ఎన్నెస్పీ స్థలం కబ్జాకు యత్నం
ఖమ్మంలోని రామచంద్రయ్యనగర్ కాలనీలో ఎన్నెస్పీ భూములపై నిరుపేదలు నిర్మించుకున్న గుడిసెలు తొలగిస్తున్న వైనమిదీ. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారంటూ కొద్ది నెలల క్రితం అధికారులు
ప్రభుత్వ భూమిగా గుర్తించినా చర్యలకు వెనకాడుతున్న అధికారులు
ఖమ్మంలోని రామచంద్రయ్యనగర్ కాలనీలో ఎన్నెస్పీ భూములపై నిరుపేదలు నిర్మించుకున్న గుడిసెలు తొలగిస్తున్న వైనమిదీ. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారంటూ కొద్ది నెలల క్రితం అధికారులు రంగంలోకి దిగి దాదాపు 60కి పైగా నిర్మాణాలు కూల్చివేయగా ఎన్నో కుటుంబాలకు నిలువ నీడ కరవైంది. అధికారుల కాళ్లావేళ్లా పడ్డా ఫలితం లేకపోయింది.
ఈటీవీ ఖమ్మం: పేదలకో న్యాయం.. బడాబాబులకో న్యాయం అన్నట్లుంది ఖమ్మంలో రెవెన్యూ, ఎన్నెస్పీ అధికారుల తీరు. నిలువ నీడలేని నిరుపేదలు ఎన్నెస్పీ కాల్వల పక్కనే ఉన్న ఖాళీ జాగాల్లో నిర్మాణాలు వేసుకొంటే అధికార దర్పం ప్రదర్శించే యంత్రాంగానికి.. బడా బాబులపై చర్యలకు మాత్రం చేతులు రావడం లేదు. నగరంలోని గొల్లగూడెం రోడ్డులో సర్వే నంబరు 413లో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి ప్రభుత్వం 59 జీవో కింద క్రమబద్ధీకరణ చేసింది. కొంతమంది ఇళ్లు నిర్మించుకున్నారు. ఇంకా చాలా స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే.. ఇక్కడ రహదారికి ఆనుకుని ఉన్న సుమారు 300 నుంచి 400 గజాల అత్యంత విలువై ఎన్నెస్పీ కాల్వ భూమిపై ఓ స్థిరాస్తి వ్యాపారి కన్నుపడింది. ప్రభుత్వ భూమిలో పాగా వేసేందుకు పక్కా ప్రణాళికతో కాల్వ భూమి పూడ్చేసి నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
అధికార పార్టీ పేరుజెప్ఫి.
గొల్లగూడెం, పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం భూములకు డిమాండ్ ఉంది. రహదారికి ఇరువైపులా గజం భూమి విలువ సుమారు రూ.70,000 వరకు ఉంది. అంటే ఈ లెక్కన స్థిరాస్తి వ్యాపారి కబ్జాకు యత్నం చేస్తున్న భూమి విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందన్న మాట. ప్రభుత్వ భూమిగా తేల్చినప్పటికీ ఆ తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించడం లేదు. కబ్జాకు యత్నిస్తున్న సదరు వ్యక్తి తాను అధికార పార్టీ నాయకులకు దగ్గరి వ్యక్తినని, అవసరమైతే ఫోన్లు చేయిస్తానని చెప్పడంతో అధికారులు చర్యలకు వెనకడుకు వేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, సర్వేకు వెళ్లిన అధికారులపై బెదిరింపులకు సైతం పాల్పడ్డట్లు తెలిసింది. నెలలు గడుస్తున్నా అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం లేదంటూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
..ఇది లకారం కూడలి నుంచి గొల్లగూడెం వెళ్లే దారిలో ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఎన్నెస్పీకి చెందిన భూమి. సుమారు 400 గజాల వరకు ఉంటుంది. ఈ భూమిలో నుంచే గతంలో ఎన్నెస్పీ కాలువ ఉండేది. పక్కనే ఉన్న భూమి మొత్తం ఎన్నెస్పీదే. ఏళ్లుగా నివాసం ఉంటున్న కొందరికి క్రమబద్ధీకరణ పేరిట ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఇదే అదునుగా తీసుకున్న నగరానికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఈ భూమిపై కన్నేశాడు. రాత్రికి రాత్రే కాలువ భూమిలో పాగా వేసి.. ప్రహరీ తిప్పి ఏకంగా నిర్మాణాలు చేపట్టాడు. భూ కబ్జాపై రెవెన్యూ, ఎన్నెస్పీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల తర్వాత అధికారులు స్పందించారు. ఆక్రమణకు గురైన భూమి ఎన్నెస్పీ భూమిగా తేల్చి మార్కింగ్ సైతం చేశారు. అయినా కబ్జా పర్వం ఆగడం లేదు.
విషయం మా దృష్టిలో ఉంది శైలజ, ఖమ్మం అర్బన్ తహసీల్దారు
ఈ భూమికి సంబంధించిన అంశం మా దృష్టిలో ఉంది. గతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశాం. మరోసారి పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ విదానం.. ప్రత్యక్ష ప్రసారం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. -
నేటితో ప్రచారానికి తెర.. ఇక ప్రలోభాల ఎర
[ 11-05-2024]
సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుతోంది. కీలకమైన ప్రచార పర్వానికి శనివారం సాయంత్రం తెరపడనుంది. -
ఓటుహక్కు వినియోగించుకోండి
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ గౌతమ్ పిలుపునిచ్చారు. -
ఖమ్మం నగరానికి పాలేరు నీటి విడుదల
[ 11-05-2024]
ఖమ్మం నగరవాసుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వకు నీటిని శుక్రవారం విడుదల చేశారు. -
రెండు గంటలకోసారి పోలింగ్ శాతాల వెల్లడి: కలెక్టర్
[ 11-05-2024]
జిల్లాలోని పోలింÞ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. హైదరాబాë్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. -
బంగారు కవచాల అలంకారంలో రామయ్య దర్శనం
[ 11-05-2024]
భద్రాచల రామాలయంలో స్వామివారు శుక్రవారం బంగారు కవచాల అలంకారంలో దర్శనమిచ్చారు. -
జాతి భవిష్యత్తు కోసమే భాజపాకు మద్దతు
[ 11-05-2024]
ముప్పై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో స్వార్థం చూసుకోలేదని, ఎన్నో పదవులు ఇస్తామని రాజకీయ పార్టీలు ఆశ చూపినా చలించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. -
అనుభవమున్న బలరాంనాయక్కే పట్టం కట్టండి
[ 11-05-2024]
కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్కు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను గెలిపించాలి: నామా
[ 11-05-2024]
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను గెలిపించాలని ఖమ్మం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
ప్రతిభావంతులకు ఉచిత కార్పొరేట్ విద్య
[ 11-05-2024]
పదో తరగతిలో ప్రతిభచాటిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. -
నేడు చంద్రబాబు కోసం రాజశ్యామల యాగం
[ 11-05-2024]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రాజశ్యామల యాగాన్ని శనివారం నిర్వహించనున్నట్లు తెదేపా తెలంగాణ లీగల్ సెల్ నాయకులు -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది నామినేషన్లు చెల్లుబాటు
[ 11-05-2024]
ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 69 మంది అభ్యర్థులు 117 సెట్ల నామినేషన్లు సమర్పించారని రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
[ 11-05-2024]
ఉరేసుకుని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గుండెపూడిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!