ఇంటింటికీ నీరు ఇవ్వలేకపోవడం దారుణం
కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చినా.. పట్టణంలో ఇంటింటికీ కుళాయి నీరు ఇవ్వలేక పోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికులతో మాట్లాడుతున్న నాదెండ్ల
తెనాలి టౌన్: కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చినా.. పట్టణంలో ఇంటింటికీ కుళాయి నీరు ఇవ్వలేక పోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని 33, 34 వార్డుల్లో శనివారం సాయంత్రం ఆయన పర్యటించారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజవర్గంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేస్తామని మనోహర్ హామీ ఇచ్చారు. వార్డుల్లో పలు చోట్ల ఆయనకు ఘన స్వాగతం లభించింది. పలువురు వైకాపా నాయకులు ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
కొల్లిపర: జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు ఆళ్ల వీరారెడ్డి అన్నారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు శనివారం మున్నంగిలో పర్యటించారు.
కొల్లిపర: అభివృద్ధి సంక్షేమం కోసం తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను గెలిపించుకుందామని జనసేన నాయకురాలు రాయపాటి అరుణ అన్నారు. శనివారం కొల్లిపర, గుదిబండివారిపాలెం, తూములూరు, చింతపాలెం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
‘జనసేన నాయకులపై కేసులు పెట్టించిన అంబటి’
పొన్నూరు: సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిన ఘనత పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణకే దక్కుతుందని కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. మండల పరిధి చింతలపూడిలోని ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొన్నూరులో రాజకీయ మహానటుడు వైకాపా అభ్యర్థిని, అయనకు అస్కార్ కంటే మించిన అవార్డు అందిచవచ్చని వెల్లడించారు. ప్రజా సేవ ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చానని చెబుతున్న ఆయన 2019లో సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు తరఫున డమ్మీ నామినేషన్లు వేసిన మాట వాస్తవం కదా అని ప్రశ్నించారు. మురళీకృష్ణ అవినీతి చరిత్రను వాస్తవాలతో ప్రజలు ముందు త్వరలో ఉంచుతామని ప్రకటించారు.
తెదేపాలో చేరిక: పొన్నూరు : మండలంలోని పచ్చల తాటిపర్రుకి చెందిన వైకాపా నాయకుడు హరీ రామకృష్ణ తెదేపాలో చేరారు. ఈ మేరకు చింతలపూడిలోని ఎన్డీయే కూటమి పొన్నూరు అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచారానికి తెర
[ 12-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో మొదలైన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా వైకాపా ఒక్కటే బరిలోకి దిగగా కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. -
మేరునగ ధీరుడా..
[ 12-05-2024]
నాయకుడు సమర్థుడైతే ఆ సమాజం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. భావితరాల భవిష్యత్తుకు బాటలు పడతాయి. శాంతిభద్రతలు విలసిల్లి సమాజం భద్రతతో కూడిన జీవనానికి మార్గం సుగమం అవుతుంది. భవిష్యత్తుపై భరోసాతో సమాజం అడుగులు వేస్తుంది. -
ప్రతి ఒక్కరూ ఓటేయాలి... ప్రజాస్వామ్యం గెలవాలి
[ 12-05-2024]
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 13వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. సాయంత్రం 6గంటలకు వరుసలో నిలుచున్న వారందరూ ఓటేసే వెసులుబాటు ఉంది. దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
కసితో కదిలొచ్చారు!
[ 12-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లింది. అభివృద్ధి పడకేసింది. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరవయ్యాయనే ఆవేదన, ఆందోళన సగటు ఓటరులో నెలకొంది. -
ఒక్క అవకాశం.. ఐదేళ్ల విధ్వంసం
[ 12-05-2024]
రైతన్నల కష్టం కనని జగన్ యువతులపై అరాచకాలు ఆపలేని జగన్ యువత మత్తుకు బానిసలైనా వెరవని నీ పాలన చాలిక.. కక్షతో పరిశ్రమలను వెళ్లగొట్టిన జగన్ ..ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని చంపిన జగన్ కార్మికులకు పని కల్పించలేని నీ పాలన చాలిక.. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి భద్రతా చర్యలు
[ 12-05-2024]
పోలింగ్ బందోబస్తుకు సీఐఎస్ఎఫ్, సీఆర్పిఎఫ్తోపాటు తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన బలగాలు గుంటూరు చేరుకున్నాయి. వారితో శనివారం ఎస్పీ తుషార్ దూడి పోలీసు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. -
వైకాపా నాయకులకు చుక్కెదురు
[ 12-05-2024]
మీరు నగదు పంపిణీ చేశారు..మా ఓట్లను మీ పార్టీకి వేయాలని అభ్యర్థించాలి గాని.. .గద్దిస్తారేమిటని ఒక మహిళ డబ్బులు పంచడానికి వచ్చిన అధికార వైకాపా నాయకులను ప్రశ్నించింది. -
పల్నాడుపై ప్రత్యర్థుల పడగ నీడ!
[ 12-05-2024]
పల్నాడును వర్గాల పేరుతో అనాగరికం ఏలుతోంది! రక్షించాల్సిన నాలుగో సింహం నీలిగంతలు కట్టుకుంది బాధితులపైనే నిందలు వేసి వేధిస్తుంటే.. పచ్చని పల్లెలు ఖాళీ అవుతున్నాయి పక్కింటివారే ప్రత్యర్థులై పళ్లుకొరుకుతుంటే.. -
మా ఇంటిలో ఓట్లు అమ్మబడవు
[ 12-05-2024]
ఓట్లు కొనుగోలు చేయడానికి అభ్యర్థులు పోటీపడుతున్న నేపథ్యంలో గుంటూరులో ఓ ఇంటి వద్ద మా ఇంటిలోని ఓట్లు అమ్మబడవు అని ఏర్పాటు చేసిన బోర్డులు అందరినీ ఆకట్టుకున్నాయి. -
మాధవిపై అసత్య ప్రచారం.. కేసు నమోదు
[ 12-05-2024]
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. -
భవనం కట్టుకుంటే.. కుప్పం చెల్లించాల్సిందే!
[ 12-05-2024]
పాలకవర్గంలో ఓ ముఖ్య నాయకుడు పశ్చిమలో వాణిజ్య ప్రాంతాల్లో జరుగుతున్న పలు భవన నిర్మాణాలు, కట్టడాల వద్దకు తన మనుషులను పంపి దందాలు, అక్రమ వసూళ్లు చేసిన ఘటనలు ఉన్నాయి. -
కసితో కదిలొచ్చారు!
[ 12-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లింది. అభివృద్ధి పడకేసింది. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయనే ఆవేదన, ఆందోళన సగటు ఓటరులో నెలకొంది. -
ప్రచారానికి తెర.. ప్రలోభాల వల
[ 12-05-2024]
ఎన్నికల సంఘం మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో మొదలైన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. మరోవైపు రాజకీయ పార్టీ నాయకులు ప్రలోభాల పర్వం మొదలుపెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
-
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
-
అతివలు మెచ్చేలా.. అందరూ వచ్చేలా: మహిళా మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు
-
జగన్ సభలకేనా బస్సులు.. ఓటేసే వారికి ఉండవా!
-
ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఎందుకు మార్చాల్సి వచ్చింది?
-
ఓటరు స్లిప్పు అందలేదా?.. ఇలా చేయండి