యువత.. కురిపించాలి మమత
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు.
ప్రసన్నం చేసుకోవడానికి నాయకుల ప్రచార వ్యూహాలు
3 నియోజకవర్గాల్లో 46 శాతానికి పైగా యువ ఓటర్లు
ఈనాడు, కరీంనగర్
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. అదే సమయంలో యువ ఓటర్లకు గాలం వేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. గడిచిన రెండు దశాబ్దాలతో పోలిస్తే అన్ని నియోజకవర్గాల్లో ఈసారి 18-39 ఏళ్ల వయసు ఓటర్లే దాదాపు 46 శాతానికి మించి ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అవుతున్నారు. రోడ్షోలు, సమావేశాలకు మహిళలు వస్తున్నా.. అందులో యువత ఎక్కువగా ఉండేలా లెక్కలేసుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఓట్లు మూడు పార్టీలకు కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తరువాత కొత్తగా ఓటు హక్కును పొందిన వారే దాదాపు 2 లక్షల మంది వరకు ఉండటం యువత ప్రాధాన్యతను చాటుతోంది. అందుకే అభ్యర్థులందరూ పార్టీలో చేరికలు సహా ఇతర ఏ కార్యక్రమమైనా వారికే పెద్దపీట వేస్తున్నారు. ఇక ప్రతి ఎన్నికల సమయంలో పెరిగిన ఓట్ల సంఖ్య అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. పెరిగిన ఓట్ల ప్రభావం ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా నమోదైన ఓట్లను తమవైపు మలచుకునేందుకు ప్రణాళికాయుతంగా ముందడుగేస్తున్నారు.
తమవైపు తిప్పుకొనేందుకు పాట్లు
కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్సభ స్థానాల పరిధిలో గ్రామాల వారీగా యువ ఓటర్లు ఎంత మంది ఉన్నారనే అంచనాతో ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. మొత్తం 5,843 పోలింగ్ బూత్ల వారీగా అంచనా రూపొందిస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 18-39 ఏళ్లలోపు వయసు వారు 300-400 మంది ఉంటారు. ఈ లెక్కన ప్రతి లోక్సభ స్థానం పరిధిలో దాదాపు 7 లక్షల మంది యువ ఓటర్లుంటారు. వీరికి గాలం వేయడానికి నాయకులు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు, ఇతర అంశాలపై తమ పార్టీ విధానాలను వివరిస్తూ ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నారు.
ప్రభావిత వర్గంపై కన్ను
అలాగే గ్రామాల వారీగా బూత్ కమిటీలు, ఇతరత్రా పార్టీ కలాపాల్లో యువ భాగస్వామ్యం ఉండేలా ముఖ్య నాయకులు చొరవ చూపుతున్నారు. ఊరిలో ప్రభావితం చేయగలిగిన యువత కోరితే ఏదైనా చేస్తామనే భరోసా ఇస్తూనే ఖర్చుల నిమిత్తం వారికి ఎంతో కొంత ముట్టచెబుతున్నారు. గ్రామాల వారీగా యువజన సంఘాల సభ్యులు, ఇతర నాయకులు తమ వద్దకు వచ్చి కలిస్తే వారికి భోజనాలు సమకూర్చడంతో పాటు ఖర్చులకు డబ్బులు చేతిలో పెడుతున్నారు. మొత్తమ్మీద ‘యువతే తమ బలం.. బలగం..’ అనేలా నాయకులు వ్యూహాత్మక ధోరణిని క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టుకున్న సొత్తు రూ. 9.17 కోట్లు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నగదుతో పాటు ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. -
శిథిల వంతెనపై తప్పని ప్రయాణం!
[ 16-05-2024]
రామడుగు మండల కేంద్రంలోని మోతెవాగుపై వంతెన శిథిలమవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 1983లో నిర్మించిన వంతెన వరదలకు ఇరువైపులా మట్టి కొట్టుకుపోయింది. -
యువత ఓటింగ్ 37.31 శాతమే!
[ 16-05-2024]
ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత నిర్లిప్తత ప్రదర్శించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.. -
తక్కువ వ్యయంతో అధిక ఫలితాల సాధనకు కృషి
[ 16-05-2024]
సాగులో తక్కువ వ్యయంతో అధిక ఫలితాలు సాధించేందుకు రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన చేస్తున్నారని జమ్మికుంట కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఎన్.వెంకటేశ్వర్రావు అన్నారు. -
ఇంకుడుగుంతపై నిర్లక్ష్యం
[ 16-05-2024]
నగరంలోని భగత్నగర్లో ఒకరు కొత్తగా జీ+2 ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో ఇంకుడుగుంత నిర్మించేందుకు ఫీజు కూడా చెల్లించారు. -
స్వతంత్రుల ప్రభావమెంత?
[ 16-05-2024]
ప్రతి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్న స్వతంత్రులు ఓట్ల సాధనలో మాత్రం నామమాత్రంగానే నిలుస్తున్నారు.. ఈసారీ ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతా వారు ప్రచార ప్రక్రియపై దృష్టి పెట్టింది తక్కువ. -
పరిసరాల పరిశుభ్రతే రక్ష
[ 16-05-2024]
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధుల ముప్పు పొంచిఉంది. విష జ్వరాల బారినుంచి కాపాడుకునేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకం. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరి దుర్మరణం
[ 16-05-2024]
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ప్రమాదవశాత్తు శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్(39) దుర్మరణం చెందాడు. -
ఆదర్శలో ఇంటర్ ప్రవేశాలు
[ 16-05-2024]
ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన.. అధునాతనమైన తరగతి గదులు, ప్రయోగశాలలు.. నిష్ణాతులైన అధ్యాపకులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పిన ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్ తరగతులకు ఆదరణ పెరుగుతోంది. -
భూసారం.. పరీక్షలతో ఫలం
[ 16-05-2024]
రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి. -
సగం మందికే ఉపాధి
[ 16-05-2024]
వేసవి తాపంతోపాటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నప్పటికీ ఉపాధి పనులకు కూలీల జాతర కొనసాగుతుంది. -
బోర్డులే తప్ప.. కనిపించని ఆటలు
[ 16-05-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు, యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గత ప్రభుత్వం పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో డిసెంబరు నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని సరఫరా చేసింది. -
ఉత్పత్తిదారులకు నూలు.. నేతన్నలకు మేలు
[ 16-05-2024]
జాతీయ, అంతర్జాతీయ విపణిలో నూలు ధరల హెచ్చుతగ్గులు జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. -
చివరి దశకు యాసంగి రైతుబంధు పంపిణీ
[ 16-05-2024]
జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు నగదు జమ చివరి దశకు చేరుకుంది. అయిదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సొమ్ము గతంలోనే ఖాతాల్లో వేయగా ఆపై విస్తీర్ణం కలిగిన అన్నదాతలకు సాయం జమ చేస్తున్నట్లు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. -
నత్తనడకన పనులు.. రాకపోకలకు ఇబ్బందులు
[ 16-05-2024]
రద్దీ మార్గంలో లెవెల్ క్రాసింగ్లు ఎత్తివేసేందుకు రైల్వే శాఖ మంజూరు చేసిన పై వంతెన(ఆర్వోబీ)ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
-
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
-
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
-
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు