logo

బామ్మర్దికి వీడియోకాల్‌.. ఆపై బలవన్మరణం

 బామ్మర్దికి వీడియోకాల్‌ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకున్న ఘటన శనివారం  కీసర మండలం చీర్యాలలో జరిగింది. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం.  బీబీనగర్‌ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన పర్వతం మహేశ్‌యాదవ్‌(38)కు 12 ఏళ్ల క్రితం కీసర శివాజీ నగర్‌ కాలనీకి చెందిన భవానీతో వివాహమైంది.

Published : 28 Apr 2024 02:36 IST

మహేశ్‌యాదవ్‌

కీసర, న్యూస్‌టుడే:  బామ్మర్దికి వీడియోకాల్‌ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకున్న ఘటన శనివారం  కీసర మండలం చీర్యాలలో జరిగింది. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం.  బీబీనగర్‌ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన పర్వతం మహేశ్‌యాదవ్‌(38)కు 12 ఏళ్ల క్రితం కీసర శివాజీ నగర్‌ కాలనీకి చెందిన భవానీతో వివాహమైంది. వీరికి ఓ కూతురు(9), కుమారుడు(7) ఉన్నారు. భూమి విక్రయించి ఆ డబ్బుతో మహేశ్‌యాదవ్‌ సొంతూర్లో ఇళ్లు నిర్మిస్తున్నాడు.   ఖర్చులో తేడాలు రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భవానీ కీసరలోని శివాజీ నగర్‌ కాలనీలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మహేశ్‌ శుక్రవారం అత్తవారింటికి వచ్చాడు.  చీర్యాలకు చెందిన తోడళ్లుడు వెంకటేశ్‌, యాప్రాలకు చెందిన మరో వ్యక్తి మహేశ్‌ను శుక్రవారం రాత్రి చీర్యాలలోని వ్యవసాయ పొలానికి తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న మహేశ్‌ వ్యవసాయ పొలంలోని షెడ్‌లో ఉరి వేసుకుంటున్నట్లు బామ్మర్ధికి వీడియోకాల్‌ చేశాడు. ఆ తర్వాత ఉరేసుకున్నట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని