ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన: మంత్రులు
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన అందుతుందని.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సత్యనారాయణపురంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి, మాజీ మంత్రి సంభాని తదితరులు
ఖమ్మం కమాన్బజార్, ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన అందుతుందని.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాలను ఖమ్మం, సత్యనారాయణపురంలో వేర్వేరుగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లాతో ఏళ్లుగా అనుబంధం ఉన్న రఘురాంరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ కన్నా రెండింతల ఆధిక్యంతో ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అధికారం ఉందని ప్రగల్భాలు పలికిన భారాస నాయకులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చెంప చెల్లుమనిపించారని చెప్పారు. ప్రస్తుతం తాము అనుభవిస్తున్న పదవులు ప్రజల చలువే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కోసమైనా రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్ట ఫలితంగానే రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. రాష్ట్రాన్ని రూ.7 వేల కోట్ల అప్పుల పాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను పదవి నుంచి దిగిపోగానే కరెంటు పోతుందని అనడం విడ్డూరమని చెప్పారు.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసిన ఆయన విద్యుత్పై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అధికారం, అహంకారంతో విర్రవీగిన భారాస పాలకులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు. కేంద్రంలో మతోన్మాద భాజపా సర్కారును గద్దెదింపుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని తప్పనిసరిగా అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా 15 రోజులు కష్టపడాలని సూచించారు. కష్టపడ్డ వారందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని తెలిపారు. పాలేరు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు అశోక్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పీసీసీ సభ్యుడు మహ్మద్ జావేద్, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మద్దినేని స్వర్ణకుమారి, దొబ్బల సౌజన్య, ఫాతిమా జోహ్రా, ఎర్రం బాలగంగాధర్ తిలక్, పిడమర్తి రవి, నల్లమల వెంకటేశ్వరరావు, సాధు రమేశ్రెడ్డి, కమర్తపు మురళీ, చావా నారాయణరావు, సైదుబాబు, సలాం, విక్రమ్, శ్రీనివాసరెడ్డి, నరేశ్రెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి, బండి జగదీశ్, మల్లారెడ్డి, తిరుమలాయపాలెం జడ్పీటీసీ సభ్యుడు బెల్లం శ్రీనివాసరావు, నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, సీపీఐ నాయకులు జానీమియా, దండి సురేశ్, మౌలానా, సీపీఎం నాయకులు ఎర్రా శ్రీకాంత్, బత్తినేని వెంకటేశ్వరరావు, కొమ్ము శ్రీను, సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- రీ అనంతరం ఖమ్మం నగరంలోని వివిధ డివిజన్ల నుంచి పార్టీలో చేరేందుకు పలువురు కార్యకర్తలను నేతలు ఆహ్వానించగా స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గందరగోళం సృష్టించారు. జిల్లా నాయకులు వారిని సముదాయించడంతో శాంతించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ను సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్లో శనివారం మాట్లాడారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వాహనాలు ఆపేయాలన్నారు. -
పోలింగ్ ముగిసే వరకు ‘నిశ్శబ్దం’
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. పోలింగ్ క్రతువు ముగింపునకు 48 గంటల ముందు నుంచి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. -
గళాలు.. బలాలు
[ 12-05-2024]
ప్రముఖులు గెలుపొందిన నేల.. పలు సందర్భాల్లో భిన్నమైన ఫలితానిచ్చిన నియోజకవర్గం ఖమ్మం పార్లమెంటరీ స్థానం.. అతిరథుల పోటీ నేపథ్యంలో ఈసారి ప్రచారం హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అంశంతోనే నియోజకవర్గం, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. -
పోలింగ్కు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ఓటుహక్కు ఆవశ్యకతను వివరిస్తూ నగరంలోని వివిధ కూడళ్లలో నిలువెత్తు బ్యాలెట్ యూనిట్ల ఫ్లెక్సీలు అమర్చారు. తప్పనిసరిగా ఓటేయాలని ప్రజలను చైతన్యపరుస్తున్నారు. -
‘రాహుల్ని ప్రధాని చేయటమే లక్ష్యం’
[ 12-05-2024]
శాసనసభ ఎన్నికల ఫలితాలు ఖమ్మం, మహబాబూబాద్ లోక్సభ స్థానాల్లో పునరావృతమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
అందుబాటులో ఉన్నా.. ఆశీర్వదించండి: నామా
[ 12-05-2024]
ఖమ్మం జిల్లా గొంతుకగా పనిచేసే తనను మరోసారి ఆశీర్వదించి లోక్సభకు పంపించాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
ఒక్క అవకాశమివ్వండి: తాండ్ర
[ 12-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపాకు ఒక్క అవకాశమివ్వాలని ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కోరారు. కులమతాలకు అతీతంగా తనను ఆశీర్వదించాలని బహిరంగ లేఖ ద్వారా శనివారం విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు గెలుపు కోసం రాజశ్యామల యాగం
[ 12-05-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట పాలన అంతమై చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రాజశ్యామల యాగం నిర్వహించినట్టు తెదేపా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గొల్లపూడి రామారావు అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
[ 12-05-2024]
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. కారేపల్లి అడ్డరోడ్డుకు చెందిన చింతా విజయలక్ష్మి(38) కారేపల్లిలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు తన చిన్నకుమారుడు వరుణ్సాయితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. -
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
[ 12-05-2024]
అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రియాంక అల కోరారు. కొత్తగూడెంలో శనివారం మాట్లాడారు. తుది దశ ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందికి పోలింగ్ కేంద్రాలను కేటాయించామన్నారు.