అభ్యర్థుల్లో వాటా 3 శాతమే
ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యానికి ప్రతీక. ఏ ఎన్నిక జరిగినా ఓటు జాబితాలో మహిళోత్సాహం ఎక్కువనే చెప్పాలి. వివిధ ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా వీరే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల తలరాతను మార్చటంలో కీలకపాత్ర వహించారు.
ఖమ్మం లోక్సభ నుంచి ఇద్దరు మహిళల ప్రాతినిధ్యం
ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యానికి ప్రతీక. ఏ ఎన్నిక జరిగినా ఓటు జాబితాలో మహిళోత్సాహం ఎక్కువనే చెప్పాలి. వివిధ ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా వీరే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల తలరాతను మార్చటంలో కీలకపాత్ర వహించారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజాగా వెల్లడైన ఓటరు జాబితాలో పురుషుల కంటే అత్యధికంగా మహిళా ఓటర్లే ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో మాత్రం వారికి తగిన ప్రాతినిధ్యం దక్కలేదనే చెప్పవచ్చు.
పాల్వంచ, న్యూస్టుడే: ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ మినహా మరే పార్టీ మహిళా అభ్యర్థుల ఎంపికపై పెద్దగా మొగ్గుచూపలేదు. దేశ భవితను నిర్ణయించే, చట్టాలు రూపొందించే పార్లమెంట్లో ఖమ్మం స్థానం నుంచి ఇప్పటివరకు ఇద్దరు మహిళలు, మొత్తం అయిదు సార్లు అడుగుపెట్టారు. మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. గెలిచిన మహిళలు ఇద్దరూ స్థానికేతరులే కావటం విశేషం. ఎన్నికల్లో స్థానిక మహిళలెవరినీ లోక్సభకు పంపే అవకాశం ఇక్కడి ఓటర్లకు దక్కలేదు.
ఆ ఇద్దరు.. ఐదుసార్లు ప్రాతినిధ్యం
ఖమ్మం లోక్సభ స్థానానికి 1951 ఎన్నికల నుంచి తాజా పోరు వరకు బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థులు 221 మంది ఉన్నారు. వీరిలో మహిళలు కేవలం ఏడుగురు (3.17%) మాత్రమే. ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కించుకున్న వారిలో లక్ష్మీకాంతమ్మ, రేణుకాచౌదరి (కాంగ్రెస్), స్వర్ణకుమారి (తెదేపా) ఉన్నారు. మిగతా వారంతా స్వతంత్ర అభ్యర్థులే. తొలినాళ్లలో జరిగిన 1962, 67, 72 ఎన్నికల్లో తేళ్ల లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత అదే పార్టీ నుంచి టిక్కెట్ దక్కించుకున్న మహిళా అభ్యర్థి రేణుకాచౌదరే. 1999, 2004లో వరుసగా ఆమె హస్తం గుర్తుపై గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. 2019లోనూ కాంగ్రెస్ అభ్యర్థినిగా బరిలో నిలిచినా ఓటమి పాలయ్యారు. మొత్తమ్మీద ఖమ్మం స్థానం నుంచి ఇప్పటివరకు అయిదు సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించింది ఇద్దరు మహిళలే. 1999లో అప్పటి ప్రధాన పార్టీ అయిన తెదేపా నుంచి బరిలో నిలిచే అవకాశం స్వర్ణకుమారికి దక్కింది. ఆమె రేణుకాచౌదరిపైనే స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. వీరు కాకుండా వివిధ ఎన్నికల్లో ఎన్డీ, స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు బరిలో నిలిచారు. 1980లో ఆలూరి అన్నపూర్ణ విశాలాక్షి (స్వతంత్ర), 1999, 2004లో చండ్ర అరుణ(స్వతంత్ర), 2004లో నలజాల సరోజ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), 2014లో కల్తీ రాములమ్మ (స్వతంత్ర) పోటీచేశారు. వీరెవరూ ఓట్లపరంగా పెద్దగా ప్రభావం చూపలేదు. ఓటు భాగస్వామ్యంలో సగం మందికిపైగా మహిళలున్న ఈ లోక్సభ స్థానంలో.. తాజా ఎన్నికల్లో ఒక్క వనిత కూడా నామినేషన్ వేయలేదు. ఖమ్మం లోక్సభ స్థానం చర్రితలో అత్యధికంగా 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచింది ఈ ఎన్నికల్లోనే. అంతకుముందు 1996లో 28 మంది అత్యధికంగా పోటీపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుణమాఫీపై కదలిక.. అర్హుల జాబితా రూపకల్పనలో అధికారుల నిమగ్నం
[ 16-05-2024]
ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టత ఇచ్చారు. పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన కసరత్తు మొదలైంది. -
వన్యప్రాణులకు నీటి వసతి
[ 16-05-2024]
వేసవి తాపానికి మనుషులే తట్టుకోలేకపోతున్నారు. అడవుల్లో ఉండే జంతువులు, పక్షులు అల్లాడుతున్నాయి. తాగేందుకు నీరు లభించక సమీప గ్రామాల్లోకి వచ్చి కుక్కల దాడులు, వేటగాళ్ల ఉచ్చులకు బలైపోతున్నాయి. -
మళ్లీ కబ్జా కూత
[ 16-05-2024]
ఇల్లెందు రైల్వే స్టేషను నుంచి రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైలు 2006లో రద్దయింది. ఆ తర్వాత శాఖ అధికారులు సంస్థ స్థలాల పరిరక్షణపై నిర్లక్ష్యం ప్రదర్శించటంతో తొలినాళ్లలోనే పెద్ద మొత్తంలో అన్యాక్రాంతమయ్యాయి. -
ఇక పట్టభద్రులపై గురి
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. ఈ ఎన్నిక బరిలో 52 మంది ఉండగా.. 27న తేదీన పోలింగ్ జరగనుంది. -
విద్యా సమాచార నిర్వహణకు ట్యాబ్లు
[ 16-05-2024]
పాఠశాల స్థాయి నుంచే విద్యా సమాచారం, నివేదికలను ఆన్లైన్లో పంపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ గతేడాది మార్చిలో ట్యాబ్లను అందజేసింది. వాటికి ఇంటర్నెట్ డేటా కోసం కావాల్సిన సిమ్ కార్డులను తాజాగా పంపిణీ చేసింది. -
రేపట్నుంచి బొమ్మ బంద్
[ 16-05-2024]
సినిమా థియేటర్లు ఈ నెల 17(శుక్రవారం) నుంచి మూగబోనున్నాయి. ప్రేక్షకుల సందడి లేక అవి కళతప్పనున్నాయి. -
స్ట్రాంగ్ రూంలకు పటిష్ఠ భద్రత: కలెక్టర్
[ 16-05-2024]
స్ట్రాంగ్ రూంల వద్ద సాయుధ బలగాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
సమస్యలు పరిష్కరిస్తేనే స్థాయి నిలిచేది!
[ 16-05-2024]
జిల్లాలో జరిగిన అభివృద్ధిని, చేయాల్సిన పనులను బేరీజు వేసుకోవడంలో స్థాయీ సంఘాల సమావేశాలు కీలకపాత్ర పోషిస్తాయి. జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని ఏడు స్థాయీ సంఘాల సమావేశాలను గురువారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
జూన్ 4 వరకు దరఖాస్తు గడువు పెంపు
[ 16-05-2024]
సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగించింది. -
డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల కన్నుమూత
[ 16-05-2024]
భారాస నేత, ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు(69) అనారోగ్యంతో కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఆయన కాలేయ(లివర్) సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. -
మనసున్న రాజు..
[ 16-05-2024]
ఒకటీ రెండు కాదు.. ఏకంగా 40 గోవులు ఆ గడిలో కన్పిస్తుంటాయి.. ఇదేదో గోశాల అనుకుంటే పొరబాటు.. అలాగని విరాళాలు సేకరించి పశువుల బాగోగులు చూసే సంస్థ అంతకన్నా కాదు. -
తిరుగు ప్రయాణ తిప్పలు
[ 16-05-2024]
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి ముగియడంతో తమ స్వస్థలాల నుంచి వివిధ ప్రాంతాల వారు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. -
ఎన్నికల వేళ ఆర్టీసీకి ఆదాయం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 14 వరకు ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. ఖమ్మం రీజియన్ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చివెళ్లిన ఓటర్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని -
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి: రాహుల్ బొజ్జ
[ 16-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకులు రాహుల్ బొజ్జ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి