ఎన్నికల విధులు సమర్థంగా నిర్వర్తించాలి
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ లోక్సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఖమ్మం లోక్సభ స్థానం సాధారణ పరిశీలకుడు సంజయ్ జి.కోల్టే అన్నారు.
సిబ్బందికి సూచనలిస్తున్న సాధారణ పరిశీలకుడు సంజయ్ జి.కోల్టే, చిత్రంలో పోలీస్ విభాగం పరిశీలకుడు చరణ్జిత్ సింగ్, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు గౌతమ్, ప్రియాంక, వ్యయ పరిశీలకుడు శంకర్ అనంత్ మిశ్రా, ఎస్పీ రోహిత్రాజు
కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్టుడే: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ లోక్సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఖమ్మం లోక్సభ స్థానం సాధారణ పరిశీలకుడు సంజయ్ జి.కోల్టే అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో వ్యయ పరిశీలకుడు శంకర్ అనంత్ మిశ్రా, పోలీస్ విభాగం పరిశీలకుడు చరణ్జిత్ సింగ్, ఖమ్మం లోక్సభ స్థానం రిటర్నింగ్ అధికారి వి.పి.గౌతం, కలెక్టర్ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో శనివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ ఎన్నికల క్రతువును విజయవంతం చేయాలని సంజయ్ అన్నారు. ‘ఎవరికి కేటాయించిన విధులను వారు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి. ప్రచారం, వ్యయ పరిశీలన, పోలింగ్ బృందాలు క్రియాశీలకంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. పోలింగ్ కు 72 గంటల ముందు నుంచే ఎంసీసీ బృందాలు అప్రమత్తం కావాలి. తాజా శిక్షణను సద్వినియోగం చేసుకుని విధి నిర్వహణలో సమర్థంగా రాణించాలి. పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఓటరు చైతన్యానికి స్వీప్ విభాగం విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి’ అని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు అక్రమంగా తరలించకుండా చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని పోలీస్ విభాగం పరిశీలకుడు చరణ్జిత్ సింగ్ ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్థానిక పోలీసులు ఇతర బృందాల సమన్వయంతో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల గురించి కలెక్టర్ ప్రియాంక అల ఉన్నతాధికారులకు వివరించారు. కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్ అధికారులుగా కొత్తగూడెం ఆర్డీఓ మధు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఓటరు చీటీల పంపిణీ చేపట్టినట్లు వివరించారు. ఏర్పాట్ల వివరాలపై పవర్ పాయంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీఓ విద్యాచందన, ఎన్నికల విభాగం తహసీల్దార్ దారా ప్రసాద్, డీటీ రంగాప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ను సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్లో శనివారం మాట్లాడారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వాహనాలు ఆపేయాలన్నారు. -
పోలింగ్ ముగిసే వరకు ‘నిశ్శబ్దం’
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. పోలింగ్ క్రతువు ముగింపునకు 48 గంటల ముందు నుంచి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. -
గళాలు.. బలాలు
[ 12-05-2024]
ప్రముఖులు గెలుపొందిన నేల.. పలు సందర్భాల్లో భిన్నమైన ఫలితానిచ్చిన నియోజకవర్గం ఖమ్మం పార్లమెంటరీ స్థానం.. అతిరథుల పోటీ నేపథ్యంలో ఈసారి ప్రచారం హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అంశంతోనే నియోజకవర్గం, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. -
పోలింగ్కు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ఓటుహక్కు ఆవశ్యకతను వివరిస్తూ నగరంలోని వివిధ కూడళ్లలో నిలువెత్తు బ్యాలెట్ యూనిట్ల ఫ్లెక్సీలు అమర్చారు. తప్పనిసరిగా ఓటేయాలని ప్రజలను చైతన్యపరుస్తున్నారు. -
‘రాహుల్ని ప్రధాని చేయటమే లక్ష్యం’
[ 12-05-2024]
శాసనసభ ఎన్నికల ఫలితాలు ఖమ్మం, మహబాబూబాద్ లోక్సభ స్థానాల్లో పునరావృతమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
అందుబాటులో ఉన్నా.. ఆశీర్వదించండి: నామా
[ 12-05-2024]
ఖమ్మం జిల్లా గొంతుకగా పనిచేసే తనను మరోసారి ఆశీర్వదించి లోక్సభకు పంపించాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
ఒక్క అవకాశమివ్వండి: తాండ్ర
[ 12-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపాకు ఒక్క అవకాశమివ్వాలని ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కోరారు. కులమతాలకు అతీతంగా తనను ఆశీర్వదించాలని బహిరంగ లేఖ ద్వారా శనివారం విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు గెలుపు కోసం రాజశ్యామల యాగం
[ 12-05-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట పాలన అంతమై చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రాజశ్యామల యాగం నిర్వహించినట్టు తెదేపా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గొల్లపూడి రామారావు అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
[ 12-05-2024]
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. కారేపల్లి అడ్డరోడ్డుకు చెందిన చింతా విజయలక్ష్మి(38) కారేపల్లిలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు తన చిన్నకుమారుడు వరుణ్సాయితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. -
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
[ 12-05-2024]
అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రియాంక అల కోరారు. కొత్తగూడెంలో శనివారం మాట్లాడారు. తుది దశ ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందికి పోలింగ్ కేంద్రాలను కేటాయించామన్నారు.