వైద్యుల ఇష్టారాజ్యం.. పేదలకు సేవలు దూరం
ఆసుపత్రులను అన్ని విధాలుగా మెరుగు పరిచి రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తామని ఓ పక్క రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చెబుతుండగా పరిగిలో మాత్రం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి.
పరిగి సామాజిక ఆసుపత్రిలో అంతర్గత విభేదాలు
న్యూస్టుడే, పరిగి
ఆసుపత్రులను అన్ని విధాలుగా మెరుగు పరిచి రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తామని ఓ పక్క రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చెబుతుండగా పరిగిలో మాత్రం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్గత విభేదాలతో వైద్యులు విధులకు హాజరు కాక రోగులు అవస్థలు పడుతున్నారు. వరుస ఘటనలతో పరిగి ప్రాంత ప్రజలు సామాజిక ఆసుపత్రికి వెళ్లేందుకు వెనకడుగు వేయాల్సి వస్తోంది.
ఈ ఆసుపత్రి ఒక్కటే దిక్కు
పరిగి మండలంతో పాటు పూడూరు, దోమ, కుల్కచర్ల మండలాల ప్రజలకు సామాజిక ఆసుపత్రి ఏకైక దిక్కు. ఆయా మండలాల్లో 2.65 లక్షల జనాభా నివసిస్తోంది. వైద్యుల్లో నెలకొన్న అంతర్గత విభేదాలు వైద్య సేవలకు తీరని అవరోధంగా మారుతున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. స్థానికంగా నలుగురు వైద్యులు పనిచేస్తున్నారు. ఆదివారం రావాల్సిన ఓ వైద్యుడు విధులకు హాజరు కాలేదు. అప్పటివరకు పనిచేస్తున్న మరో వైద్యురాలు వెళ్లిపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఉసూరుమంటూ వెనుదిరుగాల్సిన దుస్థితి నెలకొంది. విషయం జిల్లా వైద్యాధికారి తుకారంభట్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే మీద శ్రీకాంత్ అనే వైద్యుడిని పరిగికి పంపాల్సి వచ్చింది.
రూ.3.5కోట్లతో ఆధునిక భవనం
పేదల సౌకర్యార్థం ప్రభుత్వం రూ.3.5కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక భవనాన్ని నిర్మించింది. ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేసింది. అంతేగాకుండా రెండు నెలల క్రితం దీనిని వైద్య విధాన పరిషత్లోకి మార్చింది. ఇటీవలే ఎమ్మెల్యే మహేష్రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రక్తశుద్ధి కేంద్రాన్ని తీసుకువచ్చారు. ఓవైపు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుండగా వైద్యుల లొల్లి పేదల ప్రాణాల మీదకు వస్తోంది. వైద్యుల్లో నెలకొన్న అంతర్గత విభేదాలు పలుమార్లు బట్టబయలయ్యాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో అనాథ ఆసుపత్రిగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది పనితీరు కూడా ఇదే విధంగా మారిందన్నారు.
ఆరు నెలలుగా తిరగడం మానేశాయి
ఆసుపత్రికి అంబులెన్సు వాహనాలు ఉన్నా అవి ఆరు నెలలుగా పనిచేయడం లేదు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యా యత్నాలు, ప్రసవాల సమయంలో కళ్లముందు ప్రాణాలు పోతున్నా సకాలంలో స్పందించి ఘటనా స్థలానికి చేరడంలేదు. ఆసుపత్రికి వచ్చే నిధులు మాత్రం ఎప్పటికప్పుడు ఖర్చవుతున్నాయి. ఇవనీ ఎటుపోతున్నాయో ఎవరికీ తెలియదు. అత్యవసరమైతే విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ అంబులెన్సు నిర్వాహకులు అడిగినంత ఇచ్చి వారి వాహనాల్లో ఉస్మానియా ఇతరత్రా ఆసుపత్రులకు తరలించాల్సి వస్తోంది.
* వారం రోజుల క్రితం దోమ పోలీసు స్టేషన్ పరిధిలోని బాసుపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అప్పటికప్పుడే ప్రాణాలు కోల్పోగా మరో యువకుని కాలు విరిగింది. ఇంకో యువకుని తల పగిలిగాయమైంది. వెంటనే పరిగి సామాజిక ఆసుపత్రికి తరలించారు. అంబులెన్సు కోసం వారు వైద్యులను బతిమాలినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ప్రైవేట్ వాహనాల్లో తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. క్షతగాత్రులు మొత్తుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారనే విమర్శలున్నాయి.
శాఖాపరమైన చర్యలు చేపడతాం
- తుకారం భట్, జిల్లా వైద్యాధికారి
పరిగి ఆసుపత్రిపై వరుస ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ఎవరి విధులు వాళ్లు నిర్వహించాల్సిందే. ఒకరే నిరంతరంగా విధులు నిర్వహించడం అన్నది కూడా సరికాదు. ఆసుపత్రి పనితీరును మెరుగు పరిచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఆదివారం చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమో నినాదం.. కమల వికాసం
[ 11-05-2024]
వికసిత కమలాలతో.. కాషాయ రెపరెపలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కళకళలాడాయి. మైదానమంతా మోదీ నినాదమే మార్మోగింది. -
అడుగడుగునా హారతులు.. అభివృద్ధికి వరాలు
[ 11-05-2024]
అడుగడుగునా హారతులు.. బతుకమ్మ ఆటలు.. శ్రేణుల నినాదాలు.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. -
భద్రత మాది.. బాధ్యత మీది
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100 శాతం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. -
సికింద్రాబాద్ ఓటర్లు అభివృద్ధి చూశారు
[ 11-05-2024]
‘రాష్ట్ర రాజధానిలో సగం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నేను చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. జాతీయ హోదాకు పోరాడతా
[ 11-05-2024]
‘చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓవైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవడంతోపాటు మరోవైపు వెనకబడిన ప్రాంతాల సమాహారంగా విస్తరించి ఉంది. -
ప్రలోభాలకు ఎర.. పంపకాల జాతర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో రాజధాని పరిధిలో ప్రలోభాలకు తెర లేచింది. -
కమలం గుర్తుంచుకోండి
[ 11-05-2024]
శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రోడ్షో నిర్వహించారు. -
తెలంగాణ గుండెచప్పుడు.. ప్రతిధ్వనించింది
[ 11-05-2024]
ఇప్పటి వరకు లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) చారిత్రక విజయం నమోదు చేసుకుంది. -
భాజపా శ్రేణుల్లో నయా జోష్
[ 11-05-2024]
సార్వత్రిక ప్రచారం తుది దశలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అధోగతి: సబిత
[ 11-05-2024]
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. -
చేవెళ్ల సీటు సోనియాకు కానుకగా ఇస్తాం: టీఆర్ఆర్
[ 11-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ సీటును గెలిపించుకుని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కో ఇంఛార్జి డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. -
ప్రచార పర్వం.. నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
దాదాపు నెల రోజులుగా హోరెత్తించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెర పడుతోంది. -
సొంతవారికే పంపకాల అప్పగింతలు
[ 11-05-2024]
ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. -
ప్రయాణం మానుకోండి.. ప్రతిఫలం పొందండి
[ 11-05-2024]
ఏపీ నుంచి వచ్చి శేరిలింగంపల్లిలో ఉంటున్న కొందరు ఓటర్లు సొంతూరుకు ప్రయాణమయ్యారు. -
గత స్మృతులను గుర్తు చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తూ
[ 11-05-2024]
ఆరు నెలల క్రితం చిన్నారి పాడిన పద్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రముఖుల రాకపోకలతో బేగంపేట విమానాశ్రయంలో సందడి
[ 11-05-2024]
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నగరానికి ప్రముఖుల రాకపోకలతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయం సందడిగా మారింది. -
ఎన్నికల రోజున డ్రోన్లతో నిఘా
[ 11-05-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ తెలిపారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
[ 11-05-2024]
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
చీటీ వచ్చిందా.. ఏ బ్రాండు కావాలో ఇచ్చెయ్
[ 11-05-2024]
ఓటర్లకు మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం దృష్టి మళ్లించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. -
దుర్గంచెరువు పూడ్చివేతపై ఫిర్యాదు
[ 11-05-2024]
మాదాపూర్లోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను ఫూడ్చివేసిన ప్రాంత్రాన్ని శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. -
జనం డబ్బుతో సినిమా నిర్మాణం
[ 11-05-2024]
చిట్టీల వ్యాపారంతో ప్రజల వద్ద రూ.కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ సొమ్ముతో ఓ సినిమాను నిర్మించారు. -
గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
[ 11-05-2024]
కేపీహెచ్బీ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం మహిళ మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిందితుడని గుర్తించిన పోలీసులు.. -
ఈత కొలనులో మునిగి అయిదేళ్ల చిన్నారి దుర్మరణం
[ 11-05-2024]
వేసవి శిబిరం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!