సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకి కనిపిస్తున్న ఇనుప చువ్వలు.. వంతెనలపైనే గోతులు.. ఇవీ సామాన్యుడు వెళ్లే వారధులు.. జగనన్న సంక్షేమ రాజ్యంలో ప్రగతిదారులు.. అదే సీఎం సారు బయటకు అడుగేస్తే వాటి రూపురేఖలే మారిపోతాయి.. ఆయన అడుగుపెట్టేచోట ముందురోజే తళతళలాడే తారు రోడ్డు వేయాల్సిందే.
శిథిల వంతెనల మరమ్మతులకు నిధులివ్వరు
అధ్వాన స్థితిలో వాహనదారుల రాకపోకలు
ఈనాడు, అమరావతి న్యూస్టుడే, దుగ్గిరాల, పొన్నూరు: బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకి కనిపిస్తున్న ఇనుప చువ్వలు.. వంతెనలపైనే గోతులు.. ఇవీ సామాన్యుడు వెళ్లే వారధులు.. జగనన్న సంక్షేమ రాజ్యంలో ప్రగతిదారులు.. అదే సీఎం సారు బయటకు అడుగేస్తే వాటి రూపురేఖలే మారిపోతాయి.. ఆయన అడుగుపెట్టేచోట ముందురోజే తళతళలాడే తారు రోడ్డు వేయాల్సిందే. శిథిల వంతెనలకూ మరమ్మతులు చేయాల్సిందే. రూ.కోట్లు ఖర్చయినా సీఎంకు అసౌకర్యం కలగకూడదంతే. జగన్ మార్క్ పాలన అంటే ఇదే.
ప్రమాదకరస్థితిలో వంతెనలు
ఉమ్మడి గుంటూరులో చాలాచోట్ల వంతెనలు, కల్వర్టులు, చప్టాలు శిథిలావస్థకు చేరుకుని పాడైపోవడంతో వాహనచోదకులు రాకపోకలు సాగించడానికి భయాందోళనలు చెందుతున్నారు. వాటి నిర్వహణ, మరమ్మతులకూ నిధులు కరవయ్యాయి. వంతెనల జీవితకాలం ముగిసినా వాటిస్థానంలో కొత్తవి నిర్మించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. కొన్ని పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో భారీవాహనాల రాకపోకలను నియంత్రించారు. భారీ వాహనాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుండడంతో సమయం, ఇంధనం వృథా అవుతోంది.
సీఎం జగన్ తాడేపల్లిలో తన నివాసం నుంచి పశువులాస్పత్రి మీదుగా వెళ్లి మైదానంలో ఉన్న హెలీకాప్టర్ ఎక్కాల్సి ఉంది. సీఎం ప్రయాణించే దారిలో వంతెన బాలేదని రూ.1.8కోట్లు వెచ్చించి ఆగమేఘాల మీద మరమ్మతులు చేపట్టారు.
ఎక్కడెక్కడ ఎలా...
- గుంటూరు నగరంలో పాత, కొత్త నగరాలను కలిపే కీలకమైన శంకర్విలాస్వంతెన శిథిలావస్థకు చేరింది. పదేళ్ల నుంచి నూతన వారథి నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఆర్అండ్బీ, రైల్వే, నగరపాలక సంస్థల మధ్య సమన్వయంతో చేపట్టాల్సిన పనులు ఒక అడుగు ముందుకు మూడుడగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ఉదయం, సాయంత్రం వేళ్లలో వంతెనపై విపరీతమైన రద్దీతో ఇరుకు మార్గంలో రాకపోకలకు ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఏదైనా కారణాల వల్ల వంతెనపై వాహనం ఆగిపోతే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అరగంటకుపైగా సమయం పడుతోంది.
- గుంటూరు నుంచి నందివెలుగు వెళ్లే మార్గంలో హాఫ్పేట వద్ద వంతెన పాడై పోగా మరమ్మతులతో సరిపెట్టారు. అటుఇటూ రెయిలింగ్ దెబ్బతిని ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. వంతెనకు కొన్నిచోట్ల పగుళ్లు సైతం వచ్చాయి.
20 కి.మీ.లు చుట్టూ తిరగాల్సిందే..
- ప్రత్తిపాడు నుంచి చినకొండ్రుపాడు మీదుగా జాతీయరహదారికి వెళ్లే మార్గంలో లోలెవల్ చప్టా కుంగిపోయి మధ్యలో పెద్ద గొయ్యి పడింది. దీంతో భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. సుమారు 20 కిలోమీటర్లు అదనంగా తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది.
- దుగ్గిరాల వద్ద కృష్ణా పశ్చిమడెల్టా ప్రధాన కాలువపై పాదచారులు, ద్విచక్రవాహనదారులు వెళ్లడానికి ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. ఇరువైపులా కమ్మీలు పూర్తిగా పోయాయి. గతంలో ఇక్కడ పోలీసులు కర్రలు కట్టి వంతెన ప్రమాదకరంగా ఉందని హెచ్చరిక బోర్డు సైతం పెట్టారు. ఇదే కాలువ మీద రేవేంద్రపాడు వద్ద వంతెన అడుగుభాగం ఇనుప చువ్వలు బయటపడి, పిట్ట గోడ పడిపోయింది. వద్దని చెప్పినా ఈ వంతెనపై విద్యాసంస్థల బస్సులు, అధికలోడ్తో ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఇదీ గుంటూరు- బాపట్ల ప్రధాన రహదారి. చేబ్రోలు సమీపంలో కొమ్మమూరు సాగు నీటి కాలువపై సూమారు 110 ఏళ్ల కిందట ఈ వంతెన నిర్మించారు. 2018లో వంతెన ఒకవైపు కుంగిపోయింది. రోడ్లు భవనాలశాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. నూతన వంతెన నిర్మాణ పనులకు అప్పటి తెదేపా ప్రభుత్వం రూ.32కోట్లు మంజూరు చేసింది. ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభించలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. వంతెన నిర్మాణ పనులు చేపడతానని ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య 2019 ఎన్నికల ముందు ప్రకటించారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే వంతెన నిర్మాణ పనులకు హడావుడిగా శంకుస్థాపన చేయడం గమనార్హం.
ఇదీ దుగ్గిరాల మండలం శృంగారపురం వద్ద రేపల్లె కాల్వపై 1980లో నిర్మించిన వంతెన. వంతెన అడుగుభాగం దెబ్బతింది. గోడ ఒకవైపు ఒరిగిపోతోంది. పెదపాలెం, శృంగారపురం, రేవేంద్రపాడు, చినపాలెం, నూతక్కి తదితర గ్రామాల రైతులు, ప్రజలు దీన్ని ఉపయోగిస్తారు. నిత్యం వందల మంది ప్రయాణం చేస్తారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని తీసుకెళ్తారు. కార్లు, ట్రాక్టర్లు, లారీలు సైతం వెళ్తుంటాయి. వంతెనకు దాదాపు 150 మీటర్ల దిగువన రేపల్లె కాల్వ ప్రవహిస్తోంది.
ఇదీ దుగ్గిరాల మండలం గొడవర్రు కాలి వంతెన. గొడవర్రుతో పాటు కొల్లిపర మండలం అత్తలూరివారిపాలెం రైతులు ఉపయోగిస్తారు. కాల్వ అవతల సాగయ్యే 1000 ఎకరాల పొలాల రైతులు, ఆ చేలల్లో పనిచేసే రైతు కూలీలు నిత్యం దీన్ని వినియోగిస్తారు. రెండు వైపులా గోడలు విరిగాయి. పలుచోట్ల పగుళ్లు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచారానికి తెర
[ 12-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో మొదలైన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా వైకాపా ఒక్కటే బరిలోకి దిగగా కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. -
మేరునగ ధీరుడా..
[ 12-05-2024]
నాయకుడు సమర్థుడైతే ఆ సమాజం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. భావితరాల భవిష్యత్తుకు బాటలు పడతాయి. శాంతిభద్రతలు విలసిల్లి సమాజం భద్రతతో కూడిన జీవనానికి మార్గం సుగమం అవుతుంది. భవిష్యత్తుపై భరోసాతో సమాజం అడుగులు వేస్తుంది. -
ప్రతి ఒక్కరూ ఓటేయాలి... ప్రజాస్వామ్యం గెలవాలి
[ 12-05-2024]
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 13వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. సాయంత్రం 6గంటలకు వరుసలో నిలుచున్న వారందరూ ఓటేసే వెసులుబాటు ఉంది. దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
కసితో కదిలొచ్చారు!
[ 12-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లింది. అభివృద్ధి పడకేసింది. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరవయ్యాయనే ఆవేదన, ఆందోళన సగటు ఓటరులో నెలకొంది. -
ఒక్క అవకాశం.. ఐదేళ్ల విధ్వంసం
[ 12-05-2024]
రైతన్నల కష్టం కనని జగన్ యువతులపై అరాచకాలు ఆపలేని జగన్ యువత మత్తుకు బానిసలైనా వెరవని నీ పాలన చాలిక.. కక్షతో పరిశ్రమలను వెళ్లగొట్టిన జగన్ ..ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని చంపిన జగన్ కార్మికులకు పని కల్పించలేని నీ పాలన చాలిక.. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి భద్రతా చర్యలు
[ 12-05-2024]
పోలింగ్ బందోబస్తుకు సీఐఎస్ఎఫ్, సీఆర్పిఎఫ్తోపాటు తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన బలగాలు గుంటూరు చేరుకున్నాయి. వారితో శనివారం ఎస్పీ తుషార్ దూడి పోలీసు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. -
వైకాపా నాయకులకు చుక్కెదురు
[ 12-05-2024]
మీరు నగదు పంపిణీ చేశారు..మా ఓట్లను మీ పార్టీకి వేయాలని అభ్యర్థించాలి గాని.. .గద్దిస్తారేమిటని ఒక మహిళ డబ్బులు పంచడానికి వచ్చిన అధికార వైకాపా నాయకులను ప్రశ్నించింది. -
పల్నాడుపై ప్రత్యర్థుల పడగ నీడ!
[ 12-05-2024]
పల్నాడును వర్గాల పేరుతో అనాగరికం ఏలుతోంది! రక్షించాల్సిన నాలుగో సింహం నీలిగంతలు కట్టుకుంది బాధితులపైనే నిందలు వేసి వేధిస్తుంటే.. పచ్చని పల్లెలు ఖాళీ అవుతున్నాయి పక్కింటివారే ప్రత్యర్థులై పళ్లుకొరుకుతుంటే.. -
మా ఇంటిలో ఓట్లు అమ్మబడవు
[ 12-05-2024]
ఓట్లు కొనుగోలు చేయడానికి అభ్యర్థులు పోటీపడుతున్న నేపథ్యంలో గుంటూరులో ఓ ఇంటి వద్ద మా ఇంటిలోని ఓట్లు అమ్మబడవు అని ఏర్పాటు చేసిన బోర్డులు అందరినీ ఆకట్టుకున్నాయి. -
మాధవిపై అసత్య ప్రచారం.. కేసు నమోదు
[ 12-05-2024]
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. -
భవనం కట్టుకుంటే.. కుప్పం చెల్లించాల్సిందే!
[ 12-05-2024]
పాలకవర్గంలో ఓ ముఖ్య నాయకుడు పశ్చిమలో వాణిజ్య ప్రాంతాల్లో జరుగుతున్న పలు భవన నిర్మాణాలు, కట్టడాల వద్దకు తన మనుషులను పంపి దందాలు, అక్రమ వసూళ్లు చేసిన ఘటనలు ఉన్నాయి. -
కసితో కదిలొచ్చారు!
[ 12-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లింది. అభివృద్ధి పడకేసింది. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయనే ఆవేదన, ఆందోళన సగటు ఓటరులో నెలకొంది. -
ప్రచారానికి తెర.. ప్రలోభాల వల
[ 12-05-2024]
ఎన్నికల సంఘం మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో మొదలైన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. మరోవైపు రాజకీయ పార్టీ నాయకులు ప్రలోభాల పర్వం మొదలుపెట్టారు.