ప్రధాని ముఖంలో ఓటమి భయం
అబద్ధాల సర్దార్..మౌని బాబా ప్రధాని నరేంద్ర మోదీ ముఖంలో ఓటమి భయం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని లోక్సభ మాజీ సభ్యుడు వి.ఎస్.ఉగ్రప్ప తెలిపారు.
రాష్ట్రంలో 20 స్థానాల్లో గెలుపొందుతాం
మాట్లాడుతున్న లోక్సభ మాజీ సభ్యుడు వి.ఎస్.ఉగ్రప్ప, చిత్రంలో వెంకటేశ్ హెగ్డె,
డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, కల్లుకంబ పంపాపతి, గాదెప్ప
బళ్లారి, న్యూస్టుడే: అబద్ధాల సర్దార్..మౌని బాబా ప్రధాని నరేంద్ర మోదీ ముఖంలో ఓటమి భయం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని లోక్సభ మాజీ సభ్యుడు వి.ఎస్.ఉగ్రప్ప తెలిపారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఈ ఎన్నికలు రెండో స్వతంత్ర సంగ్రామంగా జరుగుతున్నాయని చెప్పారు. రాజ్యాంగంపై నమ్మకం లేని భాజపాతో కాంగ్రెస్ తలపడుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ఐదు గ్యారంటీలను ప్రవేశపెట్టామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరో 25 గ్యారంటీలను కూడా ప్రవేశపెడతామన్నారు. 2018 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 165 హామీలను పూర్తి చేశాం. 2014, 2019లో లోక్సభ ఎన్నికల సందర్భంలో ప్రకటించిన భాజపా ఒక్క హామీ కూడా పరిష్కరించలేదన్నారు. శ్రీమంతులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. దేశంలో ఎన్.డి.ఎ.కి ఎదురుగాలి వీస్తోంది. మేకపోతు గాంభీర్యంతో దేశంలో 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని విమర్శించారు. కర్ణాటకలో తమ పార్టీ 20 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతారని జోస్యం చెప్పారు.
కోర్టు చీవాట్లతో కరవు నిధులు విడుదల
కర్ణాటకపై కేంద్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. మొత్తం ఎన్.డి.ఆర్.ఎఫ్. ప్రకారం కరవు నష్టం రూ.4,663 కోట్లు, మొత్తం నష్టం రూ.18,171 కోట్ల నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి గతేడాది అక్టోబరులో నివేదిక సమర్పించినా నిధులు విడుదల చేయలేదని ఉగ్రప్ప ధ్వజమెత్తారు. కోర్టుకు వెళ్లడంతో కేంద్రానికి చీవాట్లు పెట్టిన తర్వాత ప్రస్తుతం రూ.3,454 కోట్లు విడుదల చేశారన్నారు. బళ్లారి లోక్సభ నియోజకవర్గం నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో పార్టీ అధిష్ఠాన నిర్ణయమని చెప్పారు. ప్రస్తుతం బరిలో ఉన్న లోక్సభ అభ్యర్థి ఇ.తుకారామ్ గెలుపొందడం నూటికి నూరు శాతం కచ్చితమన్నారు. డీడీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, కల్లకంబ పంపాపతి, పి.గాదెప్ప, లోకేష్కుమార్, వెంకటేశ్ హెగ్డె పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నియమావళి చట్రంలోనే ప్రగతి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలో ముగిసినా ఇంకా నాలుగు విడతల ఎన్నికలు దేశవ్యాప్తంగా నిర్వహించాలి. ఈ ఎన్నికల ఫలితాల విడుదలైన రెండు రోజుల వరకు నియమావళి అమలులో ఉంటుంది. జూన్ ఆరోతేదీ వరకు నిబంధనలను పాటించాల్సిందే. -
భాజపాదే సంపూర్ణ విజయం
[ 12-05-2024]
మిత్రపక్షం జనతాదళ్తో కలిసి కర్ణాటకలో 28 లోక్సభ నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తామని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర ధీమా వ్యక్తం చేశారు. -
మోదీ సాధనలేవీ?
[ 12-05-2024]
అబద్ధాలు చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరితేరినా.. ప్రజల మనోభావాలతో ఆయన చెలగాటమాడటాన్ని అందరూ గుర్తించారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
వికృత నేరాల రూపం
[ 12-05-2024]
కొడగు జిల్లాలో సంచలనం సృష్టించిన సూర్లబ్బి సమీపంలోని కుంబారగడిగె గ్రామానికి చెందిన మీనా (16) హత్య కేసు కొత్త మలుపుతిరిగింది. ఆమె తలను తనతో తీసుకు వెళ్లిన నిందితుడు హొన్నండ ప్రకాశ్ (32).. -
మానవత్వానికే మచ్చ
[ 12-05-2024]
నగదు కోసం ముగ్గురిని అపహరించి, వారిపై భౌతిక దాడి చేసి, మర్మావయవాలకు విద్యుత్తు షాక్ ఇచ్చిన రమేశ్ అనే వ్యక్తిని, అతని అనుచరులను కలబురగి విశ్వవిద్యాలయం ఠాణా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
ప్రజ్వల్కు మోదీనే రక్ష: కాంగ్రెస్
[ 12-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రక్షిస్తున్నారని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజ్వల్ వద్ద ఉన్న డిప్లమేటిక్ పాస్పోర్టును రద్దు చేస్తే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో భారత్కు తిరిగి వస్తారని... -
ఆత్మాభిమానంతోనే బానిసత్వ విముక్తి
[ 12-05-2024]
ఆత్మాభిమానం లేకపోతే బానిసలుగా మారవలసి ఉంటుందని- అది సాధించిన నాడే స్వేచ్ఛ సాధ్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటే ఇతరులకు బానిసలుగా ఉంటూ, భజన చేయవలసిన అవసరం ఉండదన్నారు. -
ఎస్ఎం కృష్ణకు కొనసాగుతున్న చికిత్స
[ 12-05-2024]
వయోసహజమైన ఆరోగ్య సమస్యలతో మణిపాల్ ఆసుపత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు వైద్యులు చికిత్సను కొనసాగిస్తున్నారు. -
వారి ఓటమికి.. అదే కారణం : ఎంబీ
[ 12-05-2024]
అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కాకుండానే తాము రామునికి గుడి కట్టామని చేసుకున్న ప్రచారమే భాజపా ఓటమికి కారణమవుతుందని మంత్రి ఎంబీ పాటిల్ పేర్కొన్నారు. -
కూటమికి ఓటేస్తేనే ‘ఆంధ్ర’కు బలిమి!
[ 12-05-2024]
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేపట్టి మనకు, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు వారు పేర్కొన్నారు.