నగరవాసి.. నీటికి అల్లాడి
వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు.
వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. మరోవైపు ‘తక్కువ ధరకే శుద్ధజలం’ లక్ష్యం నీరుగారిపోయింది. ప్రధాన రైల్వే స్టేషన్లను పట్టించుకుంటున్న ద.మ.రైల్వే ఎంఎంటీఎస్ స్టేషన్లను పట్టించుకోవడం లేదు.
ఎండిన బోర్లు.. నిండని సంపులు
నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రమవుతోంది. అరంగుళం నల్లా కనెక్షన్ ఉన్న ఇంటికి నెలకు 15 కిలోలీటర్ల నీటిని అందిస్తున్నట్లు జలమండలి చెబుతోంది. కానీ 9-10 కి.లీ.కు మించి సరఫరా అయ్యే పరిస్థితి లేదు. అంటే 10 ఫ్లాట్లు ఉన్న అపార్టుమెంట్కు 15 వేల కి.లీ. వరకు అందించాలి. వేసవి కావడంతో ప్రస్తుతం 7-8 వేల కి.లీ. సరఫరా చేస్తున్నారు. నెల నుంచి భూగర్భ జలాలు అడుగంటడంతో పూర్తిగా జలమండలి పైనే ఆధారపడుతున్నారు. నీటి కొరత వల్ల అరగంటకు మించి సరఫరా చేయడం లేదు. నార్సింగి, మణికొండ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, కాప్రా తదితర ప్రాంతాల్లో ట్యాంకర్లకు భారీగా డిమాండ్ ఉంటోంది. గతంలో అపార్టుమెంట్లో సంపులు నిండిపోయి నల్లా బంద్ చేసుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు సంపులు సగమైనా నిండడం లేదని స్థానికులు వాపోతున్నారు.
ట్రాకింగ్ ఎక్కడ..?
గ్రేటర్ వ్యాప్తంగా నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో జలమండలి అదనపు ట్యాంకర్లు, ఫిల్లింగ్ కేంద్రాలు, ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తోంది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల నుంచి అదనపు నీటిని తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. పలు ప్రాంతాల్లో ట్యాంకర్ బుక్ చేసిన 2-3 రోజులైనా సరఫరా కావడం లేదు. ఈ సమయాన్ని తగ్గిస్తామని అధికారులు చెబుతున్నా మార్పు కనిపించడం లేదు. బుకింగ్ నుంచి సరఫరా వరకు సరైన ట్రాకింగ్ ఉండటం లేదని వినియోగదారులు చెబుతున్నారు. కొందరు ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు కాలనీల మధ్య బోర్లు తవ్వి నీటిని తోడి అమ్ముకుంటున్నారు. దీంతో చుట్టుపక్కల ఇళ్లల్లోని బోర్లు ఎండిపోతున్నాయి.
నీరివ్వని వాటర్ ఏటీఎంలు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: నగరవాసులకు తక్కువ ధరకే శుద్ధ జలం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సుమారు వంద వాటర్ ఏటీఎంలు అలంకారప్రాయంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ ఆరేళ్ల క్రితం వీటిని ఎల్బీనగర్, అమీర్పేట్, పాతబస్తీ, ఖైరతాబాద్, మలక్పేట, హైటెక్సిటీ, మియాపూర్, నాంపల్లి, దిల్సుఖ్నగర్, ఉప్పల్ తదితర రద్దీ ప్రాంతాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రంథాలయాల సమీపంలో ఏర్పాటు చేసింది. నిర్వహణకు సిబ్బందిని నియమించింది. ఒక్కోదానికి రూ.6.50 లక్షలు వెచ్చించి నీటి శుద్ధి పరికరాలను కొనుగోలు చేసింది. రూపాయికి అర లీటరు, రూ.5కు 10 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన నీటిని అందించేవారు. ఇవి ప్రారంభంలో బాగానే పనిచేసినా అనంతరం నిర్వహణ కొరవడటంతో మూలకు చేరాయి. శీతాకాలం, వర్షాకాలంలో వీటి వినియోగం తక్కువగా ఉండటంతో తాళాలు వేసి వదిలేయడంతో ఇప్పుడు మొరాయిస్తున్నాయి. మలక్పేట పరిధి ఆనందనగర్ కాలనీతోపాటు మరికొన్ని ప్రాంతాల్లోని వాటర్ ఏటీఎంలలో రూ.5 నాణెం వేస్తే విద్యుత్తు షాక్ కొడుతోందని వినియోగదారులు చెబుతున్నారు.
ప్రైవేటు ప్లాంట్ల దందా.. నగరంలో నీటి కొరత, జీహెచ్ఎంసీ వాటర్ ఏటీఎంలు పనిచేయకపోవడం.. ప్రైవేటు శుద్ధజల కేంద్రాల నిర్వాహకులకు వరంగా మారింది. గతంలో 20 లీటర్ల నీటిని రూ.10కి విక్రయించగా ప్రస్తుతం రూ.20-30కి అమ్ముతున్నారు. వాటి పరిమితికి మించి నీటిని సరఫరా చేస్తున్నారు. బోరు నీటిని అప్పటికప్పుడే శుద్ధిచేసి విక్రయిస్తున్నారు. సాధారణంగా 12 పర్యాయాలు శుద్ధి ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. నీటి నాణ్యత నిర్ధారించేందుకు మైక్రో బయలాజికల్ ల్యాబ్ ఉండాలి. ఇవేవీ కానరావడం లేదు.
ఎంఎంటీఎస్ స్టేషన్లకు దక్కని తాగునీటి సౌకర్యం
ఈనాడు, హైదరాబాద్: ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. ప్రయాణాలు సాగించేవారి అవస్థలు చెప్పనలవి కాదు. బస్సుల్లో వెళ్లే వారు తాగునీరు ఎక్కడుంటే అక్కడ ఆగి దాహార్తి తీర్చుకోవచ్చు. రైల్వే ప్రయాణికులకు అది సాధ్యం కాదు.. ఇదే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ద.మ. రైల్వే పరిధిలోని 170 స్టేషన్లలో 468 వాటర్ వెండింగ్ మెషిన్లు పెట్టి చల్లటి తాగునీరు అందిస్తున్నారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. మొత్తమ్మీద కరోనా తర్వాత ఇప్పటికి ఐఆర్సీటీసీ రైల్వే స్టేషన్లలో వాటర్ వెండింగ్ మెషిన్లను (చల్లటి నీళ్లు అందించే యంత్రాలు) ఏర్పాటు చేసింది. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో తాగునీరు కాదు కదా మండుటెండలో ముఖం కడుక్కుందామన్నా కుదరని పరిస్థితి. చుట్టుపక్కల స్థానికులు నీరు పట్టుకెళుతున్నారని కుళాయిలను బంద్ చేశారు. దక్షిణ మధ్య రైల్వేకు ఆయువుపట్టు లాంటి సికింద్రాబాద్ స్టేషన్కు రోజూ 240 వరకూ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దాదాపు 1.80 లక్షల మంది ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తారు. ఇంతమంది నీటి అవసరాలు తక్కువ ఖర్చుతో తీర్చేందుకు ఇక్కడ సైతం వాటర్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. రైల్ నీరంటూ.. లీటర్ సీసాను రైల్వే స్టేషన్లలో, రైళ్లలో రూ.15కు అమ్ముతున్నారు. సామాన్యులు అవి కొనలేరు. అలాంటి వారు ఒక్కసారి ఐదు లీటర్ల బాటిల్ను నింపేసుకుంటే గమ్యం చేరేవరకూ తాగునీటికి ఇబ్బంది ఉండదు. ఇందుకోసం ద.మ.రైల్వే పరిధిలో కొత్త మెషిన్లను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి చాటి చెప్పాలి: ప్రియాంక
[ 11-05-2024]
రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలని దేశంలో ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. -
మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పులపాలయ్యింది: అమిత్ షా
[ 11-05-2024]
మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. గతంలో భారాస అప్పులు చేసినట్లే కాంగ్రెస్ కూడా చేస్తోందని ఆరోపించారు. -
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
[ 11-05-2024]
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
[ 11-05-2024]
ఏపీ నుంచి వచ్చి శేరిలింగంపల్లిలో ఉంటున్న కొందరు ఓటర్లు సొంతూరుకు ప్రయాణమయ్యారు. -
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
[ 11-05-2024]
కేపీహెచ్బీ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం మహిళ మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిందితుడని గుర్తించిన పోలీసులు.. -
నమో నినాదం.. కమల వికాసం
[ 11-05-2024]
వికసిత కమలాలతో.. కాషాయ రెపరెపలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కళకళలాడాయి. మైదానమంతా మోదీ నినాదమే మార్మోగింది. -
అడుగడుగునా హారతులు.. అభివృద్ధికి వరాలు
[ 11-05-2024]
అడుగడుగునా హారతులు.. బతుకమ్మ ఆటలు.. శ్రేణుల నినాదాలు.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. -
భద్రత మాది.. బాధ్యత మీది
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100 శాతం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. -
సికింద్రాబాద్ ఓటర్లు అభివృద్ధి చూశారు
[ 11-05-2024]
‘రాష్ట్ర రాజధానిలో సగం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నేను చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. జాతీయ హోదాకు పోరాడతా
[ 11-05-2024]
‘చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓవైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవడంతోపాటు మరోవైపు వెనకబడిన ప్రాంతాల సమాహారంగా విస్తరించి ఉంది. -
ప్రలోభాలకు ఎర.. పంపకాల జాతర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో రాజధాని పరిధిలో ప్రలోభాలకు తెర లేచింది. -
కమలం గుర్తుంచుకోండి
[ 11-05-2024]
శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రోడ్షో నిర్వహించారు. -
తెలంగాణ గుండెచప్పుడు.. ప్రతిధ్వనించింది
[ 11-05-2024]
ఇప్పటి వరకు లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) చారిత్రక విజయం నమోదు చేసుకుంది. -
భాజపా శ్రేణుల్లో నయా జోష్
[ 11-05-2024]
సార్వత్రిక ప్రచారం తుది దశలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అధోగతి: సబిత
[ 11-05-2024]
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. -
చేవెళ్ల సీటు సోనియాకు కానుకగా ఇస్తాం: టీఆర్ఆర్
[ 11-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ సీటును గెలిపించుకుని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కో ఇంఛార్జి డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. -
ప్రచార పర్వం.. నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
దాదాపు నెల రోజులుగా హోరెత్తించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెర పడుతోంది. -
సొంతవారికే పంపకాల అప్పగింతలు
[ 11-05-2024]
ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. -
గత స్మృతులను గుర్తు చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తూ
[ 11-05-2024]
ఆరు నెలల క్రితం చిన్నారి పాడిన పద్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రముఖుల రాకపోకలతో బేగంపేట విమానాశ్రయంలో సందడి
[ 11-05-2024]
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నగరానికి ప్రముఖుల రాకపోకలతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయం సందడిగా మారింది. -
ఎన్నికల రోజున డ్రోన్లతో నిఘా
[ 11-05-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ తెలిపారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
[ 11-05-2024]
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
చీటీ వచ్చిందా.. ఏ బ్రాండు కావాలో ఇచ్చెయ్
[ 11-05-2024]
ఓటర్లకు మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం దృష్టి మళ్లించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. -
దుర్గంచెరువు పూడ్చివేతపై ఫిర్యాదు
[ 11-05-2024]
మాదాపూర్లోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను ఫూడ్చివేసిన ప్రాంత్రాన్ని శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. -
జనం డబ్బుతో సినిమా నిర్మాణం
[ 11-05-2024]
చిట్టీల వ్యాపారంతో ప్రజల వద్ద రూ.కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ సొమ్ముతో ఓ సినిమాను నిర్మించారు. -
ఈత కొలనులో మునిగి అయిదేళ్ల చిన్నారి దుర్మరణం
[ 11-05-2024]
వేసవి శిబిరం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు (Latest News)
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్
-
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్