అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు.. ఓటర్లు ఎటు?
సార్వత్రిక ఎన్నికల వేళ చేవెళ్ల రాజకీయం రసకందాయంగా మారుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమరం సమయంలో ఆ పార్టీలో ఉన్న వాళ్లు ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో ఉన్న వాళ్లు ఆ పార్టీలోకి మారడం సర్వసాధారణమైంది.
రసకందాయంగా చేవెళ్ల రాజకీయం
కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి
న్యూస్టుడే, వికారాబాద్: సార్వత్రిక ఎన్నికల వేళ చేవెళ్ల రాజకీయం రసకందాయంగా మారుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమరం సమయంలో ఆ పార్టీలో ఉన్న వాళ్లు ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో ఉన్న వాళ్లు ఆ పార్టీలోకి మారడం సర్వసాధారణమైంది. ఈ పరిణామం ఓటర్లను ఒకింత గందరగోళానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో చేవెళ్లకు అభ్యర్థులను ప్రకటించడం పార్టీల అధిష్ఠానాలకు ఒకింత క్లిష్లంగానే మారింది. భాజపా తొలి జాబితాలోనే తమ అభ్యర్థిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని ప్రకటించింది. భారాస తరఫున గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెదేపా రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కారు ఎక్కిన కాసాని జ్ఞానేశ్వర్ బరిలోకి దిగనున్నారు. కాస్త ఆలస్యంగానైనా సిట్టింగ్ ఎంపీ, ఇటీవల కారు దిగి చేయి అందుకున్న రంజిత్రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని వికారాబాద్, పరిగి, తాండూర్ శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం స్థానాల్లో భారాస అభ్యర్థులు విజయం సాధించారు.
భాజపా దూకుడు.. దేశంలో వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో భాజపా వ్యూహాలు రచిస్తోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన బి.జనార్దన్రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 15.52 శాతం ఓట్లను మాత్రమే సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లోనూ భాజపా ప్రభావం పెద్దగా కనిపించలేదు. పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఓటర్లు భాజపా వైపు మొగ్గు చూపుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బలమైన అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డిని బరిలో దించింది. చేవెళ్ల ఎమ్మెల్యేల పరిధిలో భాజపా ప్రాతినిథ్యం లేకున్నా, కాంగ్రెస్, భారాసలకు దీటుగా ప్రచారం చేసేందుకు కసరత్తు చేస్తోంది.
భారాసలో మలుపు తిరిగిన రాజకీయం
ప్రస్తుతం చేవెళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారాస సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డిని రెండోసారి పోటీకి దించాలని రెండు మాసాల కిందటే నిర్ణయించారు. అప్పట్లో ఆయన కిమ్మనలేదు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి పోటీకి విముఖత వ్యక్తం చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేయనుండటం ఆపార్టీకి ఒకింత ప్రతికూలాంశమే. దీన్ని అధిగమించడానికి జిల్లాలో పరపతి, పలుకుబడి ఉన్న బలమైన బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ను బరిలో నిలిపింది. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఏడు ఎమ్మెల్యే స్థానాలకు గాను చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానాల్లో భారాస గెలుపొందడం ఆపార్టీకి కలిసొచ్చే అంశం. ఈ నెల 18న మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి నివాస గృహంలో కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్సీ వాణిదేవి చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు యాదయ్య, ప్రకాశ్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, మహేష్రెడ్డిలతో సమావేశమై గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై చర్చించారు.
గడ్డం రంజిత్రెడ్డి నేపథ్యం
గడ్డం రంజిత్రెడ్డి వ్యాపారవేత్త. 1964 సెప్టెంబరు 18న వరంగల్లో రాజారెడ్డి, చంద్రకళ దంపతులకు జన్మించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వెటర్నరీ సైన్స్ విభాగంలో పీజీ పట్టా పొందారు. ఈయన భార్య సీతారెడ్డి తితిదే పాలకవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. భారాస అధినేత కేసీఆర్తో ఉన్న మంచి సంబంధాలతో 2019లో చేవెళ్లనుంచి స్వల్ప మెజార్టీతో గెలిచారు.
హస్తగతం చేసుకోవాలని..
గత శాసనసభ ఎన్నికల ఊపునే కొనసాగించి చేవెళ్ల స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్రెడ్డి భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరి అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ అధ్యక్షురాలిగా రెండుసార్లు, వికారాబాద్ జడ్పీ అధ్యక్షురాలిగా కొనసాగిన పట్నం సునీతారెడ్డి ఇటీవలే భారాసకు రాజీనామా సమర్పించి కాంగ్రెస్లో చేరారు. ఇక్కడి నుంచి ఈమెను రంగంలోకి దింపి విజయం సాధించాలని కాంగ్రెస్ తొలుత భావించినా, అనూహ్యంగా ఆమెకు మల్కాజిగిరి టిక్కెట్ ఇచ్చారు. నాయకులు ఇటీవలే పార్టీలు మారి చేరడం అనేది కాంగ్రెస్కు ఏమేరకు కలిసొస్తుందో చూడాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి చాటి చెప్పాలి: ప్రియాంక
[ 11-05-2024]
రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలని దేశంలో ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. -
మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పులపాలయ్యింది: అమిత్ షా
[ 11-05-2024]
మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. గతంలో భారాస అప్పులు చేసినట్లే కాంగ్రెస్ కూడా చేస్తోందని ఆరోపించారు. -
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
[ 11-05-2024]
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
[ 11-05-2024]
ఏపీ నుంచి వచ్చి శేరిలింగంపల్లిలో ఉంటున్న కొందరు ఓటర్లు సొంతూరుకు ప్రయాణమయ్యారు. -
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
[ 11-05-2024]
కేపీహెచ్బీ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం మహిళ మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిందితుడని గుర్తించిన పోలీసులు.. -
నమో నినాదం.. కమల వికాసం
[ 11-05-2024]
వికసిత కమలాలతో.. కాషాయ రెపరెపలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కళకళలాడాయి. మైదానమంతా మోదీ నినాదమే మార్మోగింది. -
అడుగడుగునా హారతులు.. అభివృద్ధికి వరాలు
[ 11-05-2024]
అడుగడుగునా హారతులు.. బతుకమ్మ ఆటలు.. శ్రేణుల నినాదాలు.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. -
భద్రత మాది.. బాధ్యత మీది
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100 శాతం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. -
సికింద్రాబాద్ ఓటర్లు అభివృద్ధి చూశారు
[ 11-05-2024]
‘రాష్ట్ర రాజధానిలో సగం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నేను చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. జాతీయ హోదాకు పోరాడతా
[ 11-05-2024]
‘చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓవైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవడంతోపాటు మరోవైపు వెనకబడిన ప్రాంతాల సమాహారంగా విస్తరించి ఉంది. -
ప్రలోభాలకు ఎర.. పంపకాల జాతర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో రాజధాని పరిధిలో ప్రలోభాలకు తెర లేచింది. -
కమలం గుర్తుంచుకోండి
[ 11-05-2024]
శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రోడ్షో నిర్వహించారు. -
తెలంగాణ గుండెచప్పుడు.. ప్రతిధ్వనించింది
[ 11-05-2024]
ఇప్పటి వరకు లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) చారిత్రక విజయం నమోదు చేసుకుంది. -
భాజపా శ్రేణుల్లో నయా జోష్
[ 11-05-2024]
సార్వత్రిక ప్రచారం తుది దశలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అధోగతి: సబిత
[ 11-05-2024]
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. -
చేవెళ్ల సీటు సోనియాకు కానుకగా ఇస్తాం: టీఆర్ఆర్
[ 11-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ సీటును గెలిపించుకుని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కో ఇంఛార్జి డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. -
ప్రచార పర్వం.. నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
దాదాపు నెల రోజులుగా హోరెత్తించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెర పడుతోంది. -
సొంతవారికే పంపకాల అప్పగింతలు
[ 11-05-2024]
ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. -
గత స్మృతులను గుర్తు చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తూ
[ 11-05-2024]
ఆరు నెలల క్రితం చిన్నారి పాడిన పద్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రముఖుల రాకపోకలతో బేగంపేట విమానాశ్రయంలో సందడి
[ 11-05-2024]
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నగరానికి ప్రముఖుల రాకపోకలతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయం సందడిగా మారింది. -
ఎన్నికల రోజున డ్రోన్లతో నిఘా
[ 11-05-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ తెలిపారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
[ 11-05-2024]
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
చీటీ వచ్చిందా.. ఏ బ్రాండు కావాలో ఇచ్చెయ్
[ 11-05-2024]
ఓటర్లకు మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం దృష్టి మళ్లించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. -
దుర్గంచెరువు పూడ్చివేతపై ఫిర్యాదు
[ 11-05-2024]
మాదాపూర్లోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను ఫూడ్చివేసిన ప్రాంత్రాన్ని శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. -
జనం డబ్బుతో సినిమా నిర్మాణం
[ 11-05-2024]
చిట్టీల వ్యాపారంతో ప్రజల వద్ద రూ.కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ సొమ్ముతో ఓ సినిమాను నిర్మించారు. -
ఈత కొలనులో మునిగి అయిదేళ్ల చిన్నారి దుర్మరణం
[ 11-05-2024]
వేసవి శిబిరం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు (Latest News)
-
James Anderson: టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్
-
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్