కొత్త పంథా.. సైబర్ పంజా!
సైబర్ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలు, నకిలీ వెబ్సైట్లు, కాల్సెంటర్లు, క్యూఆర్కోడ్స్.. అన్ని మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు.
గ్రేటర్లో నెలరోజుల్లోనే 500కు పైగా కేసులు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
ఈనాడు, హైదరాబాద్
సైబర్ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలు, నకిలీ వెబ్సైట్లు, కాల్సెంటర్లు, క్యూఆర్కోడ్స్.. అన్ని మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో జనవరిలో 500కుపైగా సైబర్ కేసులు నమోదయ్యాయి. 2023తో నేరస్థులు ట్రెండ్ మార్చారు. యువతీ, యువకులే లక్ష్యంగా కొత్త పంథాలో పంజా విసురుతున్నారు. గాజులరామారానికి చెందిన ఐటీ నిపుణురాలి (26)కి పశ్చిమగోదావరి జిల్లా యువకుడినంటూ ఆన్లైన్ వివాహ పరిచయ వేదికలో పరిచయమయ్యాడు. వాట్సాప్ ద్వారా ఇద్దరూ వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరయ్యారు. తన బ్యాంకు ఖాతాలు నిలిపివేశారంటూ ఆ యువతి నుంచి దఫాల వారీగా రూ.34 లక్షలు కొట్టేశాడు. ఆర్టీసీ కాలనీ యువతి (25)కి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మిత్రుడు.. కొన్నాళ్ల తరువాత లండన్ నుంచి బహుమతి పంపినట్లు యువతి వాట్సాప్కు సమాచారమిచ్చాడు. ముంబయి కస్టమ్స్ కార్యాలయానికి చేరిన బహుమతిని తీసుకొనేందుకు పన్నులు చెల్లించాలంటూ రూ.1.24 లక్షలు కాజేశారు. మల్లేపల్లికి చెందిన యువతి(24)కి వాట్సాప్ ద్వారా శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సెక్యూరిటీ డిపాజిట్గా రూ.లక్ష తీసుకొని ముఖం చాటేశారు. క్రిప్టో కరెన్సీలో లాభాలు వస్తాయంటూ మాదాపూర్లోని ఐటీ నిపుణుడికి రూ.28 లక్షలు టోకరా వేశారు.
ఇక్కడా.. పాన్ఇండియా
సైబర్ నేరస్థులు పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. అన్ని భాషల్లోనూ కాల్సెంటర్లు, టెలీకాలర్స్ను ఏర్పాటు చేసుకొని హరియాణా, దిల్లీ, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాల్లో గ్రామాల నుంచి చక్రం తిప్పుతున్నారు. దిల్లీలో నకిలీ కాల్సెంటర్పై దాడి చేస్తే ఓ అపార్ట్మెంట్లో తెలుగు, తమిళం, మళయాళం, ఒడియా, హిందీ, ఇంగ్లిషు మాట్లాడేందుకు వేర్వేరుగా టెలీకాలర్స్ను నియమించినట్లు నగర సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ డాక్టర్ గజరావు భూపాల్ తెలిపారు. మోసాల బారిన పడుతున్న వారిలో విద్యావంతులు, ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
అత్యాశతో కష్టార్జితం నష్టపోవద్దు
డాక్టర్ గజరావు భూపాల్, జాయింట్ పోలీసు కమిషనర్, నగర సీసీఎస్
బ్యాక్డోర్ ఉద్యోగాలు, కొద్దిపెట్టుబడితో అధికరాబడి వస్తుందని చెప్పగానే నమ్మేయవద్దు. సాధ్యాసాధ్యాలను గుర్తించాలి. అవతలి వారు చెబుతున్న మాటలో నిజమెంత అనేది విచక్షణతో ఆలోచించాలి. ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపించగానే అనుసరించకుండా కొంత సమయం వాటిపై స్టడీ చేయాలి. నిజానిజాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. అత్యాశ ఉన్నంత వరకూ మోసాలు జరుగుతూనే ఉంటాయి. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించగానే పోలీసులకు ఫిర్యాదు చేయండి. 1930 సేవలను ఉపయోగించుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారి ఓటును వారికి వేసుకోలేరు
[ 02-05-2024]
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంటుంది. ఇది చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎంఐఎం నుంచి ఎవరూ నిలబడటం లేదు. -
కొత్త ఓటరు కార్డులు లేనట్టేనా ?
[ 02-05-2024]
కొత్త ఓటర్లకు ఈసారి గుర్తింపు కార్డులు లేనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్కు మిగిలింది పది రోజులే. అయినా ఎన్నికల సంఘం ఇంకా ముద్రణ ప్రారంభించలేదనే విమర్శలొస్తున్నాయి. -
రూ.2.95 కోట్ల నగదు స్వాధీనం
[ 02-05-2024]
సరైన పత్రాల్లేకుండా బ్యాంకులకు తరలిస్తున్న రూ.1.06 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. -
అక్కడ.. పోలింగ్ సిబ్బంది అందరూ మహిళలే
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలకు నగరవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం మహిళా సిబ్బందిని నియమించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. -
ఐదొందలిస్తే అదనపు సేవ
[ 02-05-2024]
వైద్యులు ధ్రువీకరించినా.. రూ.500 ఇస్తేనే మీకు పిల్లలు పుట్టినట్టు ధ్రువీకరణ ఇస్తామంటూ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. కొన్ని మీసేవ కేంద్రాలు, కొందరు జీహెచ్ఎంసీ అధికారులు జనన, మరణ ధ్రువపత్రాల జారీని అవినీతిమయం చేశారు. -
ఓటరు చీటీలు మేమే ఇస్తాం
[ 02-05-2024]
నగరంలో ఓటరు చీటీల పంపిణీ గందరగోళంగా మారింది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి వాటిని పంపిణీ చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ కొన్ని నియోజకవర్గాల్లో నేతల చేతుల్లోకి వెళ్లింది. -
ప్రచారానికి రండి.. సదుపాయాలు దండి
[ 02-05-2024]
అయ్యా! పనివాళ్లు దొరకడంలేదు. నలుగురిని పిలుస్తుంటే ఒక్కరే వస్తున్నారు. అందరూ ప్రచారానికి వెళ్లిపోతున్నారు. యజమాని..: కూలీ కంటే డబ్బులు ఎక్కువ వస్తాయా..? -
గుర్తుంచుకునేలా..
[ 02-05-2024]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘జనసేన’ పార్టీ గుర్తు ‘గాజుగ్లాసు’ను హైదరాబాద్లోని మూడు లోక్సభ నియోజకవర్గాల్లో చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు కేటాయించారు. -
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
[ 02-05-2024]
: నాంపల్లికి చెందిన కిర్పాన్ కౌర్ ఖనూజా అబిడ్స్ స్లేట్ ది స్కూల్లో పదో తరగతి చదువుతోంది. మార్చి ఒకటిన ప్రీ ఫైనల్ పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై తల్లి అస్మిత్కౌర్ కలిసి ఇంటికెళ్తుండగా.. ఓ యువకుడు అడ్డొచ్చాడు. అదుపుతప్పి తల్లీకూతురు కిందపడ్డారు. -
మేయర్ ఇంట్లో చొరబడిన అగంతకుడు
[ 02-05-2024]
మేయర్ ఇంట్లోకి అగంతకుడు చొరబడ్డాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం..ఎన్బీటీనగర్లోని మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి మంగళవారం ఓ అగంతకుడు వచ్చి నేరుగా ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లాడు. -
చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స
[ 02-05-2024]
చిన్నారుల్లో అరుదుగా వచ్చే కాలేయ క్యాన్సర్కు చికిత్స చేసి అరుదైన ఘనత సాధించారు నిమ్స్ వైద్యులు. ఆస్పత్రి డైరెక్టర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ సర్జన్ నగరి బీరప్ప చికిత్స చేశారు. -
అమ్మాయిలా నటిస్తూ.. నగ్నచిత్రాలు పంపుతూ..
[ 02-05-2024]
బెట్టింగ్కు అలవాటుపడ్డ కుర్రాడు.. నేరస్థుడి అవతారమెత్తాడు. డేటింగ్ యాప్లో అమ్మాయిలా నటించి మోసగిస్తున్న అతడ్ని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
బోను వద్దకు వెళ్లి మేకను వదిలేసిన చిరుత
[ 02-05-2024]
విమానాశ్రయం రన్వే మైదానంలోకి నాలుగు రోజుల క్రితం చొరబడిన చిరుత మంగళవారం రాత్రి 10.57 గంటలకు ఓ బోను వద్దకు వచ్చింది. అందులో ఉన్న మేక జోలికి మాత్రం వెళ్లలేదు. -
ఓటర్లను మభ్యపెట్టడానికే భాజపాపై దుష్ప్రచారం
[ 02-05-2024]
ఆరు గ్యారంటీ పథకాల అమల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్ మండిపడ్డారు. -
ఠాణాకు చేరిన మైనర్ల ప్రేమ
[ 02-05-2024]
ఆ బాలికకు పదిహేనేళ్లు నిండలేదు. అబ్బాయికీ 18 లోపే. వీరి మధ్య చిగురించిన ప్రేమ గర్భం వరకు వెళ్లడంతో పెద్దలకు తెలిస్తే తిడతారని ఆ బాలుడు బాలికకు గర్భవిచ్ఛిత్తి మాత్రలు వేయించాడని తెలిసింది. -
సీఎంపై ఓయూ పీఎస్లో ఫిర్యాదు
[ 02-05-2024]
ఓయూ సెలవుల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ భాష సంస్కారవంతమైంది
[ 02-05-2024]
తెలంగాణ భాష ఎంత గొప్పదో పోతన, పాల్కుర్కి, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి, కాళోజీలలో ప్రతిఫలిస్తుందని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అన్నారు -
నిమ్స్ కార్మికులకు అండగా ఉంటా
[ 02-05-2024]
నిమ్స్ ఆస్పత్రిలో పనిచేసే కార్మికులకు అండగా ఉంటానని ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ఆస్పత్రిలో నిర్వహించిన కార్మిక దినోత్సవంలో పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ డేగ కళ్లు
[ 02-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటోంది. -
సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
[ 02-05-2024]
పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో పలువురు భారాస నాయకులు, కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్లో చేరారు. -
కోడ్ ముగిశాక హామీలన్నీ అమలు
[ 02-05-2024]
ఆరు గ్యారంటీల్లో అయిదింటిని అమలు చేశామని, మిగిలిన వాటినీ ఎన్నికల కోడ్ ముగిశాక తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి