logo

అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా

చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

Published : 25 Apr 2024 02:12 IST

మాట్లాడుతున్న  విశ్వేశ్వర్‌ రెడ్డి

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో ఉదయం ఎస్‌ఎపీ గ్రౌండ్‌లో వాకింగ్‌ చేస్తున్న ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మరోసారి మోదీ కేంద్రంలో ప్రధానమంత్రిగా అవుతారని అన్నారు. దేశంలో భాజపా గాలి వీస్తుందన్నారు.

తాండూరు: చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు తమవైపే ఉన్నారని తాండూరులోని భాజపా నాయకులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తాండూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి విజయానికి అందరూ కృషి చేస్తారన్నారు. సమావేశంలో రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యుడు యు.రమేష్‌కుమార్‌, రాష్ట్ర మహిళా మోర్చ కార్యదర్శి సాహూ శ్రీలత, జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్‌, కార్యదర్శి భద్రేశ్వర్‌, ఉపాధ్యక్షురాలు లలిత, జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్‌, తాండూరు పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేషం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని