కొత్త పంథా.. సైబర్ పంజా!
సైబర్ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలు, నకిలీ వెబ్సైట్లు, కాల్సెంటర్లు, క్యూఆర్కోడ్స్.. అన్ని మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు.
గ్రేటర్లో నెలరోజుల్లోనే 500కు పైగా కేసులు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
ఈనాడు, హైదరాబాద్
సైబర్ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలు, నకిలీ వెబ్సైట్లు, కాల్సెంటర్లు, క్యూఆర్కోడ్స్.. అన్ని మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో జనవరిలో 500కుపైగా సైబర్ కేసులు నమోదయ్యాయి. 2023తో నేరస్థులు ట్రెండ్ మార్చారు. యువతీ, యువకులే లక్ష్యంగా కొత్త పంథాలో పంజా విసురుతున్నారు. గాజులరామారానికి చెందిన ఐటీ నిపుణురాలి (26)కి పశ్చిమగోదావరి జిల్లా యువకుడినంటూ ఆన్లైన్ వివాహ పరిచయ వేదికలో పరిచయమయ్యాడు. వాట్సాప్ ద్వారా ఇద్దరూ వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరయ్యారు. తన బ్యాంకు ఖాతాలు నిలిపివేశారంటూ ఆ యువతి నుంచి దఫాల వారీగా రూ.34 లక్షలు కొట్టేశాడు. ఆర్టీసీ కాలనీ యువతి (25)కి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మిత్రుడు.. కొన్నాళ్ల తరువాత లండన్ నుంచి బహుమతి పంపినట్లు యువతి వాట్సాప్కు సమాచారమిచ్చాడు. ముంబయి కస్టమ్స్ కార్యాలయానికి చేరిన బహుమతిని తీసుకొనేందుకు పన్నులు చెల్లించాలంటూ రూ.1.24 లక్షలు కాజేశారు. మల్లేపల్లికి చెందిన యువతి(24)కి వాట్సాప్ ద్వారా శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సెక్యూరిటీ డిపాజిట్గా రూ.లక్ష తీసుకొని ముఖం చాటేశారు. క్రిప్టో కరెన్సీలో లాభాలు వస్తాయంటూ మాదాపూర్లోని ఐటీ నిపుణుడికి రూ.28 లక్షలు టోకరా వేశారు.
ఇక్కడా.. పాన్ఇండియా
సైబర్ నేరస్థులు పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. అన్ని భాషల్లోనూ కాల్సెంటర్లు, టెలీకాలర్స్ను ఏర్పాటు చేసుకొని హరియాణా, దిల్లీ, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాల్లో గ్రామాల నుంచి చక్రం తిప్పుతున్నారు. దిల్లీలో నకిలీ కాల్సెంటర్పై దాడి చేస్తే ఓ అపార్ట్మెంట్లో తెలుగు, తమిళం, మళయాళం, ఒడియా, హిందీ, ఇంగ్లిషు మాట్లాడేందుకు వేర్వేరుగా టెలీకాలర్స్ను నియమించినట్లు నగర సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ డాక్టర్ గజరావు భూపాల్ తెలిపారు. మోసాల బారిన పడుతున్న వారిలో విద్యావంతులు, ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
అత్యాశతో కష్టార్జితం నష్టపోవద్దు
డాక్టర్ గజరావు భూపాల్, జాయింట్ పోలీసు కమిషనర్, నగర సీసీఎస్
బ్యాక్డోర్ ఉద్యోగాలు, కొద్దిపెట్టుబడితో అధికరాబడి వస్తుందని చెప్పగానే నమ్మేయవద్దు. సాధ్యాసాధ్యాలను గుర్తించాలి. అవతలి వారు చెబుతున్న మాటలో నిజమెంత అనేది విచక్షణతో ఆలోచించాలి. ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపించగానే అనుసరించకుండా కొంత సమయం వాటిపై స్టడీ చేయాలి. నిజానిజాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. అత్యాశ ఉన్నంత వరకూ మోసాలు జరుగుతూనే ఉంటాయి. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించగానే పోలీసులకు ఫిర్యాదు చేయండి. 1930 సేవలను ఉపయోగించుకోండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rupert Murdoch: 92ఏళ్ల వయసులో ‘ఐదో’ పెళ్లి..! ఇదే చివరిదన్న బిలియనీర్
-
Sports News
MS Dhoni: ఐపీఎల్.. ధోనీకి మరో 3-4 ఏళ్లు ఆడే సత్తా ఉంది: షేన్ వాట్సన్
-
Politics News
Tejashwi Yadav: మాకు సీఎం..పీఎం కోరికల్లేవు: తేజస్వీ యాదవ్
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
India News
Happiest Countries: వరుసగా ఆరోసారి ఫిన్లాండ్.. ఉక్రెయిన్, రష్యా కంటే వెనుకంజలో భారత్!