కమల దళంలో మారిన సమీకరణలు
పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత బోర్లకుంట వెంకటేశ్నేత భాజపా గూటికి చేరారు.
భాజపా గూటికి ఎంపీ వెంకటేశ్నేత
ఈనాడు, పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత బోర్లకుంట వెంకటేశ్నేత భాజపా గూటికి చేరారు. సోమవారం ఆయన హైదరాబాద్లో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో మంథని నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ నేత చల్లా నారాయణరెడ్డి సైతం భాజపాలో చేరారు.
83 రోజులకే బయటకు..
వెంకటేశ్నేత 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ భారాస అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఫిబ్రవరి 6న దిల్లీలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అయితే పార్టీ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఎక్కడా హాజరు కాలేదు. ఎంపీ టికెట్ ఇస్తారనే స్పష్టమైన హామీ మేరకే ఆయన కాంగ్రెస్లో చేరినట్లు సమాచారం. కాగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తన కొడుకు వంశీకృష్ణకు పార్టీ టికెట్ దక్కేలా చక్రం తిప్పారు. మరోవైపు భాజపా అధిష్ఠానం నేతకాని సామాజికవర్గానికి చెందిన గోమాసె శ్రీనివాస్కు మార్చి 13న టికెట్ కేటాయించింది. అయినప్పటికీ వారం రోజుల కిందటి వరకు బీఫామ్ ఇవ్వకపోవడంతో మరోమారు వెంకటేశ్నేత పేరు తెరపైకి వచ్చింది. ఆయన భాజపాలో చేరి బీఫామ్ తీసుకుంటారన్న వార్తలు వినిపించాయి. వెంకటేశ్నేత పలుమార్లు కిషన్రెడ్డిని కలవడం ఇందుకు బలం చేకూర్చింది. అయితే అప్పటికే గోమాసె పేరు ప్రకటించడం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కూడా ఆయనకే ఇవ్వాలని పట్టుబట్టడంతో మరోమారు వెంకటేశ్నేతకు నిరాశే మిగిలింది.
ఫలించిన సామాజికవర్గ మంత్రాంగం
నేతకాని సామాజికవర్గ పెద్దలు పలుమార్లు వెంకటేశ్ నేతను సంప్రదించారు. తమ వర్గానికి చెందిన ఓట్లు చీలకుండా భాజపాలో చేరి గోమాసెకు మద్దతు పలకాలని కోరారు. దీంతో ఎంపీ మరోసారి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. భవిష్యత్తులో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భాజపా కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు స్పష్టమై హామీ ఇవ్వడం వల్లే చేరానని ఎంపీ వెంకటేశ్నేత ‘ఈనాడు’తో పేర్కొన్నారు. ప్రధాని మోదీ దార్శనికత, సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, హిందూ ధర్మ రక్షణ కార్యక్రమాలతో కేంద్రంలో మూడోసారి భాజపా అధికారంలోకి రావడం ఖాయ మన్నారు. త్వరలో పెద్దపల్లిలో జిల్లా అధ్యక్షుడు సునీల్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టుకున్న సొత్తు రూ. 9.17 కోట్లు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నగదుతో పాటు ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. -
శిథిల వంతెనపై తప్పని ప్రయాణం!
[ 16-05-2024]
రామడుగు మండల కేంద్రంలోని మోతెవాగుపై వంతెన శిథిలమవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 1983లో నిర్మించిన వంతెన వరదలకు ఇరువైపులా మట్టి కొట్టుకుపోయింది. -
యువత ఓటింగ్ 37.31 శాతమే!
[ 16-05-2024]
ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత నిర్లిప్తత ప్రదర్శించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.. -
తక్కువ వ్యయంతో అధిక ఫలితాల సాధనకు కృషి
[ 16-05-2024]
సాగులో తక్కువ వ్యయంతో అధిక ఫలితాలు సాధించేందుకు రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన చేస్తున్నారని జమ్మికుంట కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఎన్.వెంకటేశ్వర్రావు అన్నారు. -
ఇంకుడుగుంతపై నిర్లక్ష్యం
[ 16-05-2024]
నగరంలోని భగత్నగర్లో ఒకరు కొత్తగా జీ+2 ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో ఇంకుడుగుంత నిర్మించేందుకు ఫీజు కూడా చెల్లించారు. -
స్వతంత్రుల ప్రభావమెంత?
[ 16-05-2024]
ప్రతి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్న స్వతంత్రులు ఓట్ల సాధనలో మాత్రం నామమాత్రంగానే నిలుస్తున్నారు.. ఈసారీ ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతా వారు ప్రచార ప్రక్రియపై దృష్టి పెట్టింది తక్కువ. -
పరిసరాల పరిశుభ్రతే రక్ష
[ 16-05-2024]
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధుల ముప్పు పొంచిఉంది. విష జ్వరాల బారినుంచి కాపాడుకునేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకం. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరి దుర్మరణం
[ 16-05-2024]
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ప్రమాదవశాత్తు శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్(39) దుర్మరణం చెందాడు. -
ఆదర్శలో ఇంటర్ ప్రవేశాలు
[ 16-05-2024]
ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన.. అధునాతనమైన తరగతి గదులు, ప్రయోగశాలలు.. నిష్ణాతులైన అధ్యాపకులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పిన ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్ తరగతులకు ఆదరణ పెరుగుతోంది. -
భూసారం.. పరీక్షలతో ఫలం
[ 16-05-2024]
రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి. -
సగం మందికే ఉపాధి
[ 16-05-2024]
వేసవి తాపంతోపాటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నప్పటికీ ఉపాధి పనులకు కూలీల జాతర కొనసాగుతుంది. -
బోర్డులే తప్ప.. కనిపించని ఆటలు
[ 16-05-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు, యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గత ప్రభుత్వం పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో డిసెంబరు నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని సరఫరా చేసింది. -
ఉత్పత్తిదారులకు నూలు.. నేతన్నలకు మేలు
[ 16-05-2024]
జాతీయ, అంతర్జాతీయ విపణిలో నూలు ధరల హెచ్చుతగ్గులు జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. -
చివరి దశకు యాసంగి రైతుబంధు పంపిణీ
[ 16-05-2024]
జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు నగదు జమ చివరి దశకు చేరుకుంది. అయిదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సొమ్ము గతంలోనే ఖాతాల్లో వేయగా ఆపై విస్తీర్ణం కలిగిన అన్నదాతలకు సాయం జమ చేస్తున్నట్లు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. -
నత్తనడకన పనులు.. రాకపోకలకు ఇబ్బందులు
[ 16-05-2024]
రద్దీ మార్గంలో లెవెల్ క్రాసింగ్లు ఎత్తివేసేందుకు రైల్వే శాఖ మంజూరు చేసిన పై వంతెన(ఆర్వోబీ)ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
-
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
-
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
-
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు