ఎన్నికల బరిలో 99మంది
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది..
కరీంనగర్లో 28.. పెద్దపల్లిలో 42.. నిజామాబాద్లో 29 మంది
15 నామినేషన్ల ఉపసంహరణ
నిజామాబాద్ : అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు, చిత్రంలో అదనపు పాలనాధికారి అంకిత్, సాధారణ పరిశీలకురాలు ఎలిస్వజ్, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్
కరీంనగర్ (ఈనాడు), పెద్దపల్లి కలెక్టరేట్, నిజామాబాద్ కలెక్టరేట్ (న్యూస్టుడే) : ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది.. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులతోపాటు ఇతర గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రులకు ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయించారు. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ స్థానంలో ఈసారి రసవత్తర పోరు జరగనుంది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో భారీగానే అభ్యర్థులు ఎన్నికలకు సై అన్నారు. కరీంనగర్ స్థానంలో 28 మంది పోటీ పడుతుండగా.. పెద్దపల్లి లోక్సభ స్థానానికి 42 మంది రంగంలో ఉన్నారు. ఇక నిజామాబాద్లోనూ 29 మంది అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీలో నిలిచారు. కరీంనగర్లో అయిదుగురు, పెద్దపల్లిలో ఏడుగురు, నిజామాబాద్లో కేవలం ముగ్గురు మాత్రమే పోటీ నుంచి వైదొలిగారు.
రెండు.. మూడు ఈవీఎం బ్యాలెట్లు..
కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో రెండు చొప్పున, పెద్దపల్లిలో మూడు ఈవీఎం బ్యాలెట్లను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఒక ఈవీఎం బ్యాలెట్లో గరిష్ఠంగా 16 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. 15 మంది అభ్యర్థులతోపాటు నోటా కలిపి ఒకటి ఏర్పాటు చేస్తారు. 15 మంది, అంతకకన్నా తక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే నోటాతో కలిపి ఒక ఈవీఎం సరిపోతుంది. కానీ కరీంనగర్లో 28 మంది ఉండటం వల్ల రెండో ఈవీఎం ఏర్పాటు అనివార్యమైంది. ఇదే విధంగా నిజామాబాద్లోనూ 29 మంది ఉండటంతో అక్కడా ఇదే పరిస్థితి. ఇక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మాత్రం 42 మంది అభ్యర్థులు ఉండటం వల్ల మూడో ఈవీఎం బ్యాలెట్ను వినియోగించాల్సి వస్తోంది. ఈ దిశగా జిల్లా ఎన్నికల అధికారులు అదనంగా అవసరమైన బ్యాలెట్ ఈవీఎంల కోసం రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందించి వాటిని త్వరలో తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇతర అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. అభ్యర్థుల పేర్లలోని మొదటి అక్షర క్రమంలో బ్యాలెట్లో వారికి వరుస సంఖ్యను కేటాయించారు.
కరీంనగర్లో..
బండి సంజయ్కుమార్ (భాజపా), బోయినపల్లి వినోద్కుమార్ (భారాస), వెలిచాల రాజేందర్రావు (కాంగ్రెస్), మారెపల్లి మొగిలయ్య(బీఎస్పీ)లు ప్రధాన పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. వీరికి పోటీగా గుర్తింపు పొందిన పార్టీల తరపున చింత అనిల్కుమార్ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), తాళ్లపల్లి అరుణ (అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ) పంచిక అశోక్ (సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా), గట్టు రాణా ప్రతాప్ (సోషలిస్ట్ పార్టీ ఇండియా), పెద్దపల్లి శ్రవణ్ (భారతీయ యువకుల దళం), కడ్తాల అనిల్రెడ్డి (నేషనల్ నవక్రాంతి పార్టీ), పొడిశెట్టి సమయ్య (బహుజన ముక్తి పార్టీ), చిలువేరు శ్రీకాంత్(ధర్మసమాజ్ పార్టీ), చీకోటి వరుణ్కుమార్ గుప్తా (తెలుగు కాంగ్రెస్ పార్టీ)లు రంగంలో నిలిచారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా పేరాల మానస, ద్యాగల వెంకట నర్సయ్య, కట్కూరి అనోస్, వేముల విక్రంరెడ్డి, శివరాత్రి శ్రీనివాస్, గడ్డ సతీశ్, బరిగె గట్టయ్య యాదవ్, గుడిసె మోహన్, మేకల అక్షయ్కుమార్, కోట శ్యాంకుమార్, పోతూరి రాజేందర్, గవ్వల లక్ష్మి, అబ్బడి బుచ్చిరెడ్డి, దేవునూరి శ్రీనివాస్, రాపోల్ రామ్ కుమార్ భరద్వాజ్లు పోటీకి సిద్ధమయ్యారు.
నిజామాబాద్ స్థానంలో..
ధర్మపురి అర్వింద్ (భాజపా), బాజిరెడ్డి గోవర్ధన్ (భారాస), తాటిపర్తి జీవన్రెడ్డి (కాంగ్రెస్), లింబాద్రి (బీఎస్పీ), అశోక్గౌడ్ (బహుజన లెఫ్ట్), అలీ మన్సూర్ (అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్), సుమన్ (డీఎస్పీ), సాయి కృష్ణమూర్తి (యుగ తులసి), నగేష్ (దళిత బహుజన), దేవతి శ్రీనివాస్ (బహుజన ముక్తి), భూక్యా నందు (విద్యార్థుల రాజకీయ పార్టీ), రాజ్ కుమార్ (ఇండియా ప్రజాబంధు), యోగేందర్ (అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ), ఆరె రాజేందర్, కొత్త కొండ శక్తిప్రసాద్, కోటగిరి శ్రీనివాస్, గంట చరితారావు, గోపి చంద్రయ్య, జీవన్రెడ్డి, లక్ష్మీనారాయణ, బీబీ నాయక్, సాయి నిఖిల్, ప్రశాంత్, మలావత్ విఠల్, రాగి అనిల్, రాపల్లి సత్యనారాయణ, రేపల్లి శ్రీనివాస్, విక్రమ్రెడ్డి, సయ్యద్ అస్గర్ (స్వతంత్రులు) బరిలో ఉన్నారు.
పెద్దపల్లిలో మిగిలింది వీరే..
పెద్దపల్లిలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల నుంచి ఇరుకుల్ల రాజనర్సయ్య(బీఎస్పీ), ఈశ్వర్ కొప్పుల(భారాస), వంశీకృష్ణ గడ్డం(కాంగ్రెస్), శ్రీనివాస్ గోమాసె(భాజపా), రిజిస్టర్డు పార్టీల నుంచి ఇరుగురాల భాగ్యలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), ఎ.సుమలత(అలయన్స్ డెమోక్రటిక్ రీఫార్మ్స్), కనకయ్య ములకల(సోషలిస్ట్ పార్టీ-ఇండియా), కాశి సతీశ్కుమార్ (యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ), కంది చందు(రాష్ట్రీయ మానవ్), చిలుక ఆనంద్(యువతరం), దుర్గం సంతోష్ (ప్రజారాజ్యసమితి), రామ్చందర్ నిచ్చకోల(దళిత బహుజన), మొలుగు వెంకటేశ్ (న్యూ ఇండియా), మోతె నరేశ్(పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా(డెమోక్రటిక్), రమేశ్ మంద(ధర్మ సమాజ్ పార్టీ), మొయ్యి వేణుగోపాల్(బహుజన్ ముక్తి), స్వతంత్రులుగా అక్కపాక తిరుపతి, ఆర్నకొండ రాజు, ఇరికిల్ల రాజేశ్, కె.సందీప్, కాదాసి శేఖర్, కుర్మ మహేందర్, లింగమూర్తి కొంకటి, గడ్డం మారుతి, చందనగిరి శ్రీనివాస్, జూపాక కిరణ్, తాళ్లపల్లి నరేశ్, దాగం శ్రీనివాస్, దుర్గం రాములు, దూడ మహిపాల్, జనగామ నరేశ్, నవీన్ నూకల, బూడిద తిరుపతి, బొట్ల చంద్రయ్య, మామిడిపెల్లి బాపయ్య, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, అక్షయ్కుమార్ మేకల, రాజేశం రాచర్ల, దుర్గం రాజన్న, రాముల కార్తీక్, ప్రొఫెసర్ నతానియేలు, శ్రీనివాస్ పంతుకాల బరిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టుకున్న సొత్తు రూ. 9.17 కోట్లు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నగదుతో పాటు ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. -
శిథిల వంతెనపై తప్పని ప్రయాణం!
[ 16-05-2024]
రామడుగు మండల కేంద్రంలోని మోతెవాగుపై వంతెన శిథిలమవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 1983లో నిర్మించిన వంతెన వరదలకు ఇరువైపులా మట్టి కొట్టుకుపోయింది. -
యువత ఓటింగ్ 37.31 శాతమే!
[ 16-05-2024]
ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత నిర్లిప్తత ప్రదర్శించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.. -
తక్కువ వ్యయంతో అధిక ఫలితాల సాధనకు కృషి
[ 16-05-2024]
సాగులో తక్కువ వ్యయంతో అధిక ఫలితాలు సాధించేందుకు రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన చేస్తున్నారని జమ్మికుంట కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఎన్.వెంకటేశ్వర్రావు అన్నారు. -
ఇంకుడుగుంతపై నిర్లక్ష్యం
[ 16-05-2024]
నగరంలోని భగత్నగర్లో ఒకరు కొత్తగా జీ+2 ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో ఇంకుడుగుంత నిర్మించేందుకు ఫీజు కూడా చెల్లించారు. -
స్వతంత్రుల ప్రభావమెంత?
[ 16-05-2024]
ప్రతి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్న స్వతంత్రులు ఓట్ల సాధనలో మాత్రం నామమాత్రంగానే నిలుస్తున్నారు.. ఈసారీ ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతా వారు ప్రచార ప్రక్రియపై దృష్టి పెట్టింది తక్కువ. -
పరిసరాల పరిశుభ్రతే రక్ష
[ 16-05-2024]
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధుల ముప్పు పొంచిఉంది. విష జ్వరాల బారినుంచి కాపాడుకునేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకం. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరి దుర్మరణం
[ 16-05-2024]
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ప్రమాదవశాత్తు శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్(39) దుర్మరణం చెందాడు. -
ఆదర్శలో ఇంటర్ ప్రవేశాలు
[ 16-05-2024]
ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన.. అధునాతనమైన తరగతి గదులు, ప్రయోగశాలలు.. నిష్ణాతులైన అధ్యాపకులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పిన ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్ తరగతులకు ఆదరణ పెరుగుతోంది. -
భూసారం.. పరీక్షలతో ఫలం
[ 16-05-2024]
రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి. -
సగం మందికే ఉపాధి
[ 16-05-2024]
వేసవి తాపంతోపాటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నప్పటికీ ఉపాధి పనులకు కూలీల జాతర కొనసాగుతుంది. -
బోర్డులే తప్ప.. కనిపించని ఆటలు
[ 16-05-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు, యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గత ప్రభుత్వం పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో డిసెంబరు నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని సరఫరా చేసింది. -
ఉత్పత్తిదారులకు నూలు.. నేతన్నలకు మేలు
[ 16-05-2024]
జాతీయ, అంతర్జాతీయ విపణిలో నూలు ధరల హెచ్చుతగ్గులు జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. -
చివరి దశకు యాసంగి రైతుబంధు పంపిణీ
[ 16-05-2024]
జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు నగదు జమ చివరి దశకు చేరుకుంది. అయిదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సొమ్ము గతంలోనే ఖాతాల్లో వేయగా ఆపై విస్తీర్ణం కలిగిన అన్నదాతలకు సాయం జమ చేస్తున్నట్లు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. -
నత్తనడకన పనులు.. రాకపోకలకు ఇబ్బందులు
[ 16-05-2024]
రద్దీ మార్గంలో లెవెల్ క్రాసింగ్లు ఎత్తివేసేందుకు రైల్వే శాఖ మంజూరు చేసిన పై వంతెన(ఆర్వోబీ)ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?