4 స్థానాలు.. 140 మంది అభ్యర్థులు
రాజధాని పరిధిలో పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలతోపాటు గుర్తింపు పొందిన ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున పోటీలో నిలిచారు.
సికింద్రాబాద్లో అత్యధికం మల్కాజిగిరిలో అత్యల్పం
వివరాలు వెల్లడిస్తున్న చేవెళ్ల ఆర్వో కె.శశాంక, సాధారణ పరిశీలకులు రాజేంద్రకుమార్ కటారియా
ఈనాడు, హైదరాబాద్: రాజధాని పరిధిలో పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలతోపాటు గుర్తింపు పొందిన ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియగా.. నగరంలోని నాలుగు స్థానాల్లో మొత్తం 140 మంది బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అందులో గరిష్ఠంగా సికింద్రాబాద్ నుంచి 45 మంది, మల్కాజిగిరిలో అత్యల్పంగా 22 మంది పోటీపడనున్నారు. చేవెళ్లలో 43 మంది, హైదరాబాద్ ఎంపీ స్థానానికి 30 మంది పోటీపడుతున్నారు. సికింద్రాబాద్ స్థానం నుంచి ఒక్కరే నామపత్రాన్ని ఉపసంహరించుకున్నారని, హైదరాబాద్లో 8 మంది, చేవెళ్లలో ముగ్గురు, మల్కాజిగిరిలో 15 మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. ఇందులో మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున, చేవెళ్ల బీఎస్పీ అభ్యర్థి గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు.
రెండుచోట్ల రెండు... మిగిలిన చోట్ల మూడు..
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు అభ్యర్థి పేరును చూసుకోవాలంటే కనీసం అరనిముషమైనా కేటాయించాల్సిందే. ఎందుకంటే అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో రెండు, మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గం పరిధిలో 20మందికిపైగా అభ్యర్థులుండటంతో ఈవీఎంలో గరిష్ఠంగా 15మంది అభ్యర్థులు, నోటాకు ఓటు వేసేందు వీలుంటుంది. మల్కాజిగిరి నుంచి 22 మంది, హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి 30 అభ్యర్థులు బరిలో ఉండడంతో రెండు చొప్పున ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నారు. చేవెళ్ల ఎంపీ స్థానంలో 43మంది, సికింద్రాబాద్ నుంచి 45 మంది పోటీలో ఉండడంతో మూడు చొప్పున ఈవీఎంలు ఉంటాయి.
కంటోన్మెంట్లో 15..
కంటోన్మెంట్, న్యూస్టుడే: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి 15 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. సోమవారం ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్వో మధుకర్నాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ రెబెల్గా నామపత్రాలు దాఖలు చేసిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఉపసంహరించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీటరు గిర్రుమంది.. గుండె గుబిల్లు మంది
[ 16-05-2024]
ఎండల తీవ్రత ఈసారి మే నెలతో పోలిస్తే ఇప్పటివరకు ఏప్రిల్లో అధికంగా ఉంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వినియోగదారుల కరెంట్ వాడకం కూడా అదే రీతిలో పెరిగింది. -
అనుమతులా.. అవెలా ఉంటాయ్?
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో రెవెన్యూ, పురపాలక శాఖల అధికారులు నిమగ్నమై ఉండగా..కొందరు రియల్ వెంచర్ల ప్రతినిధులు అనధికారికంగా లేఅవుట్లు వేస్తున్నారు. -
జలమండలి వావ్!
[ 16-05-2024]
నీటి ట్యాంకర్ బుక్ చేస్తే ఎప్పుడొస్తుందో.. అసలు వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులకు జలమండలి చెక్ పెట్టనుంది. వాటర్ ఆన్ వీల్స్ (వావ్) పేరుతో కొత్త యాప్నకు శ్రీకారం చుట్టింది. -
తీసుకున్న రూ.13 వేలు తిరిగి ఇవ్వలేదని...
[ 16-05-2024]
డబ్బు విషయమై తలెత్తిన వివాదం యువకుడి హత్యకు దారితీసింది. అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి, బండరాయితో మోది దారుణంగా హతమార్చిన ఘటన పాతబస్తీ హుస్సేనిఆలం ఠాణా పరిధిలో జరిగింది. -
ఉస్మానియా.. జేఎన్టీయూ వీసీ పోస్టులకు డిమాండ్
[ 16-05-2024]
రాష్ట్రంలోని పలు వర్సిటీలకు త్వరలో ఉపకులపతులను నియమించనున్న నేపథ్యంలో రాజధానిలో ఉన్న 5 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా, జేఎన్టీయూ వర్సిటీల వీసీ పోస్టులకు డిమాండ్ ఏర్పడింది. -
నంబర్ ప్లేట్ లేకపోతే.. ఠాణాకే వాహనం
[ 16-05-2024]
హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ మధ్య కాలంలో పలు సెల్ఫోన్ స్నాచింగ్లు జరిగాయి. సుమారు 700 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకుని, బాధితులకు అప్పగించారు. -
భౌబోయ్
[ 16-05-2024]
అధిక ఉష్ణోగ్రతలతో జనమే కాదు...జంతువులూ అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా కుక్కలపై ఎండ తీవ్ర ప్రభావం చూపుతోంది. తాగడానికి నీళ్లు, ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి. -
కళ్ల ముందే కాలిపోయిన కన్నవాళ్లు
[ 16-05-2024]
కళ్ల ముందే కన్నవారు సజీవ దహనం అవుతున్నా ఏమీ చేయలేని దుస్థితి. చెల్లెలు కూతురు వారి చేతిలో మంటలకు ఆహుతవుతున్నా తెలియని పరిస్థితి. -
కరెంట్ సరఫరాకు కొత్త చిక్కులు
[ 16-05-2024]
నగరంలో విద్యుత్తు సరఫరాకు కొత్త చిక్కులు వచ్చాయి. గాలులకు ఇదివరకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడటంతో ట్రిప్పయ్యేవి. ఇప్పుడు వీటికి తోడు వినైల్ బ్యానర్లు ఇబ్బందికరంగా మారాయి. -
నగరం నిప్పుల కొలిమి
[ 16-05-2024]
సూరీడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భగభగలతో బయటకు రాలేని పరిస్థితి. అత్యవసర పనులపై వెళ్లాలన్నా జనం భయపడుతున్నారు. -
శివపార్వతుల కల్యాణం.. కనులారా వీక్షణం
[ 16-05-2024]
వీరారెడ్డిపల్లి వీరభద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని బుధవారం కనుల పండువగా నిర్వహించారు. -
మహిళా చైతన్యం.. ఏమైందో..?
[ 16-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో (ఈ నెల 13న జరిగిన) జిల్లా మహిళలు ఓటు వేయడానికి అంతగా ఆసక్తి కనబర్చలేదు. ఇందుకుగల కారణాలపై నేతలు ఆరా తీస్తున్నారు. -
నత్త నడకన కొనుగోళ్లు.. రైతన్న దిగాలు
[ 16-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు అన్నదాతలు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. సర్కారు కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసినా అన్నిచోట్లా పూర్తి అందుబాటులోకి రాలేదు. వడివడిగా కొనుగోళ్లు సాగడం లేదు. -
సినిమా తెర మూగబోతోంది
[ 16-05-2024]
జిల్లాలోని సింగిల్ తెర సినిమా థియేటర్లు శుక్రవారం నుంచి ఈనెలాఖరు వరకు మూత పడుతున్నాయి. దీంతో వాటిలో పనిచేసే సిబ్బందికి ఉపాధిపై ఈ ప్రభావం పడక తప్పడంలేదు. -
నీరింకిన వాగులు.. ఒట్టిపోయిన బోర్లు
[ 16-05-2024]
వర్షాలు లేక యాసంగి పంటలు అనుకున్నంతగా సాగలేదు. జిల్లాలోని వాగులు, వంకల్లో ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో వాగులన్నీ రాళ్లు, ఇసుక దిబ్బలతో దర్శనమిస్తున్నాయి. -
నిధులు అందవు.. నిర్మాణాలు సాగవు
[ 16-05-2024]
ప్రభుత్వం క్రీడా రంగానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఆ దిశగా అడుగులు పడటంలేదు. దీంతో జిల్లాలోని క్రీడాకారులు నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోలేక పోతున్నారు. -
ముగిసిన ఎన్నికలు.. మిగిలిన కేసులు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా.. ప్రచారం సందర్భంగా వేర్వేరు పార్టీల నేతలపై నమోదైన కేసుల విచారణ ఇప్పుడే పట్టాలెక్కింది. -
నిమ్స్మే గ్రౌండ్స్లో మేకప్ ఆర్టిస్టు హత్య
[ 16-05-2024]
నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. -
హవాలా సొమ్ము స్వాధీనం కేసులో మలుపులు
[ 16-05-2024]
మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో యువకుడి ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. యాదాద్రి జిల్లా గుండాల మండలానికి చెందిన వడ్లకొండ రంజిత్(24) ఈ నెల 11న మేడిపల్లి పరిధి చెంగిచెర్లలోని అతని నివాసంలో బలవన్మరణం చేసుకున్నాడు. -
‘ఎంఐఎం గెలిచే అవకాశమే లేదు’
[ 16-05-2024]
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈసారి ఎంఐఎం గెలిచే అవకాశమే లేదని.. అవసరమైతే అక్కడ రీ పోలింగ్ జరిపిస్తామని భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలత అన్నారు. -
ఈజ్ మై ట్రిప్కు మొట్టికాయలు
[ 16-05-2024]
విమాన టిక్కెట్ల బుకింగ్లో అనైతిక వ్యాపారానికి పాల్పడిన ఈజ్ మై ట్రిప్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్- 1 మొట్టికాయలు వేసింది. -
లులుమాల్లో 17, 18, 19న ఫ్యాషన్ షో
[ 16-05-2024]
లులుమాల్ ఆధ్వర్యంలో ఈ నెల 17నుంచి 19 తేదీ వరకు ‘లులుస్ ఐకనిక్ షో, లులు ఫ్యాషన్ వీక్’ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాల్ ప్రతినిధులు తెలిపారు. -
థీమ్ పార్కుపై యూపీ ఆసక్తి
[ 16-05-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టే విధానాలను వివరిస్తూ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 51లో జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కుపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆసక్తి చూపింది. -
మలక్పేటలో రెనోవా బీబీ క్యాన్సర్ ఆసుపత్రి
[ 16-05-2024]
మలక్పేటలోని బీబీ క్యాన్సర్ ఆసుపత్రి.. రెనోవా బీబీ క్యాన్సర్ ఆసుపత్రిగా మారింది. ఇందుకు సంబంధించి బీబీ క్యాన్సర్ ఆసుపత్రి, రెనోవా ఆసుపత్రుల మధ్య బుధవారం ఒప్పందం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
-
యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి
-
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?