అమాత్యులకు పరువు.. ఆయనకు రాజకీయ మలుపు
బళ్లారి లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాం గెలుపును బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, జమీర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
బళ్లారిలో కాంగ్రెస్, భాజపా పోటాపోటీ
బళ్లారి, న్యూస్టుడే: బళ్లారి లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాం గెలుపును బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, జమీర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు తమ రాజకీయం భవిష్యత్తును నిర్దేశిస్తుందని గెలుపు కోసం శ్రమిస్తున్నారు. భాజపా అభ్యర్థి బి.శ్రీరాములుకు ఈ ఎన్నిక రాజకీయ పునర్జన్మ ఇస్తుందని భావిస్తున్నారు. బళ్లారి లోక్సభ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది విధానసభ నియోజక వర్గాలు ఉండగా, వాటిలో ఆరు విధానసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గతేడాది ముందు జరిగిన విధానసభ ఎన్నికల కంటే ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావాలని ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు కె.పి.సి.సి. అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు లక్ష్యాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు వారు ఎక్కడికి వెళ్లకుండా వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు. ఇ.తుకారామ్ తనదైన శైలితో లోక్సభ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. తుకారామ్ సతీమణి అన్నపూర్ణ, కుమారుడు, కుమార్తెలూ ఓటర్లను కలిసి అభ్యర్థిస్తున్నారు. శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కార్యక్రమం విజయవంతం చేశారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ విజయనగర జిల్లాలో పర్యటించనున్నారు. బళ్లారి జిల్లా బాధ్య మంత్రి బి.నాగేంద్ర ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇ.తుకారామ్ గెలుపొంది, పార్లమెంట్కు పంపితే పూర్తి కాలం మంత్రి పదవిలో కొనసాగుతారు. లేకుంటే 30 నెలలు తర్వాత ఇ.తుకారామ్కు అవకాశం ఇవ్వాలని మొదట్లో ఒప్పందం జరిగింది. మరో మంత్రి జమీర్ కూడా విజయనగర జిల్లాలో ప్రచారం చేస్తున్నారు.
భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు
భాజపా అభ్యర్థి బి.శ్రీరాములుకు రాజకీయ అనుభవం ఉండటంతో అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి రెండు విడతల ప్రచారం పూర్తి చేశారు. నిత్యం సముదాయాల వారీగా సమావేశాలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. * ఇదివరకటి భాజపా ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం ఉంది. వాల్మీకి సముదాయంలో బలమైన నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు. మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి భాజపాలో చేరినా..ఆయన బళ్లారికి రావడానికి అవకాశం లేకపోవడంతో ఆయన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.
- నేడు ప్రధాని నరేంద్ర మోదీ విజయనగర జిల్లాకు రానున్నారు. గత విధానసభ ఎన్నికల్లో ప్రధాని బళ్లారికి వచ్చినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లింలు, దళితలు, కురుబ సముదాయం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో కష్టంగా మారింది.
కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారామ్
అనుకూల అంశాలు: ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, నియోజకవర్గం అభివృద్ధి చేశారు. కొంత కాలం పాటు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. మంత్రి సంతోష్ ఎస్.లాడ్ కొండంత బలం ఉంది.
- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు గ్యారంటీలు
- నాలుగు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన అనుభవం. లోక్సభ నియోజకవర్గంలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం ఉంది.
- ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలపై వెంటనే స్పందిస్తారు.
ప్రతికూల అంశాలు: మొదటి సారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
- పార్టీలో అంతర్గత భేదాభిÅప్రాయాలు
- ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో ఓటర్లను కలవడం కష్టంగా మారడం.
అనుకూలం అంశాలు
- ఈ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా పని చేసిన అనుభవం ఉంది.
- విధానసభ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ విధానసభ నియోజకవర్గం ఓటమిపాలైన సానుభూతి
- మాజీ మంత్రి, అత్యంత ఆప్తుడు గాలి జనార్దన్రెడ్డి భాజపాలోకి చేరడం
- నియోజకవర్గంలో వివిధ సముదాయం ప్రజలతో మంచి సంబంధాలు.
ప్రతికూల అంశాలు:
- ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి.
- లోక్సభ నియోజకవర్గంలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటం.
- భాజపాలో నేతలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం.
- గ్యారంటీల భయం ఎక్కువగా ఉంది.
- గాలి జనార్దన్రెడ్డి భాజపాలోకి చేరినా..ఆయన జిల్లాలోకి ప్రవేశం లేకపోవడం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వికృత నేరాల రూపం.. కొడగు బాలిక కేసు కొత్తమలుపు
[ 12-05-2024]
కొడగు జిల్లాలో సంచలనం సృష్టించిన సూర్లబ్బి సమీపంలోని కుంబారగడిగె గ్రామానికి చెందిన మీనా (16) హత్య కేసు కొత్త మలుపుతిరిగింది. ఆమె తలను తనతో తీసుకు వెళ్లిన నిందితుడు హొన్నండ ప్రకాశ్ (32).. -
నియమావళి చట్రంలోనే ప్రగతి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలో ముగిసినా ఇంకా నాలుగు విడతల ఎన్నికలు దేశవ్యాప్తంగా నిర్వహించాలి. ఈ ఎన్నికల ఫలితాల విడుదలైన రెండు రోజుల వరకు నియమావళి అమలులో ఉంటుంది. జూన్ ఆరోతేదీ వరకు నిబంధనలను పాటించాల్సిందే. -
భాజపాదే సంపూర్ణ విజయం
[ 12-05-2024]
మిత్రపక్షం జనతాదళ్తో కలిసి కర్ణాటకలో 28 లోక్సభ నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తామని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర ధీమా వ్యక్తం చేశారు. -
మోదీ సాధనలేవీ?
[ 12-05-2024]
అబద్ధాలు చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరితేరినా.. ప్రజల మనోభావాలతో ఆయన చెలగాటమాడటాన్ని అందరూ గుర్తించారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
మానవత్వానికే మచ్చ
[ 12-05-2024]
నగదు కోసం ముగ్గురిని అపహరించి, వారిపై భౌతిక దాడి చేసి, మర్మావయవాలకు విద్యుత్తు షాక్ ఇచ్చిన రమేశ్ అనే వ్యక్తిని, అతని అనుచరులను కలబురగి విశ్వవిద్యాలయం ఠాణా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
ప్రజ్వల్కు మోదీనే రక్ష: కాంగ్రెస్
[ 12-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రక్షిస్తున్నారని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజ్వల్ వద్ద ఉన్న డిప్లమేటిక్ పాస్పోర్టును రద్దు చేస్తే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో భారత్కు తిరిగి వస్తారని... -
ఆత్మాభిమానంతోనే బానిసత్వ విముక్తి
[ 12-05-2024]
ఆత్మాభిమానం లేకపోతే బానిసలుగా మారవలసి ఉంటుందని- అది సాధించిన నాడే స్వేచ్ఛ సాధ్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటే ఇతరులకు బానిసలుగా ఉంటూ, భజన చేయవలసిన అవసరం ఉండదన్నారు. -
ఎస్ఎం కృష్ణకు కొనసాగుతున్న చికిత్స
[ 12-05-2024]
వయోసహజమైన ఆరోగ్య సమస్యలతో మణిపాల్ ఆసుపత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు వైద్యులు చికిత్సను కొనసాగిస్తున్నారు. -
వారి ఓటమికి.. అదే కారణం : ఎంబీ
[ 12-05-2024]
అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కాకుండానే తాము రామునికి గుడి కట్టామని చేసుకున్న ప్రచారమే భాజపా ఓటమికి కారణమవుతుందని మంత్రి ఎంబీ పాటిల్ పేర్కొన్నారు. -
కూటమికి ఓటేస్తేనే ‘ఆంధ్ర’కు బలిమి!
[ 12-05-2024]
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేపట్టి మనకు, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు వారు పేర్కొన్నారు.