విస్తరించని జాతీయ మార్కెట్ వ్యవస్థ
రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలందిస్తూ దేశవ్యాప్తంగా విపణిపై పట్టుసాధించటం.. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నల్లబజారుకు తరలకుండా చూసి.. సరకుల నియంత్రణతో ధరల అదుపు ప్రధాన ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఈ-నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్)ను 2016 ఖరీఫ్నకు ముందు ప్రవేశపెట్టింది.
జగిత్యాల మార్కెట్లో దినుసులు
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్క్యాంపు: రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలందిస్తూ దేశవ్యాప్తంగా విపణిపై పట్టుసాధించటం.. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నల్లబజారుకు తరలకుండా చూసి.. సరకుల నియంత్రణతో ధరల అదుపు ప్రధాన ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఈ-నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్)ను 2016 ఖరీఫ్నకు ముందు ప్రవేశపెట్టింది. దేశంలోని 615 మార్కెట్లను ఈ-నామ్ పరిధిలో చేర్చగా యార్డుల్లో కంప్యూటర్లు తదితర ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఈనామ్ యార్డులను జాతీయ సర్వర్తో అనుసంధానించకపోవటం, కొనుగోళ్లు ఇతర మార్కెట్లకు విస్తరించనందున అన్నదాతలు కష్టించి పండించిన పంటలను స్థానిక యార్డుల వ్యాపారులే కొనుగోలు చేయడంతో ధరల్లో పెరుగుదల ఉండటంలేదు. గతంలో బీటులో వేలం ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులు ప్రస్తుతం కంప్యూటర్ల ద్వారా ధరలను కోట్చేసి కొంటున్నారు. పంట ఉత్పత్తుల ధరల్లో ఏమాత్రం పెరుగుదల నమోదులేక కర్షకులకు గిట్టుబాటు గగనంగా మారుతోంది.
- ఈ-నామ్ మార్కెట్ల పరిధిలో గుర్తింపు పొందిన వ్యాపారులు దేశంలో ఎక్కడినుంచైనా సరకులు కొనవచ్చు. స్థానిక బీటునుంచి సరకులు వ్యాపారి ప్రాంతానికి తరలించనుండగా మార్కెట్ కార్యదర్శి ద్వారా రైతులకు ఆన్లైన్లో చెల్లింపులు జరుపుతారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త వ్యాపారులు పోటీలో ఉంటే కనీసం 10 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దేశవ్యాప్త వ్యాపారులు పోటీపడేలా అన్నియార్డులను అనుసంధానించాలి.
- ఏకీకృత మార్కెట్ను విస్తరిస్తే దిల్లీ, నాగ్పూర్, సాంఘ్లీ, నిజామాబాద్, ఈరోడ్ తదితర ప్రాంతాల వ్యాపారులు ఆన్లైన్ ద్వారానే స్థానిక బీటు నుంచి పసుపు, మామిడి తదితర ఉత్పత్తులను కొనవచ్చు. రైతులు దూరప్రాంతం వెళ్లాల్సిన భారం తప్పుతుంది. అన్ని ఆన్లైన్ మార్కెట్లను జాతీయ సర్వర్తో అనుసంధానిస్తే జీరో క్రయవిక్రయాలు అరికట్టబడి ప్రభుత్వానికి ఆదాయం సమకూరటం.. సరకుల క్రయవిక్రయాలు ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి అక్రమ నిల్వలు అరికట్టబడి ధరలు అదుపులో ఉంటాయి.
- జగిత్యాల, మెట్పల్లి, గొల్లపల్లి యార్డులు ఈనామ్ పరిధిలో ఉండగా జాతీయ సర్వర్తో అనుసంధానించాలి. పెద్ద యార్డుల్లోనే క్రయవిక్రయాలు సాగుతుండగా మండల కేంద్రాల యార్డులు నామమాత్రంగా మారాయి.
- మార్కెట్లను ఆన్లైన్ చేయాలి, గ్రామాల్లో జీరో క్రయవిక్రయాలను పూర్తిగా అరికట్టాలి. మార్కెట్ల కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పోస్టులను భర్తీచేయాలి. అన్ని యార్డుల్లోనూ నిరంతరం లావాదేవీలను జరపాలి. గ్రామీణ మక్కలు, ధాన్యం సేకరణ కేంద్రాల్లో సిమెంట్గచ్చు నిర్మించాలి.
- చల్గల్ మామిడి మార్కెట్లో నిర్మించిన పండ్లను మాగేసే కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి. చల్గల్లో శాశ్వత పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేయాలి. గోదాముల నిర్మాణాన్ని పూర్తిచేయాలి.
- రైతులు వరి, జొన్న, సజ్జ, ఆవాలు, మక్క తదితర పంటల్లో విత్తనోత్పత్తి చేపడుతున్నందున ఈ పంట క్రయవిక్రయాలన్నీ మార్కెట్ల పరిధిలోకి తేవాలి. జీరో సేకరణను నియంత్రించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ష్.. ఇక నిశ్శబ్దం!
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. మైకులు మూగబోయాయి.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పార్టీలు ఇన్నాళ్ల ప్రచార సందడిని ఉన్నపళంగా నిలిపివేశాయి. శ -
భారీ మెజార్టీతో భాజపాదే విజయం
[ 12-05-2024]
‘కేసీఆర్.. నీకు శ్రీరాముడి గురించి ఏమి తెలుసు? ముస్లిం ఓట్లే కావాలా? హిందువుల ఓట్లు వద్దా? గతంలోనూ హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే సంజయన్న ఏమి చేసిండో తెలుసు కదా..’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
లక్ష మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు ఖాయం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలలో కరీంనగర్ స్థానంలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును లక్ష ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. -
మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి : కేటీఆర్
[ 12-05-2024]
‘పదేళ్లలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ఆగమైపోయింది.. కాంగ్రెస్, భాజపా మాటలకు మోసపోతే గోసపడతారని కేసీఆర్ ఆనాడే చెప్పారు.. -
పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
[ 12-05-2024]
ఈనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి వెల్లడించారు. -
విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులుండొద్దు
[ 12-05-2024]
పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ వరంగల్ సీజీఎం చౌహాన్ అధికారులను ఆదేశించారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
[ 12-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
[ 12-05-2024]
వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ షేక్యాస్మిన్బాషా అన్నారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులు విత్తనాలు, -
పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం
[ 12-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సామగ్రి, ఓటింగ్ యంత్రాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, -
పోలింగ్ సిబ్బంది మూడో దశ యాదృచ్ఛికీకరణ పూర్తి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది మూడో దశ యాదృచ్ఛికీకరణ పూర్తి చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. సమీకృత పాలనా ప్రాంగణంలో శనివారం ఆన్లైన్లో ర్యాండమైజేషన్ చేపట్టారు. -
ముగిసిన ఈఏపీసెట్
[ 12-05-2024]
సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీసెట్) ప్రవేశ పరీక్షలు శనివారం ముగిశాయి. అయిదు రోజులుగా పరీక్షలు జరుగుతున్నాయి. -
స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
[ 12-05-2024]
ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. -
భద్రత కట్టుదిట్టం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లాకు భారీగా పోలీసు బలగాలను రప్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
ఓటింగ్ శాతాన్ని పకడ్బందీగా నమోదు చేయాలి
[ 12-05-2024]
ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. -
ఇరువురి వాదనలపై ఆర్డీవోకు నివేదిక
[ 12-05-2024]
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదు మేరకు శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన విచారణకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున న్యాయవాదులు హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
-
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
-
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
-
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు
-
కాయ్ రాజా కాయ్.. గెలిచేది కూటమేనోయ్!
-
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి