logo

సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు భారాస నాయకులు, కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్‌లో చేరారు.

Published : 02 May 2024 02:03 IST

చేవెళ్ల, షాబాద్‌ న్యూస్‌టుడే: పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు భారాస నాయకులు, కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. వీరిలో భారాస రాష్ట్ర నాయకులు శేరి పెంటారెడ్డి, షాబాద్‌ మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ రవీందర్‌రెడ్డితో పాటు చల్లా మాదవరెడ్డి, అష్మత్‌పాషా, ఇనాయత్‌ తదితరులున్నారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, ఫహీం ఖురేషీ, బొంతు రాంమోహ్మహన్‌, కస్తూరి నరేందర్‌, జైపాల్‌రెడ్డి, అశోక్‌యాదవ్‌, సానెం శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ పాపిరెడ్డి పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

 

 

కొందుర్గు: పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసేది, అండగా నిలిచేది కాంగ్రెస్సే అని ఆ పార్టీ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. బుధవారం వారు స్థానిక నాయకులతో కలిసి కొందుర్గు, కొత్తూరు. జిల్లేడుచౌదరిగూడెం, కేశంపేట మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయా చోట్ల వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారాస పదేళ్ల పాలన అంతా అవినీతిమయమని, కేంద్రంలో భాజపా నాయకులు మతతత్వంతో పాలించారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని