logo

బంధాన్ని కాదని.. భర్తను బంధించి

ఆస్తి కోసం భార్య  ఇనుప గొలుసుతో కట్టేసి భర్తను చిత్రహింసలు పెట్టింది. ఘట్‌కేసర్‌ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌లోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సెంట్రింగ్‌ గుత్తేదారు పత్తి నరసింహ(50) భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

Published : 04 May 2024 04:11 IST

గొలుసులతో నరసింహ

ఘట్‌కేసర్‌: ఆస్తి కోసం భార్య  ఇనుప గొలుసుతో కట్టేసి భర్తను చిత్రహింసలు పెట్టింది. ఘట్‌కేసర్‌ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌లోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సెంట్రింగ్‌ గుత్తేదారు పత్తి నరసింహ(50) భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భార్య పేరిట ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం చేసిన అప్పులు తీర్చేందుకు భర్త ఆయన పేరు మీద ఉన్న మరో స్థలం అమ్ముతానని చెప్పడంతో అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏడాది క్రితం భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. యాదాద్రి జిల్లా పడమటి సోమారంలో ఉన్నట్లు తెలుసుకున్న భార్య గత నెల 30న  కొడుకులతో కలిసి వెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. ఇనుప గొలుసుతో బంధించి  స్థలాన్ని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని చిత్రహింసలు పెట్టింది. శుక్రవారం ఆ దృశ్యాన్ని స్థానికుడు ఒకరు రహస్యంగా చరవాణిలో చిత్రీకరించి మాజీ ఎంపీటీసీ సభ్యుడు మహేశ్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన సమాచారం ఇవ్వడంతో బందీగా ఉన్న నరసింహను పోలీసులు విముక్తి చేసి ఠాణాకు తీసుకెళ్లారు. భార్య కొడుకులపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని