శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి స్థిరాస్తులు రూ.118 కోట్లు
శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వి.జగదీశ్వర్ గౌడ్ తనకు రూ.118.62 కోట్ల స్థిరాస్తులు, రూ.5.86 కోట్ల చరాస్థులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు.
నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న జగదీశ్వర్గౌడ్
ఈనాడు, హైదరాబాద్- శేరిలింగంపల్లి, న్యూస్టుడే: శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వి.జగదీశ్వర్ గౌడ్ తనకు రూ.118.62 కోట్ల స్థిరాస్తులు, రూ.5.86 కోట్ల చరాస్థులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. శేరిలింగంపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరెడ్డికి కార్యాలయంలో జగదీశ్వర్గౌడ్ శుక్రవారం తన నామినేషన్ సమర్పించారు. నామినేషన్ పత్రాలతోపాటు ఆస్తులు, అప్పుల వివరాలు జతపరిచారు. తనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. చరాస్తుల్లో రూ.83లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు, తన భార్య పూజిత వద్ద 500 గ్రాముల బంగారు ఆభరణాలున్నట్టు వివరించారు. వివిధ బ్యాంకుల్లో అప్పులు రూ.2.21కోట్లున్నాయని పేర్కొన్నారు.
స్థిరాస్తులు ఇలా... వ్యవసాయ భూములు సంగారెడ్డి జిల్లా వెల్లటూరు, మిర్దొడ్డి గ్రామాల్లో ఉన్నాయి. వ్యవసాయేతర భూములు శేరిలింగంపల్లి మండలం నల్లగండ్లలో 9.28 ఎకరాలు, 9347 చదరపు గజాల స్థలం ఉంది. మాదాపూర్ మై హోం హబ్లో ఒక ఫ్లాట్, హిమాయత్నగర్లో ఒక ఫ్లాట్, నల్లగండ్లలో ఒక ఫ్లాట్, శేరిలింగంపల్లిలో మరో ఫ్లాట్ ఉన్నాయి. రెండుచోట్ల పెంట్ హౌస్లు, ఒక విల్లా, శేరిలింగంపల్లిలోని అపర్ణ సైబర్ జోన్లో 28 ఫ్లాట్లున్నాయి.
జగదీశ్వర్గౌడ్ - రూ.113,20,49,900
పూజిత(భార్య) - రూ.4,63,94,900
హారిక(కుమార్తె) - రూ.40,00,000
వైభవ్(కుమారుడు) - రూ.38,00,000
చరాస్తులు..
జగదీశ్వర్గౌడ్ - రూ.5,27,33,483
పూజిత - రూ.59,00,889
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరు స్లిప్పు అందలేదా?.. ఇలా చేయండి
[ 12-05-2024]
ఓటరు సమాచార పత్రాలను ఇప్పటికే సంబంధిత బీఎల్లు ఇంటింటికీ పంపిణీ చేశారు. రాజకీయ పార్టీలు ఓటరు చీటీలను పంచుతున్నాయి. ఇంకా అందనివారు ‘ఓటరు హెల్ప్లైన్’ మొబైల్ యాప్తో సమాచారం పొందొచ్చు. -
అభయ హస్తం.. ప్రగతికి నేస్తం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు శివారులో కాంగ్రెస్ నినాదాలు హోరెత్తాయి.. కూడళ్లు జన పరవళ్లతో కిక్కిరిశాయి.. -
నగరాన్ని చుట్టేశారు.. ప్రచారానికి తెరదించారు
[ 12-05-2024]
రాజధానిలో మైకులు మూగబోయాయి. నెల రోజులపాటు ప్రసంగాలతో ఊదరగొట్టిన నేతల నోళ్లు మూతపడ్డాయి. లోక్సభ ఎన్నికల ప్రచారం గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. -
ఓటుకు సిద్ధమా
[ 12-05-2024]
గ్రేటర్ హైదరాబాద్ నగరం ఓటుకు సిద్ధమైంది. మరో 24గంటల్లో ఎన్నిక ప్రక్రియ మొదలుకానుంది. మూడు జిల్లాల్లోని నాలుగు ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుండగా.. -
గులాబీతో అభివృద్ధి గుబాళింపు..
[ 12-05-2024]
ముస్లింల సంక్షేమానికి భారాస ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
ఎన్నికల యుద్ధం.. బలగం సిద్ధం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు కమిషనరేట్ల పరిధిలో 27వేల మంది పోలీసులు, 60 కంపెనీల కేంద్ర బలగాలు బందోబస్తులో ఉండనున్నాయి. ఎక్కడ ఘర్షణ చెలరేగినా క్షణాల్లో చేరుకునేలా దశలవారీ భద్రతా వ్యూహం రూపొందించారు. -
నకిలీ ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా
[ 12-05-2024]
భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, అందరూ ఓటు వేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ పిలుపునిచ్చారు. -
రండి.. స్వేచ్ఛగా ఓటేయండి
[ 12-05-2024]
ఓటు హక్కు వినియోగంపై ఎలా అవగాహన కల్పించారు? ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశారా? -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో పెయింటింగ్ వర్క్షాప్ 19న
[ 12-05-2024]
ఔత్సాహిక చిత్రకారుల కోసం ఒక ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. ‘ఎ ప్యాలెట్ ఆఫ్ డ్రీమ్స్’ పేరున ఈ నెల 19న నిర్వహించనున్న ఈ శిబిరంలో 14 సంవత్సరాలు దాటిన వారెవరైనా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. -
ప్రచారం ముగిసింది.. పోలింగే మిగిలింది!
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. దాదాపు మూడు నెలలుగా సాగిన ప్రచారానికి తెరపడింది. మల్కాజిగిరి, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. -
ఈవీఎంల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: కలెక్టర్
[ 12-05-2024]
ఈవీఎంలను పోలీంగ్ కేంద్రాలకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సిబ్బందికి తెలిపారు. శనివారం స్థానిక ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రమైన మేరీ-ఏ-నాట్్్స పాఠశాలను అదనపు పాలనాధికారి రాహుల్ శర్మ, శిక్షణ కలెక్టర్ ఉమా హారతితో కలిసి పరిశీలించారు. -
అమిత్షోతో.. కొండంత భరోసా
[ 12-05-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వికారాబాద్లో నిర్వహించిన సభ విజయవంతమై పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. -
సర్కార్లో జిల్లాకు అధిక ప్రాధాన్యం
[ 12-05-2024]
మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి విజయాన్ని కోరుతూ శనివారం తాండూరులోని విలియమ్ మూన్ మైదానంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొని సీఎం మాట్లాడారు. -
వేలిపై సిరా చుక్క.. ఉచిత వైద్యం పక్కా
[ 12-05-2024]
ఈనెల 13న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఆరోజు ఉచితంగా వైద్యం అందజేస్తామని స్థానిక మైత్రి ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ శ్రవణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
-
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
-
అతివలు మెచ్చేలా.. అందరూ వచ్చేలా: మహిళా మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు