సాధించేందుకు పట్టు.. తెలిసిందే లోగుట్టు
మొన్నటి వరకు ఆ ముగ్గురు నేతలు భారాసలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు రాజకీయంగా సన్నిహితంగా మెలిగినవారే. ఇప్పుడు అదే నేతలు కాంగ్రెస్లో చేరి రాజధాని పరిధిలోని మూడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
గతంలో ఉన్న పార్టీని బలహీనం చేసే వ్యూహం
కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురూ భారాస నేతలే
మొన్నటి వరకు ఆ ముగ్గురు నేతలు భారాసలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు రాజకీయంగా సన్నిహితంగా మెలిగినవారే. ఇప్పుడు అదే నేతలు కాంగ్రెస్లో చేరి రాజధాని పరిధిలోని మూడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులుగా బరిలో నిలిచారు. గతంలో భారాసలో లోగుట్లు అన్నీ వారికి తెలియడంతో లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఆ పార్టీని బలహీనం చేసి పట్టు సాధించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయి గులాబీ నేతలంతా వారికి సన్నిహితులే కావడంతో కాంగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో సహకరించేలా అంతర్గత ఒప్పందం చేసుకుంటున్నారు.
చక్రం తిప్పుతున్న మహేందర్రెడ్డి
మాజీ మంత్రి మహేందర్రెడ్డి, ఆయన సతీమణి సునీతా మహేందర్ రెడ్డి భారాసలో కీలకంగా వ్యవహరించారు. అతని భార్య సునీతకు మూడుసార్లు జడ్పీ ఛైర్పర్సన్ పదవిని ఇచ్చారు. ఇప్పుడామే మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్సీ గా ఉన్న మహేందర్రెడ్డి సాంకేతికంగా పార్టీలో చేరకపోయినా తన భార్య విజయానికి ప్రచారం చేస్తున్నారు. కంటోన్మెంట్ భాజపా నేత శ్రీ గణేష్ను కాంగ్రెస్లోకి తీసుకొచ్చి అక్కడి ఉప ఎన్నికలో ఆయనకు టికెట్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. సుమారు 50 మంది మండల స్థాయి గులాబీ నేతలను హస్తం గూటికి చేర్చారు.
అనుభవాన్ని రంగరిస్తున్న రంజిత్రెడ్డి
చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా రంజిత్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఈ ఎన్నికల్లోనూ భారాస ఆయనకే టికెట్ ఇచ్చినా.. సీఎం రేవంత్రెడ్డి, ఆ పార్టీ అగ్రనేతలు రంగప్రవేశం చేయడంతో రంజిత్రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. అదే స్థానం నుంచి టికెట్ దక్కించుకొని పోటీ చేస్తున్నారు. ఈ పరిణామంతో భారాస కంగుతింది. తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చాలామంది నేతలతో ఇప్పటికీ సంబంధాలు వదులుకోలేదు. మండల స్థాయి నాయకులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులతో నెల రోజులుగా ఆయన మాట్లాడుతున్నారు. కొంతమంది గులాబీ పార్టీలోనే ఉన్నా.. ఈ ఎన్నికల్లో ఆయన కోసం పని చేస్తామని ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.
చేరికలపై దానం దృష్టి
ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్కు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తన పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల బలమైన నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఖైరతాబాద్పై ఆయన పట్టుంది. దీంతో మిగతా ప్రాంతాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా బల్దియా కార్పొరేటర్లకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే కొందరు చేరిపోగా.. మరికొందరితో మాట్లాడుతున్నారు. పలువురు కార్పొరేటర్లతో అంతర్గతంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. పార్టీ మారకపోయినా కాంగ్రెస్కు ఓట్లు వేయించేలా అవగాహనకు వస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి చాటి చెప్పాలి: ప్రియాంక
[ 11-05-2024]
రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలని దేశంలో ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. -
మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పులపాలయ్యింది: అమిత్ షా
[ 11-05-2024]
మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. గతంలో భారాస అప్పులు చేసినట్లే కాంగ్రెస్ కూడా చేస్తోందని ఆరోపించారు. -
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
[ 11-05-2024]
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
[ 11-05-2024]
ఏపీ నుంచి వచ్చి శేరిలింగంపల్లిలో ఉంటున్న కొందరు ఓటర్లు సొంతూరుకు ప్రయాణమయ్యారు. -
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
[ 11-05-2024]
కేపీహెచ్బీ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం మహిళ మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిందితుడని గుర్తించిన పోలీసులు.. -
నమో నినాదం.. కమల వికాసం
[ 11-05-2024]
వికసిత కమలాలతో.. కాషాయ రెపరెపలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కళకళలాడాయి. మైదానమంతా మోదీ నినాదమే మార్మోగింది. -
అడుగడుగునా హారతులు.. అభివృద్ధికి వరాలు
[ 11-05-2024]
అడుగడుగునా హారతులు.. బతుకమ్మ ఆటలు.. శ్రేణుల నినాదాలు.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. -
భద్రత మాది.. బాధ్యత మీది
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100 శాతం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. -
సికింద్రాబాద్ ఓటర్లు అభివృద్ధి చూశారు
[ 11-05-2024]
‘రాష్ట్ర రాజధానిలో సగం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నేను చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. జాతీయ హోదాకు పోరాడతా
[ 11-05-2024]
‘చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓవైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవడంతోపాటు మరోవైపు వెనకబడిన ప్రాంతాల సమాహారంగా విస్తరించి ఉంది. -
ప్రలోభాలకు ఎర.. పంపకాల జాతర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో రాజధాని పరిధిలో ప్రలోభాలకు తెర లేచింది. -
కమలం గుర్తుంచుకోండి
[ 11-05-2024]
శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రోడ్షో నిర్వహించారు. -
తెలంగాణ గుండెచప్పుడు.. ప్రతిధ్వనించింది
[ 11-05-2024]
ఇప్పటి వరకు లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) చారిత్రక విజయం నమోదు చేసుకుంది. -
భాజపా శ్రేణుల్లో నయా జోష్
[ 11-05-2024]
సార్వత్రిక ప్రచారం తుది దశలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అధోగతి: సబిత
[ 11-05-2024]
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. -
చేవెళ్ల సీటు సోనియాకు కానుకగా ఇస్తాం: టీఆర్ఆర్
[ 11-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ సీటును గెలిపించుకుని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కో ఇంఛార్జి డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. -
ప్రచార పర్వం.. నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
దాదాపు నెల రోజులుగా హోరెత్తించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెర పడుతోంది. -
సొంతవారికే పంపకాల అప్పగింతలు
[ 11-05-2024]
ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. -
గత స్మృతులను గుర్తు చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తూ
[ 11-05-2024]
ఆరు నెలల క్రితం చిన్నారి పాడిన పద్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రముఖుల రాకపోకలతో బేగంపేట విమానాశ్రయంలో సందడి
[ 11-05-2024]
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నగరానికి ప్రముఖుల రాకపోకలతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయం సందడిగా మారింది. -
ఎన్నికల రోజున డ్రోన్లతో నిఘా
[ 11-05-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ తెలిపారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
[ 11-05-2024]
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
చీటీ వచ్చిందా.. ఏ బ్రాండు కావాలో ఇచ్చెయ్
[ 11-05-2024]
ఓటర్లకు మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం దృష్టి మళ్లించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. -
దుర్గంచెరువు పూడ్చివేతపై ఫిర్యాదు
[ 11-05-2024]
మాదాపూర్లోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను ఫూడ్చివేసిన ప్రాంత్రాన్ని శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. -
జనం డబ్బుతో సినిమా నిర్మాణం
[ 11-05-2024]
చిట్టీల వ్యాపారంతో ప్రజల వద్ద రూ.కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ సొమ్ముతో ఓ సినిమాను నిర్మించారు. -
ఈత కొలనులో మునిగి అయిదేళ్ల చిన్నారి దుర్మరణం
[ 11-05-2024]
వేసవి శిబిరం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.