logo

రాష్ట్రంలో రెండంకెల స్థానాల్లో గెలుస్తాం: భాజపా

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా రెండంకెల స్థానాలు కైవసం చేసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల కమిటీ ప్రముఖ్‌,  గీతామూర్తి పేర్కొన్నారు.

Published : 30 Apr 2024 01:58 IST

మాట్లాడుతున్న గీతామూర్తి. చిత్రంలో చంద్రశేఖర్‌ తదితరులు

అంబర్‌పేట: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా రెండంకెల స్థానాలు కైవసం చేసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల కమిటీ ప్రముఖ్‌,  గీతామూర్తి పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రచారంపై నిర్వహించిన సమీక్ష వివరాలను కాచిగూడలో ఆమె వెల్లడించారు. ఈ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో భారాస చిరునామా ఉండదన్నారు. పార్టీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్‌, తమిళిసై,మునుస్వామి, మురుగన్‌, అరుణ్‌ చతుర్వేది, రాజేంద్ర రాథోడ్‌, ఎన్నికల కమిటీ సహప్రముఖ్‌ గీతారాణి పాల్గొన్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని