ్రాహ్మణి
రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు.
మంగళగిరి: రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా యర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని సందర్శించి కూలీలతో మాట్లాడారు.
‘‘మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు, లోకేశ్ నిరంతరం పరితపిస్తారు. డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదటి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది ఆయనే. ఆర్థిక ఇబ్బందులు మహిళ విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఇటీవల ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ప్రకటించారు. దీని ద్వారా ఎంత పెద్ద చదువుకైనా బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణం లభిస్తుంది. ఉమ్మడి ఏపీలో పెద్ద ఎత్తున ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సుల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించారు. పేద ప్రజలకు కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకే సూపర్-6 పథకాలను ప్రకటించారు. మహిళల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్థికంగా చేయూత అందించాలని నారా లోకేష్ మంగళగిరిలో స్త్రీశక్తి పథకాన్ని అమలుచేస్తున్నారు. మంగళగిరి ప్రజల కోసం సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మీరంతా ఆయనను ఆశీర్వదిస్తే మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందిస్తారు’’ అని బ్రాహ్మణి తెలిపారు.
అన్నా క్యాంటీన్లు ఎత్తేసి మా పొట్టగొట్టారు..
‘‘గతంలో అన్నా క్యాంటీన్ ద్వారా రూ.5తో మా ఆకలి తీరేది. జగన్ ప్రభుత్వం వచ్చాక క్యాంటీన్లు ఎత్తేసి మా పొట్టగొట్టారు. గ్రామంలో పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. రోడ్లన్నీ అధ్వానంగా మారడంతో అవస్థలు పడుతున్నాం. గత ఐదేళ్లుగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ బిల్లులు రెట్టింపయ్యాయి. చాలీ చాలని ఆదాయంతో ఇంటిల్లిపాది పనిచేసినా ఇల్లు గడవడం కష్టంగా ఉంది. గతంలో రాజధాని పనులు జరిగే సమయంలో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేది. వైకాపా వచ్చాక రాజధాని పనులు నిలిపివేయడం, కౌలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు సైతం కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది’’ అని బ్రాహ్మణి ఎదుట మహిళా కూలీలు వాపోయారు. మీ అందరికీ అండగా నిలిచేందుకే సూపర్-6 పథకాలను ప్రకటించారని బ్రాహ్మణి తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేదల ఆకలి తీరుస్తామన్నారు. లోకేశ్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే.. నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలకు భూములు జగన్ తాత, నాన్న ఇచ్చారా?: చంద్రబాబు
జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయి -
వైకాపా రంగుల పిచ్చితో రూ.2300 కోట్లు దుబారా: పవన్ కల్యాణ్
రంగుల పిచ్చిలో వైకాపా ప్రభుత్వం రూ.2,300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. -
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్మీనా తెలిపారు. -
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి తెదేపా విజ్ఞప్తి
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా కోరింది. -
నదుల అనుసంధానానికి భాజపా కట్టుబడి ఉంది: నితిన్ గడ్కరీ
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో కూటమి అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
ఐదేళ్లలో జగన్ అవినీతి రూ.8 లక్షల కోట్లు: తెదేపా నేత పట్టాభిరామ్
ఐదేళ్లలో వైఎస్ జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి చేశారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
సీఎం జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘నవ సందేహాల’ పేరుతో జగన్కు షర్మిల మరో లేఖ
‘నవ సందేహాల’ పేరుతో సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. -
వైకాపా ప్రచారంలో ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టరు ఇంజిన్
దెందులూరు వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం రాజుపేటలో అబ్బయ్య చౌదరి ప్రచార ర్యాలీ తీశారు. -
చంద్రబాబు రోడ్షోలో వైకాపా కవ్వింపు చర్యలు
తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన రోడ్షోలో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. -
ప్రచారం పేరుతో.. కొడాలి నాని డబ్బుల పంపిణీ!
ఎన్నికల ప్రచారం పేరుతో గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామాల్లో రూ.లక్షల్లో నగదు పంచుతున్నా నియమావళి అమలు కమిటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పింఛన్ల పంపిణీలో మాజీ వాలంటీర్లు.. వైకాపాకు అనుకూలంగా ఓట్ల అభ్యర్థన!
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లిలో బుధవారం మాజీ వాలంటీర్లు పింఛన్ల సొమ్మును పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. -
నీటి సమస్య మాటేంటి?.. వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డిని నిలదీసిన గ్రామస్థులు
కర్నూలు జిల్లా కౌతాళం మండలం అగసలదిన్నెలో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. -
పెద్దిరెడ్డి ప్రమేయంతో వైకాపా గూండాల దాడి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షగట్టి తన ఇంటిపై దాడికి వైకాపా గూండాలను పురికొల్పారని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన పూర్వ జడ్జి ఎస్.రామకృష్ణ ఆరోపించారు. -
7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ
ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. -
తొడకొట్టి.. జోగి తనయుడి వీరంగం
మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడి రాజకీయాలు ప్రశాంతతకు నిలయమైన కృష్ణా జిల్లా పెనమలూరును దౌర్జన్యాలు, దాడులకు కేంద్రంగా మారుస్తున్నారు. -
ఆ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులెవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించం
రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు ఏయే లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయో ఆయా లోక్సభ స్థానాలకు పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థులకుగానీ, స్వతంత్ర అభ్యర్థులకుగానీ ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించదు. -
వైకాపాలో బానిసత్వం సహించలేక జనసేనలోకి వచ్చా: అంబటి రాయుడు
వైకాపాలో బానిసత్వం సహించలేక జనసేనలోకి వచ్చినట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చెప్పారు. కృష్ణా జిల్లాలో జనసేన మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులు.. వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ల తరఫున ఎన్నికల ప్రచారం కోసం రాయుడు బుధవారం అవనిగడ్డ వచ్చారు. -
తెదేపా-జనసేన మ్యానిఫెస్టో.. జనహితమే ఎజెండా
ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని గాడిన పెట్టేలా.. అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ, సమాజంలో అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యమిస్తూ తెదేపా, జనసేన విడుదల చేసిన ఉమ్మడి మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. -
ఉద్యోగుల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నమాట నిజమే
సీఎం జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమేనని, కొన్ని రాజకీయ పార్టీలు వారిని పక్కదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు ఎన్.చంద్రశేఖర్రెడ్డి వ్యాఖ్యానించారు. -
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పలువురి నియామకం
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కేఈ ప్రభాకర్, ఏరాసు ప్రతాప్రెడ్డి, ఆర్.జితేంద్రగౌడ్, వీఎస్ అమీర్బాబు, ఎం.వెంకటేశ్వరరావు, చీరాల గోవర్ధన్రెడ్డిలను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బుధవారం వెల్లడించారు.
తాజా వార్తలు
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి