సామాజిక మాధ్యమాల్లో.. జర జాగ్రత్త!
చేతిలో స్మార్ట్ఫోన్.. ఇంకేముంది ఇష్టం వచ్చినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతామని అనుకుంటున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడక తప్పదు.
హద్దు మీరితే ఊచలు లెక్క పెట్టాల్సిందే
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం: చేతిలో స్మార్ట్ఫోన్.. ఇంకేముంది ఇష్టం వచ్చినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతామని అనుకుంటున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడక తప్పదు. మత, రాజకీయ, వ్యక్తిగత అంశాలకు సంబంధించి ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టులు పెట్టినా పోలీసు కేసులను ఎదుర్కోవాల్సిందే. జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే.
సాధారణ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సామాజిక మాధ్యమ పోస్టింగ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చే లీకులను పోస్టు చేస్తే, ఆ తర్వాత లీకులు ఇచ్చిన వారే అది తప్పుడు పోస్టంటూ ఫిర్యాదులు చేసే అవకాశముంది. ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీల నాయకులు, అభ్యర్థులు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఫిర్యాదులు చేసుకోగా, కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లోని పోస్టింగులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేయించేలా వివిధ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఆయా పార్టీల్లో సామాజిక మాధ్యమాలకు సంబంధించి ప్రత్యేక విభాగాలున్నాయి.
అడ్మిన్లదే పూర్తి బాధ్యత
- సామాజిక మాధ్యమ గ్రూపుల్లో, ముఖ్యంగా వాట్సాప్లో అభ్యంతరకర, విద్వేషాలను రెచ్చగొట్టేలా గ్రూఫులోని సభ్యులెవరు పోస్టులు పెట్టినా అడ్మిన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.
- అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని గ్రూపు నుంచి తొలగించడంతో పాటు సదరు పోస్టును సైతం వెంటనే తొలగించాలి.
- గతంలో కేవలం పోస్టు చేసిన వారు మాత్రమే దాన్ని తొలగించే అవకాశముండగా ప్రస్తుతం గ్రూపులోని ఏ సభ్యుడు పెట్టిన పోస్టునయినా అడ్మిన్ తొలగించే వీలుంది.
- గ్రూప్లో కొత్త సభ్యులను చేర్చుకునే ముందు వారి అనుమతి తీసుకోవడంతో పాటు తప్పుడు పోస్టులు పెట్టిన వారిని తొలగించి పోలీసులకు సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా అడ్మిన్దే.
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే తప్పుడు పోస్టులపై, ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసే అవకాశముంది.
- ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో ప్రత్యర్థులను అవమానపరిచేలా, తమ అభ్యర్థి గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టులు పెట్టే అవకాశముంది.
- ప్రత్యర్థులను కించపరిచే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, ఫొటోలు మార్చి, వాయిస్ మెసేజ్లు వాస్తవ విరుద్ధంగా పోస్టులు పెట్టినా, వాటిని షేర్ చేసినా, వాటికి మద్దతు తెలుపుతూ కామెంట్లు చేసినా చట్టరీత్యా శిక్షలు తప్పవు.
- తమ అనుమతి లేకుండా గ్రూపులో చేర్చుకునే అవకాశం లేకుండా వాట్సాప్లో ప్రత్యేక ఆప్షన్ను చరవాణి వినియోగదారులు ఎంచుకోవడం ఉత్తమం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టుకున్న సొత్తు రూ. 9.17 కోట్లు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నగదుతో పాటు ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. -
శిథిల వంతెనపై తప్పని ప్రయాణం!
[ 16-05-2024]
రామడుగు మండల కేంద్రంలోని మోతెవాగుపై వంతెన శిథిలమవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 1983లో నిర్మించిన వంతెన వరదలకు ఇరువైపులా మట్టి కొట్టుకుపోయింది. -
యువత ఓటింగ్ 37.31 శాతమే!
[ 16-05-2024]
ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత నిర్లిప్తత ప్రదర్శించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.. -
తక్కువ వ్యయంతో అధిక ఫలితాల సాధనకు కృషి
[ 16-05-2024]
సాగులో తక్కువ వ్యయంతో అధిక ఫలితాలు సాధించేందుకు రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన చేస్తున్నారని జమ్మికుంట కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఎన్.వెంకటేశ్వర్రావు అన్నారు. -
ఇంకుడుగుంతపై నిర్లక్ష్యం
[ 16-05-2024]
నగరంలోని భగత్నగర్లో ఒకరు కొత్తగా జీ+2 ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో ఇంకుడుగుంత నిర్మించేందుకు ఫీజు కూడా చెల్లించారు. -
స్వతంత్రుల ప్రభావమెంత?
[ 16-05-2024]
ప్రతి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్న స్వతంత్రులు ఓట్ల సాధనలో మాత్రం నామమాత్రంగానే నిలుస్తున్నారు.. ఈసారీ ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతా వారు ప్రచార ప్రక్రియపై దృష్టి పెట్టింది తక్కువ. -
పరిసరాల పరిశుభ్రతే రక్ష
[ 16-05-2024]
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధుల ముప్పు పొంచిఉంది. విష జ్వరాల బారినుంచి కాపాడుకునేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకం. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరి దుర్మరణం
[ 16-05-2024]
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ప్రమాదవశాత్తు శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్(39) దుర్మరణం చెందాడు. -
ఆదర్శలో ఇంటర్ ప్రవేశాలు
[ 16-05-2024]
ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన.. అధునాతనమైన తరగతి గదులు, ప్రయోగశాలలు.. నిష్ణాతులైన అధ్యాపకులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పిన ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్ తరగతులకు ఆదరణ పెరుగుతోంది. -
భూసారం.. పరీక్షలతో ఫలం
[ 16-05-2024]
రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి. -
సగం మందికే ఉపాధి
[ 16-05-2024]
వేసవి తాపంతోపాటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నప్పటికీ ఉపాధి పనులకు కూలీల జాతర కొనసాగుతుంది. -
బోర్డులే తప్ప.. కనిపించని ఆటలు
[ 16-05-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు, యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గత ప్రభుత్వం పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో డిసెంబరు నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని సరఫరా చేసింది. -
ఉత్పత్తిదారులకు నూలు.. నేతన్నలకు మేలు
[ 16-05-2024]
జాతీయ, అంతర్జాతీయ విపణిలో నూలు ధరల హెచ్చుతగ్గులు జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. -
చివరి దశకు యాసంగి రైతుబంధు పంపిణీ
[ 16-05-2024]
జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు నగదు జమ చివరి దశకు చేరుకుంది. అయిదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సొమ్ము గతంలోనే ఖాతాల్లో వేయగా ఆపై విస్తీర్ణం కలిగిన అన్నదాతలకు సాయం జమ చేస్తున్నట్లు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. -
నత్తనడకన పనులు.. రాకపోకలకు ఇబ్బందులు
[ 16-05-2024]
రద్దీ మార్గంలో లెవెల్ క్రాసింగ్లు ఎత్తివేసేందుకు రైల్వే శాఖ మంజూరు చేసిన పై వంతెన(ఆర్వోబీ)ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు