సుర్రుమంటూ సూరీడు.. ఉసూరుమంటూ నాయకుడు
‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు..
ఎన్నికల ప్రచారంలో భానుడే ప్రత్యర్థి
‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు.. సరాసరి నాలుగు పదులు దాటే ఉష్ణోగ్రత పంచుతుండటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది.. ‘ప్రచారానికి సమయం తక్కువుంది బాసూ..’ అనుకుంటూ అభ్యర్థులు, అనుయాయులు మైకులు అందుకుందామనుకున్నా ఎండదెబ్బతో ప్రజలను పోగు చేయడం సవాలై కూర్చుంది. అందుకే నీడ పట్టున మీటింగ్ ఏర్పాటు చేసి టింగురంగా అనుకుంటూ తమ వాణి వినిపించేందుకు నాయకులు తాపత్రయపడుతున్నారు. ఉదయం 11 లోపే కార్యక్రమాలు ముగించేసుకొని మధ్యాహ్నం ఫంక్షన్ హాళ్లలోనో, ఇతరత్రా గదుల్లోనో ప్రచారం కానిచ్చేస్తున్నారు.
పగటి పూట ప్రణాళికలు
సాయం సంధ్య వేళ అటు సూరీడు మాయం కాగానే ఇటు ప్రచార హడావుడి మొదలు పెడుతున్నారు. అదే సమయంలో చీకటి మాటునే పలు చోట్ల మందుబాబులు వెలుగులోకి వస్తుండటం... కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. మద్యం ప్రభావం పగటి ఎండ కంటే ఘాటైన వేడి తగిలిస్తోందంటూ ప్రచారాన్ని ముగించేస్తున్నారు. ఎన్నికల పర్వంలో నామినేషన్లు, ఉపసంహరణల ఘట్టం ముగియడంతో ప్రచారానికి పదును పెట్టడమే తరువాయిగా నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అధినాయకులు వస్తే ఉదయం గానీ, సాయంత్రం గానీ సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీల వారు మధ్యాహ్నం స్థానిక సమస్యలను పర్యవేక్షించేందుకు సమయాన్ని కేటాయిస్తుంటే, అధికార పక్షం వారు ఇతరత్రా కార్యక్రమాలను డిజైన్ చేసుకుంటున్నారు.
వాతావరణ హెచ్చరికలతో దడ
చాలా మంది నాయకులు చల్లని వేళల్లో ఉపాధిహామీ కూలీల చుట్టూ ఓట్ల ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొంతమంది సూరీడు సుర్రుమంటుండగానే ‘మీ ఓటు మాకే వేయాల’ంటూ ఉదయం నడకకు వచ్చిన ఓటర్లతో ఏకరువు పెట్టుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ ఫోన్లు చేసేద్దామనీ, సామాజిక మాధ్యమాల ప్రభావాలను పసిగడదామనీ ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఏప్రిల్లోనే ఇలా ఉంటే మే నెలలో ఇంకెంత వేడి చూడాల్సి వస్తుందోనంటూ నాయకులు హైరానా పడుతున్నారు. నాలుగైదు రోజుల పాటు సరాసరి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదవుతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు నీడలోనూ నాయకులకు చెమటలు పట్టిస్తున్నాయి. వరాల జల్లులతో ఓటరన్నను తడిసి ముద్ద చేద్దామనుకుంటే భాస్కరుడి భగభగతో తమ ఖద్దరే తడిచిపోతోందంటూ మదనపడుతున్నారు. అకాల వర్షాలు కరుణిస్తేనే తమ ప్రచారానికి మరింత సమయం దొరుకుతుందని నాయకులు చెబుతున్నారు.. ఇక ‘కాలమేదైతేనేమి.. ఎంత ఎండ ఉంటేనేమి..? మేం మాత్రం ఏ ఎండకా గొడుగు పట్టేస్తామం’టూ జంప్ జిలానీలు అటూ ఇటూ దూకేస్తున్నారు. లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లను చుట్టి రావడమంటే మాటలు కాదు. నియోజకవర్గ స్థాయి సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలు... ఇలా ఓట్ల వేటలో తలమునకలైన నాయకులు ఎండలు చూసి తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా అన్ని పార్టీలకు భానుడు కూడా ఓ ప్రత్యర్థిగానే మిగిలిపోవడం ఈ ఎన్నికల ప్రత్యేకమంటూ చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.
న్యూస్టుడే, మేడిపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టుకున్న సొత్తు రూ. 9.17 కోట్లు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నగదుతో పాటు ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. -
శిథిల వంతెనపై తప్పని ప్రయాణం!
[ 16-05-2024]
రామడుగు మండల కేంద్రంలోని మోతెవాగుపై వంతెన శిథిలమవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 1983లో నిర్మించిన వంతెన వరదలకు ఇరువైపులా మట్టి కొట్టుకుపోయింది. -
యువత ఓటింగ్ 37.31 శాతమే!
[ 16-05-2024]
ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత నిర్లిప్తత ప్రదర్శించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.. -
తక్కువ వ్యయంతో అధిక ఫలితాల సాధనకు కృషి
[ 16-05-2024]
సాగులో తక్కువ వ్యయంతో అధిక ఫలితాలు సాధించేందుకు రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన చేస్తున్నారని జమ్మికుంట కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఎన్.వెంకటేశ్వర్రావు అన్నారు. -
ఇంకుడుగుంతపై నిర్లక్ష్యం
[ 16-05-2024]
నగరంలోని భగత్నగర్లో ఒకరు కొత్తగా జీ+2 ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో ఇంకుడుగుంత నిర్మించేందుకు ఫీజు కూడా చెల్లించారు. -
స్వతంత్రుల ప్రభావమెంత?
[ 16-05-2024]
ప్రతి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్న స్వతంత్రులు ఓట్ల సాధనలో మాత్రం నామమాత్రంగానే నిలుస్తున్నారు.. ఈసారీ ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతా వారు ప్రచార ప్రక్రియపై దృష్టి పెట్టింది తక్కువ. -
పరిసరాల పరిశుభ్రతే రక్ష
[ 16-05-2024]
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధుల ముప్పు పొంచిఉంది. విష జ్వరాల బారినుంచి కాపాడుకునేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకం. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరి దుర్మరణం
[ 16-05-2024]
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ప్రమాదవశాత్తు శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్(39) దుర్మరణం చెందాడు. -
ఆదర్శలో ఇంటర్ ప్రవేశాలు
[ 16-05-2024]
ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన.. అధునాతనమైన తరగతి గదులు, ప్రయోగశాలలు.. నిష్ణాతులైన అధ్యాపకులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పిన ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్ తరగతులకు ఆదరణ పెరుగుతోంది. -
భూసారం.. పరీక్షలతో ఫలం
[ 16-05-2024]
రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి. -
సగం మందికే ఉపాధి
[ 16-05-2024]
వేసవి తాపంతోపాటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నప్పటికీ ఉపాధి పనులకు కూలీల జాతర కొనసాగుతుంది. -
బోర్డులే తప్ప.. కనిపించని ఆటలు
[ 16-05-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు, యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గత ప్రభుత్వం పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో డిసెంబరు నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని సరఫరా చేసింది. -
ఉత్పత్తిదారులకు నూలు.. నేతన్నలకు మేలు
[ 16-05-2024]
జాతీయ, అంతర్జాతీయ విపణిలో నూలు ధరల హెచ్చుతగ్గులు జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. -
చివరి దశకు యాసంగి రైతుబంధు పంపిణీ
[ 16-05-2024]
జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు నగదు జమ చివరి దశకు చేరుకుంది. అయిదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సొమ్ము గతంలోనే ఖాతాల్లో వేయగా ఆపై విస్తీర్ణం కలిగిన అన్నదాతలకు సాయం జమ చేస్తున్నట్లు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. -
నత్తనడకన పనులు.. రాకపోకలకు ఇబ్బందులు
[ 16-05-2024]
రద్దీ మార్గంలో లెవెల్ క్రాసింగ్లు ఎత్తివేసేందుకు రైల్వే శాఖ మంజూరు చేసిన పై వంతెన(ఆర్వోబీ)ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం